తెలుగు పత్రికలు
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
తొలి తెలుగు పత్రిక పేరు ఆంధ్రపత్రిక. దీని వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఈ పత్రిక 1908లో ఆరంభమయ్యింది. అటు పిమ్మట తెలుగు పత్రికారంగం చాలా అభివృద్ధి చెందింది. జనవరి -జూన్ 2013 ఎబిసి గణాంకాల ప్రకారం ఎబిసి సభ్య తెలుగు దినపత్రికలు (ఈనాడు,సాక్షి, ఆంధ్రజ్యోతి) 64 సంచికలతో 3,530,263 కాపీలు పంపిణీ చేయబడుతున్నాయి. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 3,679,788 గా వుంది అనగా 4శాతం (అర్థ సంవత్సర) పెరుగుదల ఉంది. వార్తా వారపత్రికలలో ఒక సంచిక 13,441 స్థాయిలో వుండగా గత ఆరు మాసాలలో 14,187 గా ఉంది. ఇక మిగతా పత్రికల విషయంలో సర్క్యులేషన్ 319,746 గా ఉంది. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 304,178 గా ఉంది.[1]
పత్రికల వర్గీకరణ[మార్చు]
పత్రికలు ప్రచురించే కాలాన్ని అనుసరించి దిన, వార, పక్ష, మాస పత్రికలుగా, పత్రికల్లో ప్రచురితమయే అంశాలను అనుసరించి వార్త, సాహిత్య, ఆర్థిక, సాంకేతికాది పత్రికలుగా, ప్రచురణ పొందే పద్ధతులను బట్టి అచ్చు, రాత, గోడ పత్రికలుగా విభజించుకోవచ్చు.
కాలాన్ని అనుసరించే విభజన[మార్చు]
పత్రిక సంచికల మధ్య ఉండే వ్యవధిని అనుసరించి వర్గీకరిస్తే వాటిని ఇలా విభజిస్తారు:
దిన పత్రికలు[మార్చు]
రోజుకు ఒక సంచికగా వెలువడే పత్రికలను దినపత్రికలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా వార్తా పత్రికలు దినపత్రికలుగా వెలువడుతూంటాయి. ప్రస్తుతం తెలుగు దినపత్రికలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త,ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర దినపత్రిక, ప్రజాశక్తి వంటి పలు పత్రికలు పేరొందాయి. తెలుగు పత్రికల చరిత్రలో తొలుత ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక,నమస్తే తెలంగాణ వంటివి నడిచాయి. వీటిలో కృష్ణా పత్రిక మరల ప్రారంభమైంది. చాలావరకూ దినపత్రికలు ఉదయం వస్తూంటాయి. సాయంకాల సంచికలు వెలువరించే పత్రికలు మరికొన్ని ఉంటాయి.
సమాచార వ్యవస్థ వేగంగా లేని రోజుల్లో ఉదయం రావాల్సిన పత్రికలు మధ్యాహ్నం పాఠకుని చేతికి అందేవి. ఈ నేపథ్యంలో తెల్లవారేసరికల్లా పాఠకుని చేతికి అందడాన్ని సవాలుగా స్వీకరించిన పత్రికలు సర్క్యులేషన్లో ముందుకు వెళ్ళి ఇతర పత్రికల్ని వెనక్కి నెట్టాయి.
వార పత్రికలు[మార్చు]
వారానికి ఒక సంచిక వెలువరించే పత్రికలను వారపత్రికలు అంటారు. ప్రస్తుతం ప్రముఖ వారపత్రికలుగా వెలుగొందుతున్నవి స్వాతి సపరివార పత్రిక, ఆంధ్రభూమి, నవ్య వారపత్రిక మొదలైనవి.
మాస పత్రికలు[మార్చు]
ఆంధ్రభూమి మాసపత్రిక, స్వాతి, తెలుగు వెలుగు, విపుల,చతుర,ధైవమ్ , దర్శనమ్, సన్నిధానమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక,ప్రయోక్త తెలుగు జాతీయ మాసపత్రిక,
ద్వైమాసిక పత్రికలు[మార్చు]
మరికొన్ని పిరియాడికల్స్ (వార, పక్ష, మాసపత్రికలు) వెలువడుతున్నాయి.
ఆర్ధికరంగ పత్రికలు[మార్చు]
- యోజన
సాహిత్య పత్రికలు[మార్చు]
మాసపత్రికలు[మార్చు]
- విపుల
- గృహలక్ష్మి
- తెలుగు వెలుగు
- ఆంధ్రభూమి మాసపత్రిక
- రచన (మాస పత్రిక)
- స్వప్న
- చిత్ర
- నది
- తెలుగుతల్లి[2] - సికిందరాబాదు నుండి 1939లో ప్రారంభమైన మాసపత్రిక. రాచమళ్ల సత్యవతీదేవి సంపాదకురాలు.
- మహతి [3]- వాసిరెడ్డి వెంకటసుబ్బయ్య సంపాదకత్వంలో తెనాలి నుండి వెలువడిన మాసపత్రిక. తొలిసంచిక ఏప్రిల్ 1938లో వెలువడింది.
- దర్శనం
- దైవ సన్నిధానమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక
ఇంటర్నెట్ లేక ఇతర వర్గీకరణలు[మార్చు]
- పొద్దు
- ఈమాట
- వాకిలి
- కథాకేళి
- తూలిక
- నెచ్చెలి (అంతర్జాల వనితా మాసపత్రిక) అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన అనేక అంశాల్ని‘నెచ్చెలి’ అంతర్జాల వనితా పత్రిక పరిచయం చేస్తున్నది. "నెచ్చెలి"కి డా. కె.గీత సంపాదకులు.
సుజనరంజని[మార్చు]
- సుజనరంజని - సిలికానాంధ్ర వారి మాస పత్రిక. ఏప్రిల్ 2013 సంచిక ముందుమాట ప్రకారం 121 సంచిక విడుదలైన మాసపత్రిక. 12లక్షల హిట్లను పొంది అంతర్జాల తెలుగు పత్రికలలో మొదటి స్థానంలో ఉంది. తల్లాప్రగడ రావు సంపాదకత్వంలో 79పత్రికలు వెలువడ్డాయి. మే 2013నుండి తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకుడుగా బాధ్యతలు చేపడతాడు,
భూమిక[మార్చు]
- భూమిక (స్త్రీవాద సాహితీ పత్రిక):భూమిక1993 జనవరిలో ప్రారంభమైంది. 1980 దశాబ్దంలో తెలుగు సాహిత్యంలో బలపడ్డ స్త్రీవాదం స్ఫూర్తితో దినపత్రికలలో స్త్రీల పేజీలు ప్రారంభించబడ్డాయి.అయితే వీటిలో చర్చలు పితృస్వామ్యపరిధిలోనే వుండడంతో, స్త్రీల వాస్తవ సమస్యల చిత్రణకోసం, స్త్రీల దృష్టికోణం నుంచి స్త్రీ సమస్యను అంచనా వెయ్యడం కోసం ఒక సమగ్ర పత్రిక లోటును పూడ్చటం కోసం `భూమిక’ ప్రారంభించబడింది. దీనికి కొండవీటి సత్యవతి సంపాదకత్వ వహిస్తున్నది.
కొత్తపల్లి[మార్చు]
- కొత్తపల్లి e పుస్తకం! (కొత్తపల్లి) (పిల్లల కథల పుస్తకం) (తెలుగు మాస పత్రిక): ఏప్రిల్ 2008లో పిల్లల కోసమే ఎలెక్ట్రానిక్ పుస్తకం రూపంలో ప్రారంభమైంది. పిల్లలుకు ఒత్తిడి లేకుండా గందరగోళంకలిగించకుండా, వారికి సులభంగా అర్థమయ్యేటట్లు కథలు,పాటలు,ఆటలద్వారా మనోవికాసం కలిగించడం ఈ పత్రిక ముఖ్యోద్దేశం. ఈ పత్రిక సంపాదకుడు నారాయణ. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంగా ఈ పత్రిక పనిచేస్తున్నది.
ఇతరాలు[మార్చు]
- చైతన్యవారధి
- మన్యసీమ
- న్యూస్ టైమ్
- ఫీచర్స్ ఇండియా
- ప్రజాకళ (ప్రజాస్వామిక సాహిత్య పత్రిక)
- కౌముది (తెలుగు మాస పత్రిక)
- ప్రాణహిత (ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక)
విద్య, ఉపాధి పత్రికలు[మార్చు]
నేరపరిశోధన పత్రికలు[మార్చు]
- నిఘారిపోర్టర్
సినిమా పత్రికలు[మార్చు]
తెలుగు సినిమా కేంద్రమైన మద్రాసు నుండే మొదటి సినిమా పత్రిక చిత్రకళ 1938 సంవత్సరంలో విడుదలైనది. తర్వాత ప్రాచుర్యం పొందిన పత్రిక నటన ఎం.ఎస్.రామాచారి ప్రారంభించారు. రూపవాణి పత్రిక 1940లో పి. సీతారామయ్య ప్ర్రారంభించారు. ఆ సమయంలోనే కొమ్మూరి సాంబశివరావు తెలుగు సినిమా పత్రిక మొదలుపెట్టారు. తెలుగు సినిమా పత్రికలకు గ్లామర్ పెంచింది పత్రిక ఇది. రెండవ ప్రపంచ యుద్ధం వలన చాలా పత్రికలు ఆగిపోయాయి. 1954లో టి.వి.రామనాథన్ ఒకేసారి మూడు భాషలలో సినిమా పత్రికలు ప్రారంభించారు. ఇవి ఇంగ్లీషులో పిక్చర్ పోస్ట్, తమిళంలో పేశుంపడమ్, తెలుగులో సినిమా రంగం. సినిమా రంగం బాధ్యతలు జి.వి.జి.కృష్ణ చుసేవారు. ప్రముఖ స్టుడియో అధిపతి నాగిరెడ్డి గారు బి.ఎన్.కె.ప్రెస్ ప్రారంభించి సినిమా పేరుతో పత్రిక వెలువరించారు. 1955లో గౌతమి పత్రిక రాజమండ్రి నుండి ప్రారంబించి, కె.కె.శర్మ (కాగడా శర్మ) ప్రొద్బలంతో మద్రాసుకు తరలించారు. 1950-60 మధ్య ఎన్నో పత్రికలు వచ్చాయి. వాటిలో మధురవాణి, చిత్రాలయ, ధ్వని, కొరడా, చిత్ర, తుఫాన్, తరంగిణి, చిత్రజగత్ కొన్ని పత్రికలు.
1966లో విజయా నాగిరెడ్డి వారి విజయచిత్ర విడుదలైనది. దీనికి రావి కొండలరావు సారథ్యం వహించారు. 1969లో బి.ఎ.వి.శాండిల్య వెండి తెర ప్రారంభించారు. 1975లో సినీ హెరాల్డ్ పత్రికను ఠాకూర్ వి.హరిప్రసాద్ గారు హైదరాబాదు నుండి ప్రారంభించారు. ఈనాడు రామోజీరావు పూర్తి సినీ వారపత్రిక సితారను 1976 మొదలయింది. ఆంధ్ర జ్యోతి వారి జ్యోతిచిత్ర 1977లో మొదలయింది. ఉదయం వారు శివరంజని, దాసరి మేఘసందేశం మొదలయ్యాయి.
- సితార (పత్రిక)
- కాగడా
- రూపవాణి
- విజయచిత్ర
- జ్యోతిచిత్ర
- చిత్ర[4] - సినిమాపరిశ్రమ వార్తలు,విశేషాలతో వెలువడిన ఈ పత్రికకు కె.వి.సుబ్బారావు సంపాదకుడు. 1939 జూలైలో తొలిసంచిక వెలువడింది. మాసపత్రిక.మద్రాసు నుండి వచ్చేది.
- చిత్రకళ[5] - పసుమర్తి యజ్ఞనారాయణశాస్త్రి యాజమాన్యంలో కె.నరసింహారావు సంపాదకత్వంలో మద్రాసు నుండి వెలువడిన సినిమా మాసపత్రిక. 1939లో వెలువడింది.
హాస్యపత్రికలు[మార్చు]
- హాసం ప్రచురణ నిలిచిపోయింది.
- హాస్యానందం
విజ్ఞాన పత్రికలు[మార్చు]
కంప్యూటర్ విజ్ఞాన పత్రికలు[మార్చు]
శృంగార విజ్ఞాన పత్రికలు[మార్చు]
వ్యవసాయ పత్రికలు[మార్చు]
- అన్నదాత
- రైతుబంధులింకు
- అగ్రి క్లినిక్ లింకు
- రైతునేస్తం
వైద్య విజ్ఞాన పత్రికలు[మార్చు]
ఆధ్యాత్మిక పత్రికలు[మార్చు]
- గీటురాయి (తెలుగులో ఇస్లామ్ గురించిన పత్రిక)
- భగవావ్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి సద్గురుకృప
- మోక్షసాథని
- యోగచైతన్యప్రభ
- శ్రీశైలప్రభ (శ్రీశైలం దేవస్థానం వారి ఆధ్యాత్మిక మాస పత్రిక)
- సప్తగిరి (తిరుమల తిరుపతి దేవస్థానములు సచిత్ర మాస పత్రిక)
- సనాతన సారథి (సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక మాస పత్రిక)
- శ్రీ రామకృష్ణ ప్రభ (రామకృష్ణ మిషన్ వారి ఆధ్యాత్మిక మాసపత్రిక
- ఋషిపీఠం (భారతీయ మానస పత్రిక)
- శ్రీ శంకర కృప (శృంగేరి శారదా పీఠము వారి ఆధ్యాత్మిక మాసపత్రిక)
- శ్రీహరనాథమురళి[6] - 1938 ఏప్రిల్నెలలో ప్రారంభమైన మాసపత్రిక. సేవక్ భగీరథి సంపాదకురాలు.
- జ్ఞానప్రియ[7] - తత్వానందస్వామి సంపాదకత్వంలో కొల్లూరు నుండి వెలువడిన మాసపత్రిక. తొలి సంచిక ఆగస్టు1939లో వెలువడింది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రాచీన భారతీయ ఔన్నత్యానికి తోడ్పడిన సకల విధానాలను పరివర్తనంచేసి దేశాన్ని ఉన్నతికి గొనిరావడం ఈ పత్రిక ఆశయం.
- దైవ సన్నిధానమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక - 2016 నుంచి ఈ పత్రిక ప్రచురితమవుతోంది.( సన్నిధానమ్ వారి ఆధ్యాత్మిక మాస పత్రిక)
దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక..2004 నుంచి ఈ పత్రిక ప్రచురితమవుతోంది. సనాతన ధర్మపరిరక్షణ, సంస్కార సమాజం లక్ష్యాలుగా ఈ పత్రిక నడుస్తోంది.
డైజెస్ట్ పత్రికలు[మార్చు]
పిల్లల పత్రికలు[మార్చు]
తెలుగులో పిల్లల పత్రికలు రావడం 1940 లలో ప్రారంభమైన "బాల"తో మొదలయిందని చెప్పవచ్చు. రేడియో అన్నయ్యగా పిలవబడే న్యాయపతి రాఘవరావు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు. దీని తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలు కొన్ని~:
హేతువాద పత్రికలు[మార్చు]
- స్వేచ్ఛాలోచన
- హేతువాది
ఇతరములు లేక వర్గీకరించవలసినవి[మార్చు]
- గ్రామోద్యోగి[8] - మాసపత్రిక. కొండపల్లి నుండి వెలువడింది.1939లో ప్రారంభమైంది.
- గ్రామోద్ధరణ[4] - రాజమండ్రినుండి వెలువడిన మాసపత్రిక. జూన్1939లో ప్ర్రారంభమైనది. గోటేటి జోగిరాజు దీనికి సంపాదకునిగా వ్యవహరించాడు.
- ఆంధ్రగ్రంథాలయం[9] తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువడిన త్రైమాసపత్రిక. ఆంధ్రగ్రంథాలయసంఘం తరఫున గుంటూరు నుండి పు.రాజశేఖరం సంపాదకత్వంలో వెలువడింది. గ్రంథాలయోద్యమము, ప్రచారము, విజ్ఞానవ్యాప్తి మొదలైన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. 1939లో వెలువడింది.
ప్రభావం[మార్చు]
తెలుగు పత్రికలు మొదటినుంచీ సమాజం, రాజకీయాలు, సాహిత్యం, కళలు వంటి అనేకమైన విషయాలపై గట్టి ప్రభావాన్ని చూపుతున్నాయి. వీరేశలింగం పంతులు, ఆయన శిష్యుల సహకారంతో 1891 నుండి 1899 వరకు "స్త్రీ జనోద్ధరణ", "సత్య సంవర్థినీ" పత్రికలను నడిపారు. వారి శిష్యుడైన రాయసం వేంకట శివుడు "జనానా" పత్రికను 1894లో కొనుగోలు చేసి 1907 వరకు చిలుకూరి వీరభద్రరావు గారి సహకారంతో నిర్వహించారు. ఈ పత్రికల్లో సంఘసంస్కరణ, స్త్రీవిద్య, స్త్రీజనోద్ధరణ వంటి విషయాలపై తీవ్రమైన చర్చలు చేసి, సైద్ధాంతికంగా బలం కల్పించుకున్నారు.[10]
మూలాలు[మార్చు]
- ↑ "Language wise certified circulation figures for the Audit Period Jan - June 2013". 2013-12-20. Retrieved 2014-03-19.
- ↑ [1] భారతి మాసపత్రిక, నవంబరు1939 పుట ౬౫౫
- ↑ [2] భారతి మాసపత్రిక, మే1938 పుట౪౬౭
- ↑ 4.0 4.1 [3] భారతి మాసపత్రిక ఆగష్టు1939 పుట ౨౫౮
- ↑ [4] భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట౫౨౨,౫౨౩
- ↑ మాసపత్రిక మే1939 పుట ౬౨౬
- ↑ భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట౫౨౩,౫౨౪
- ↑ [5] భారతి మాసపత్రిక మే1939 పుట ౬౨౬
- ↑ [6] భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట ౫౨౪
- ↑ వేంకటశివుడు, రాయసం (1910). "కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 73. Archived from the original on 28 సెప్టెంబర్ 2017. Retrieved 6 March 2015. Check date values in:
|archive-date=
(help)
ఇవీ చూడండి[మార్చు]
దిన, వార, పక్ష, మాస పత్రికల వివరాల పెట్టె లింకులతో సహా చూడండి.
బయటి లింకులు[మార్చు]
- "ప్రెస్ అకాడమీ స్కాన్ చేసిన పాత పత్రికలు (ఆర్కైవ్ లో)". Retrieved 2020-07-20.