చర్చ:తెలుగు పత్రికలు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: ఈ వ్యాసం నుండి "మీకు తెలుసా?"లు టాపిక్లో 4 నెలల క్రితం. రాసినది: Chaduvari
తెలుగు పత్రికలు పేజీని పత్రికలు ప్రాజెక్టులో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఈ వ్యాసం నుండి "మీకు తెలుసా?"లు
[మార్చు]ఈ వ్యాసంలో గమనించదగ్గ కొన్ని "మీకు తెలుసా?"లు:
- 1936 లో తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వచ్చిన జనవాణి, పూర్తిగా వాడుకభాషలో వచ్చిన తొలి దినపత్రిక
- కర్నాటిక్ గెజెట్ తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక
- 1930 లో మొదలై, 95 ఏళ్ళుగా దాదాపు నిరంతరాయంగా ప్రచురణలో ఉన్న పత్రిక, జమీన్ రైతు
- పేరులో "ఆంధ్ర" అనే మాట ఉన్న తొలి పత్రిక "ఆంధ్రభాషాసంజీవని"
- 1887 లో మొదలైన కృష్ణా వృత్తాంతిని, కృష్ణాన్యూస్ గా మారి చివరికి దేశాభిమానిగా పేరు మార్చుకుని 1901 లో దినపత్రికగా మారింది. ఇదే తెలుగులో మొట్టమొదటి దినపత్రిక.
- తెలంగాణాలో తొలిపత్రిక "హితబోధిని"
- నిజాము అణచివేత నుండి తప్పించుకునేందుకు, హైదరాబాద్, సారథి పత్రికలను విజయవాడలో ముద్రించి, తెలంగాణలో రహస్యంగా పంచేవారు
- తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వచ్చిన జనవాణి, పూర్తిగా వాడుకభాషలో వచ్చిన తొలి దినపత్రిక
- పిల్లల కోసమే ప్రత్యేకించిన తొలి పత్రిక బాలమిత్ర. అది 1914 లో వెలువడింది.
- తెలుగులో స్త్రీల కోసం స్థాపించిన మొదటి పత్రిక సతీహితబోధిని. అది 1883 లో వచ్చింది.
- తెలుగులో మొదటి సినిమా పత్రిక చిత్రకళ. అది 1938 లో వచ్చింది.
- వితంతు పునర్వివాహాలను వ్యతిరేకించిన స్త్రీల పత్రిక సావిత్రి
- తెలుగులో కార్టూన్ని ప్రచురించిన తొలి పత్రిక ఆంధ్రపత్రిక
- పత్రికలలో తొలి కార్టూను వేసిన కార్టూనిస్టు తలిశెట్టి రామారావు
- తొలి తెలుగు క్రాస్వర్డ్ పజిల్ శ్లిష్టాక్షరపదబంధము పేరుతో 1928 ఫిబ్రవరిలో వచ్చింది. దీన్ని ఆంధ్రభారతి ప్రచురించింది. దాన్ని శ్రీశ్రీ కూర్చాడు
- 1908 మార్చి 26 న స్వరాజ్య పత్రికలో రాసిన సంపాదకీయానికి గాను సంపాదకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావుకు, బోడి నారాయణరావుకూ జైలు శిక్షలు పడ్డాయి. ఆ పత్రిక మూతబడింది
- వందేమాతరం ఉద్యమంలో ఆంధ్రదేశంలో జైలుశిక్షలు పొందిన తొలి రాజకీయ ఖెదీలు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణరావు
- 1908 లో కృష్ణాపత్రికను బ్రిటిషు ప్రభుత్వం మూసివేయకుండా కాపాడుకునేందుకు సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు రాజీనామా చేసాడు.