చంపా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చం పా
చైం థాన్హ్
192–1832
చంపా ప్రాంతం సిర్కా 1000-1100లో
చంపా ప్రాంతం సిర్కా 1000-1100లో
రాజధానిఇంద్రపుర
(875–978)

విజయ
(978–1485)
పాండురంగ
(1485–1832)
సామాన్య భాషలుచామ్, సంస్కృతం
మతం
చామ్ మతం, హిందూ మతం , బౌద్ధ మతం, తర్వాతి దశలో ఇస్లాం
ప్రభుత్వంరాజరికం
చరిత్ర 
• స్థాపన
192
• పాండురంగ ప్రాంతాన్ని వియత్నాంకు చెందిన న్గుయెన్ వంశం ఆక్రమించుకోవడం.
1832
Succeeded by
న్గుయెన్ వంశం

నేటి వియత్నాం దక్షిణ, మధ్య ప్రాంతాల తీరాన్ని అంటుకుని వ్యాపించి స్వతంత్రులైన చామ్ ప్రజల రాజ్యవ్యవస్థను చంపా అని పిలిచేవారు. దాదాపుగా 7వ శతాబ్దం నుంచి 1832 వరకూ చంపా నిలిచివుండేది. 1832లో వియత్నాం ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని వియత్నాంలో కలిపిసేకుంది. ఈ రాజ్యం పేరు చామ్, కాంబోడియన్ భాషల్లో నగర చంప (సంస్కృతం: नगर चम्पा, Khmer: ចាម្ប៉ា) గా, వియత్నామీస్ భాషలో Chăm Pa (占城 Chiêm Thành సిని-వియత్నామీస్ భాషాపదజాలంలో) గా, చైనీస్ రికార్డుల్లో ఝాన్‌చెంగ్ అనీ వేర్వేరుగా ఉంది.

ఆధునిక వియత్నాం, కంబోడియాలోని చామ్ ప్రజలు ఈ మాజీ రాజ్యం అవశేషాలు. వారు మలయో పాలినేషియన్ కుటుంబానికి చెందిన చామ్ భాషలు మాట్లాడుతారు. ఇవి బాలీ-ససక్ భాషలు, మలయిక్ భాషలకు అతిదగ్గరి సంబంధం కలిగివుంటాయి. సా.శ.7వ శతాబ్దంలో హిందువులు చంపాను నిర్మించారు. పాణినీయ వ్యాకరణం, పురాణాలు, జ్యోతిష్యం, షడ్దర్శనాలు, ధర్మశాస్త్రములు శైవాగమాలు, హిందువుల చతుష్షష్టి కళలు ఈ దేశాల్లో ఉండేవి. ఇక్కడ శైవ మతము ప్రబలడంతో ఎన్నో శివాలయాలుండేవి. వాటి శిథిలాలు ఇప్పటికీ పరిశోధకులకు లభిస్తున్నాయి.[1]

మూలాలు[మార్చు]

  1. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=చంపా&oldid=3831569" నుండి వెలికితీశారు