Jump to content

జాతీయ ఓటర్ల దినోత్సవం

వికీపీడియా నుండి
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీ
ప్రాముఖ్యతకొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేరుస్తారు
జరుపుకొనే రోజుజనవరి 25

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.[1][2]

ఏర్పాటు

[మార్చు]

ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిందని అప్పటి సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రంలలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషను నిర్ణయించింది.

ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందచెయ్యాలని, ఈ చొరవ యువతకి సాధికారత, వారి బాధ్యతలను నిర్వర్తించటానికి స్ఫూర్తినిస్తుందని ఆమె చెప్పారు.

ఓటర్ల ప్రతిజ్ఞ

[మార్చు]

భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో, మన‌ దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత , ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం,జాతి, కులం, వర్గం,భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము[3].

మూలాలు

[మార్చు]
  1. ప్రజాశక్తి (24 January 2019). "ఓటరుడా మేలుకో." the original నుండి 25 January 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 January 2019.
  2. ABN (2025-01-26). "ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం". Andhrajyothy Telugu News. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-02-01.
  3. "AP news: ఓటర్ దినోత్సవం.. అధికారుల ప్రతిజ్ఞ". EENADU. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-02-01.