గిరిజన్ తేనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిరిజన్ తేనె

ఆంధ్ర ప్రదేశ్ అడవుల నుంచి సేకరించే రాక్ బీ ముడి తేనె సేకరణపై ఆధారపడిన గిరిజన కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం జిసిసి 180 నుండి 200 మెట్రిక్ టన్నుల రాక్ బీ ముడి తేనెను గిరిజనుల నుంచి సేకరిస్తుంది. ఈ తేనెను గిరిజన్ తేనె అనే బ్రాండ్ పేరుతో జిసిసి వివిధ సైజుల్లో విక్రయిస్తుంది. తేనె శుద్ధి, ప్యాకింగ్ కొరకు జిసిసికి రాజమండ్రి, చిత్తూరులో ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. అగ్ మార్క్, ఆర్గానిక్ గుర్తింపు పొందిన గిరిజన్ తేనే పోషక, ఔషద విలువలు కలిగినది. దగ్గు, జలుబు, జ్వరం మొ॥ వాటి నుండి రక్షించడంతో పాటు రక్తశుద్ధికి, గాయాలు మాన్పడానికి తోడ్పడుతుంది. ఇంకా ఎన్నో రకాల ఆయుర్వేద మందులలో వినియోగింపబడుతుంది. గిరిజన్ తేనే 5 కేజీలు, 1 కేజీ, 500గ్రా॥లు, 250 గ్రా॥లు 200 గ్రా॥లు, 50 గ్రా॥లు, 20 గ్రా॥లు సీసాల్లో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. జిసిసి తమ పంపిణీదార్లు, విక్రయశాలల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తుంది.