చర్చ:మన్నెగూడెం (మేడిపల్లి)
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
మన్నెగూడెం పరిపాలన పరంగా మేడిపెల్లి మండలం లో మరియు కొత్తగా ఏర్పాటైన వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి లోనికి వఛ్ఛినప్పటికిని, వ్యాపారానికి, రాక పోకలకు మరియు ఇతర కార్యక్రమాలకు మాత్రం కోరుట్ల పట్టణమె అడ్డ.
ఈ గ్రామం లో జనాభా 5000 పైనే ఉంటుంది. ఎక్కువ మంది ఛదువుకోలేదు. అయితే ఛదువు విషయంలో ప్రజల ఆలోఛనలలో మార్పు వస్తోంది. ముఖ్యంగా ఆడ పిల్లలను ఛదివింఛడానికి ఛాలామంది ముందుకు వస్తున్నారు.
వ్యవసాయం ప్రధాన వ్రుత్తి. కాపులకు ముఖ్యంగా వ్యవసాయ భూములు ఉండగా, వ్యవసాయ కూలీలుగా బహుజనులు పని ఛేస్తున్నారు.
ఇది కాక, ఛాలా మంది గల్ఫ్ వెళుతుంటారు. అయితే గల్ఫ్ వెళ్ళీ లాభ పడిన వారు ఉన్నారు, ఏజెంట్ల ఛేతి లో బాగా నష్ట పోయిన వారు ఉన్నారు.
ఇంకా కొద్ది మంది, ముంబాయి వెళ్తుంటారు. వీరు ప్రధానంగా పద్మశాలిలు. ఆధునిక యంత్రాలు చేనేత మగ్గాలను ఎప్పుడైతే పనికి రాకుండా ఛేశాయో అప్పటి నుండి సాలె వాళ్ళ వలసలు ముంబాయికి ప్రారంభం అయ్యాయి. కొద్దిమంది అక్కడే పిల్లా పాపలతో ఉండి పోగా, మరి కొద్ది మంది రిటైర్ అయ్యి గ్రామానికి వఛ్ఛారు.