బాలభారతం(పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలభారతం
జూన్ 2013 పత్రిక ముఖచిత్రం
జూన్ 2013 పత్రిక ముఖచిత్రం
ముద్రణకర్తరామోజీ ఫౌండేషన్
మొదటి సంచిక2013 జూన్ 1 (2013-06-01)
ఆఖరి సంచికమార్చి 1, 2021; 2 సంవత్సరాల క్రితం (2021-03-01)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

బాల భారతం పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని, విలువలను అందించాలనే లక్ష్యంతో రామోజీ ఫౌండేషన్‌ వెలువడిన మాస పత్రిక.[2]

ప్రారంభం-ప్రస్థానం[మార్చు]

2013 మే 27న పత్రికావిష్కరణ కార్యక్రమం ఫిల్మ్‌సిటీలో జరిగింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పత్రికను ఈనాడు మేనేజింగ్ డైరక్టర్ అయిన సుమన్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అధినేత శైలజా కిరణ్ ల చిన్న కుమార్తె దివిజ ఆవిష్కరించింది. ఫిల్మ్‌సిటీ, డాల్ఫిన్‌ హోటళ్ల ఎండీ విజయేశ్వరి, సుమన్‌ల కుమారుడు సుజయ్‌ లాంఛనంగా ఆవిష్కరించాడు. 2013 జూన్ 1 వ తేదీన తొలి సంచిక విడుదలైంది. నాణ్యమైన కాగితంపై 84 పేజీలతో సర్వాంగ సుందరంగా వెలువడుతున్నది. డిసెంబరు 2019 లో పత్రిక ధర 20 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం సంచికలు ఉచితంగా అంతర్జాలంలో అందుబాటులో వున్నాయి. మార్చి2021 సంచికతో పత్రిక మూతపడింది. [1]

శీర్షికలు-అంశాలు[మార్చు]

ఈ పత్రికలో ప్రధానంగా విజ్ఞానం, వినోదం, కళలు, సైన్సు, చరిత్ర, జీవిత చరిత్రలు, సమకాలీన అంశాలు మొదలైన అంశాలు ఉంటాయి.[3] పిల్లల నిత్య జీవితానికి ఉపకరించే అనేకానేక విశేషాలతోపాటు, నీతి కథలు, రంగురంగుల బొమ్మలతో ఆకట్టుకునేలా పత్రికను తీర్చిదిద్దారు. ఆరోగ్యం, వర్తమాన వ్యవహారాలు, విజ్ఞాన శాస్త్రాలు, జీవజాలానికి సంబంధించిన వివిధ ఆసక్తికర విషయాలతో పిల్లలకు అర్థమయ్యే తేలికైన భాషలో ఈ పత్రిక వెలువడుతోంది. పనికిరాని వస్తువుల నుంచి కొత్త వస్తువులు తయారు చేయడం, సులువుగా బొమ్మలు గీయడం ఎలాగో నేర్పే ఈనాడు కార్టూన్‌ ఎడిటర్‌ శ్రీధర్‌ పాఠాలు, జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం వంటివెన్నో అందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు". రామోజీ ఫౌండేషన్. 2021-03-01. Retrieved 2021-03-08.[permanent dead link]
  2. "బాలభారతం జాలస్థలి". Archived from the original on 2014-02-09. Retrieved 2014-01-01.
  3. "Eenadu to launch Bala Bharatam". 2013-06-03.

బాహ్య లంకెలు[మార్చు]