తెలంగాణా ఆంధ్రోద్యమము
Jump to navigation
Jump to search
నిజాం పాలనలో తెలంగాణా ప్రాంతంలో ఆంధ్రోద్యమాన్ని చేసిన మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహునిగా చరిత్రకెక్కారు. తెలంగాణా ప్రాంతంలో ఆనాడు కొనసాగుతున్న భాషా సంస్కృతుల పరంగా తెలుగువారి అణచివేతను ఎదుర్కునే ప్రయత్నాలు చేశారాయన. ఈ గ్రంథంలో నిజాం రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతాలు, వాటిలో ఆంధ్రుల భాషా సంస్కృతుల అణచివేత, దాన్ని ఎదిరిస్తూ ప్రారంభమైన ఆంధ్రోద్యమం, దానికి మద్దతు, వ్యతిరేకత వంటి వివరాలు అందించారు. ఈ అంశాలను పలు పత్రికల ఆధారంగా, స్వీయానుభవాల ఆధారంగా రచన చేశారు.
దీని మొదటి భాగము యొక్క నాల్గవ ముద్రణము ఆంధ్ర చంద్రికా గ్రంథమాల వారు 1949లో ముద్రించారు.
మొదటి భాగము[మార్చు]
- ప్రాథమికాంశాలు
- ఉద్యమారంభం
- ఆంధ్రజన కేంద్రసంఘము
- ఆశయములు; కార్యవిధానము
- గ్రంథాలయోద్యమము
- వర్తక సంఘములు
- వెట్టి చాకిరి
- పాఠశాలల స్థాపన
- ప్రచారకార్యము : లఘుపుస్తకములు; ప్రచారకులు
- ప్రచారకార్యము : ఉపన్యాస సభలు; వార్తాపత్రికలు
- సింహావలోకనము.