చర్చ:పరువు హత్యలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • పరువు పేరుతో హత్యలు చేసే కిరాతకులకు మరణ శిక్ష విధించాల్సిందేనని సుప్రీంకోర్టు కింది స్థాయి కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు ఆదేశాలను జారీ చేసింది.హర్యానా,ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, సింధ్, ముల్తాన్, పంజాబ్ ప్రాంతాలలో ఖాప్ పంచాయతీలు, తమిళనాడులో కట్టా పంచాయితీలు ,తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబ్‌నగర్, శ్రీకాకుళం జిల్లాల్లో పరువు హత్యలు జరిగాయి.తక్కువ కులాల వారిని పెళ్లాడిన అమ్మాయిలు పరువు హత్యలకు గురవుతున్నారు.

సగోత్రీకుల మధ్యగాని, ఖాప్‌లోని భిన్న గోత్రీకుల మధ్యగాని పెళ్ళి జరిగితే, ఆ జంటలు బలవంతంగా విషం తిని ఆత్మహత్య చేసుకోవాలని లేదా చిత్రహింసలు పెట్టి తగులపెట్టాలని ఖాప్ పంచాయితీ శాసిస్తుంది.