పరువు హత్యలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
23 ఏళ్లలో పరువు కోసం హత్య చేయబడ్డ కుర్దిష్ మహిళ నోట్

పరువు హత్యలు (honor killings) అనేవి మత సమాజాల్లో వ్యక్తిగత కుటుంబ పరువు, గౌవరవం, మర్యాద వంటి పేర్లతో జరిగే హత్యలు. ఈ హత్యలు ఎక్కువగా ఇస్లామిక్ దేశాలలో జరుగుతుంటాయి. హిందూ దేశాలైన ఇండియా, నేపాల్ లోనూ, కొన్ని క్రైస్తవ దేశాలలోనూ కూడా ఈ హత్యలు కనిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్ళికి ముందు సెక్స్, మతాంతర వివాహం, జాత్యాంతర వివాహం లాంటివి చేసుకున్న వారిని పరువు పేరుతో హత్య చెయ్యడం జరుగుతోంది.

ముస్లిమ్ దేశాలలో పరువు హత్యలు[మార్చు]

అనేక ముస్లిమ్ దేశాలలో పరువు హత్యలకి పూర్తి లేదా పాక్షిక చట్టబద్దత ఉంది. పాకిస్తాన్, టర్కీ దేశాలలో ఈ హత్యలకి చట్టపరమైన అనుమతి లేకపోయినా మత పెద్దల ఆదేశాల ప్రకారం ఈ హత్యలు చేస్తుంటారు.

ఇండియాలో పరువు హత్యలు[మార్చు]

ఇండియాలో పరువు హత్యలు ఎక్కువగా పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఈ హత్యలని కొందరు రాజకీయ నాయకులు కూడా బహిరంగంగా సమర్థిస్తున్నారు.[1] ఈ హత్యల పెరుగుదలపై మహిళా సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-02. Retrieved 2008-12-27.