జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్
తొలి సేవ30 జనవరి 1993; 31 సంవత్సరాల క్రితం (1993-01-30)
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వ్బే
మార్గం
మొదలుMumbai Central (MMCT)
ఆగే స్టేషనులు19
గమ్యంJaipur (JP)
ప్రయాణ దూరం1,162 km (722 mi)
సగటు ప్రయాణ సమయం16 hours 50 minutes
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)12955 / 12956
సదుపాయాలు
శ్రేణులుAC 1st Class, AC 2 Tier, AC 3 Tier, Sleeper class, General unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుAvailable
చూడదగ్గ సదుపాయాలుLarge windows
సాంకేతికత
రోలింగ్ స్టాక్LHB coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం130 km/h (81 mph) maximum,
70 km/h (43 mph) average with halts
మార్గపటం

12955 / 12956 ముంబై సెంట్రల్ - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ రైల్వేలో ముంబై, రాజస్థాన్‌లోని జైపూర్ ల మధ్య నడుస్తున్న అత్యంత ముఖ్యమైన రైలు. ఈ రెండు నగరాల మధ్య ఇది మొదటి డైరెక్ట్ రైలు. ఇది సూపర్ ఫాస్ట్ కేటగిరీ రైళ్ల కింద ముంబై జైపూర్ మధ్య నడిచే రైళ్ళలో అత్యంత వేగవంతమైనది.

అవలోకనం[మార్చు]

ఈ రైలు జైపూర్ జంక్షన్ నుండి నడిచిన మొదటి బ్రాడ్-గేజ్ రైలు. ఇది 1993 జనవరి 30 న మొదలైంది. జైపూర్ సూపర్‌ఫాస్ట్‌ని అనధికారికంగా గంగౌర్ ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు. జైపూర్ జంక్షన్ బ్రాడ్-గేజ్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి ముందు, ఈ రైలు జైపూర్‌లోని మరొక రైల్వే స్టేషన్ అయిన దుర్గాపురా, ముంభై సెంట్రల్మ ల మధ్య నడిచింది.

ఇది ముంబై సెంట్రల్ నుండి జైపూర్ జంక్షన్ వరకు దిగువ దిశలో రైలు నంబర్ 12955గా ను, జైపూర్ జంక్షన్ & ముంబై సెంట్రల్ మధ్య రైలు నంబర్ 12956గానూ నడుస్తుంది. ఇది 70 కిమీ/గం సగటు వేగంతో 1162 కిలోమీటర్ల దూరాన్ని 16 గంటల 45 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఎగువ దిశలో, ప్రయాణం సగటున 70 km/h వేగంతో 16 గంటల 55 నిమిషాలలో పూర్తవుతుంది. ఇది గరిష్టంగా 130 కిమీ/గం వేగంతో నడుస్తుంది. ఈ రైలులో బయో టాయిలెట్లు ఉన్నాయి. భోజన కూపన్ల పథకం మొదట ఈ రైలులో ప్రవేశపెట్టారు.

ఇంజను[మార్చు]

ముంబైలోని వెస్ట్రన్ లైన్ సబర్బన్ రైల్వే యొక్క DC నుండి AC మార్పిడికి ముందు, ఇది ముంబై యొక్క DC ట్రాక్షన్ మార్గాన్ని ఉపయోగించేందుకు వల్సాడ్ లోకో షెడ్ WCAM 2/2P లోకోమోటివ్‌తో ముంబై సెంట్రల్ నుండి బయలుదేరేది. వడోదర లోకో షెడ్ WAP 4 E కోసం WCAM 2/2P ని మార్చుకునే వడోదరలో లోకోమోటివ్ మార్పు జరిగేది.

జైపూర్ వరకు దాని మిగిలిన ప్రయాణం కోసం సవాయి మాధోపూర్ జంక్షన్ వద్ద భగత్ కి కోఠి షెడ్ నుండి WDP 4 /4B/4D కు తగిలించేవారు. సవాయి మాధోపూర్ జంక్షన్ వద్ద రైలు దిశను మారుస్తారు.

పశ్చిమ రైల్వే 2012 ఫిబ్రవరి 5 న DC నుండి AC కి విద్యుత్ మార్పిడిని పూర్తి చేసింది. ముంబైలోని వెస్ట్రన్ లైన్ సబర్బన్ సిస్టమ్ యొక్క పూర్తి AC విద్యుదీకరణ తర్వాత; ఇది ముంబై సెంట్రల్, సవాయి మాధోపూర్ జంక్షన్ ల మధ్య WAP 5 లేదా WAP 4 E ఇంజన్లు లాగుతాయి

నార్త్ వెస్ట్రన్ రైల్వే 2021 ఆగస్టులో జైపూర్ - సవాయి మాధోపూర్ రైలు మార్గాన్ని విద్యుద్దీకరణ చేయడంతో ఇప్పుడు దీని మొత్తం దూరాన్ని వడోదర లోకో షెడ్ లోని WAP 7 లోకోమోటివ్ లాగుతోంది.