తిరువీధుల మెరసీ దేవదేవుడు
Jump to navigation
Jump to search
తిరువీధుల మెరసీ దేవదేవుడు కర్ణాటక సంగీత వాగ్గేయకారుడైన అన్నమాచార్య రచించిన కీర్తన. ఇది శ్రీరాగంలో పాడావచ్చును.
కీర్తన[మార్చు]
పల్లవి :
తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను | | తిరువీధుల మెరసీ | |
చరణం 1 :
తిరుదండెల పై నేగీ దేవు డిదే తొలినాడు
సిరులు రెండవనాడు శేషుని మీద
మురిపేన మూడోనాడు ముత్యాలపందిరి క్రింద
పొరి నాలుగోనాడు పువ్వుకోవిల లోను | | తిరువీధుల మెరసీ | |
చరణం 2 :
గక్కన ఐదవనాడు గరుడుని మీద
ఎక్కెను ఆరవనాడు యేనుగు మీద
చొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ తేరును గుర్ర మెనిమిదో నాడు | | తిరువీధుల మెరసీ | |
చరణం 3 :
కనకపుటందలము కదిసి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లి పీట
ఎనసి శ్రీ వేంకటేశు డింతి అలమేల్మంగతో
వనితల నడుమను వాహనాల మీదను | | తిరువీధుల మెరసీ | |
విశేషాలు[మార్చు]
- ఈ కీర్తనలో తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే తిరుమల బ్రహ్మోత్సవాలు అందులో వినియోగించిన వాహనాల పేర్లు తెలియజేయబడ్డాయి. పదవ రోజున శ్రీవారి కళ్యాణోత్సవం జరిగేది.
- ఈ కీర్తన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంకీర్తనం చేసిన "అన్నమాచార్య సంకీర్తనా త్రిశతి" లో ఒకటి.[1]
మూలాలు[మార్చు]
- ↑ అన్నమాచార్య సంకీత్రనా త్రిశతి (310 సంకీర్తనలు), సంకలనం : గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2008.