చర్చ:ద్రౌపది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సందేహము[మార్చు]

పాండురాజు పుత్రులను పాండవులని అందురు(పాండు రాజు పుత్రులు కనుక పాండవులు).పాండురాజుకు ఇద్దరు పత్నులు,కుంతి,మాద్రి.కుంతికి యముడు,వాయువు,ఇంద్రుడులవలన వరుసగా ధర్మరాజు,భీముడు,ఆర్జునుడు,రెండోభార్య మాద్రికి అశ్వనీ దేవత వలన నకులసహదేవులు కదాజన్మించినది.వారినేకదా పంచపాండవులని అనేది.మరి ఈవ్యాసంలో ద్రౌపది పై ఐదుదేవతల సంగమంవలన పంచపాండవులకు తనరెండోజన్మలో జన్మనిచ్చినట్లు వ్రాసారు.పాండురాజు పుత్రులైన పాండవులు కాకుండగా ఈపంచపాండవులెక్కడినుండి వచ్చారు.ఏ పురాణం ప్రకారం ఇలా రాసారు.మూడో జన్మలో దృపద పుత్రికగా పంచపాండవులకు వుమ్మడి భార్య అయిన ద్రౌపది తనరెండోజన్మలో ఏపంచపాండవులకు తల్లి అయ్యింది?వారి చరిత్ర ఏమిటి?పాలగిరి (చర్చ) 11:34, 21 డిసెంబర్ 2012 (UTC)