త్రిశూలం (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్రిశూలం విశ్వనాథ సత్యనారాయణ రచించిన చారిత్రిక నాటకం.[1] త్రిశూలం నాటకాన్ని రూపకంగా విమర్శకులు వర్గీకరించారు.[2]

నేపథ్యం[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ నిత్య రామ మంత్రోపాసకుడు. నేషనల్ కాలేజిలో ప్రమోదకుమార చటర్జీ చిత్రకళాధ్యాపకుడుగా ఉండేవారు. ప్రముఖ చిత్రకారుడు అడవి బాపిరాజు వంటివారు ఆయన శిష్యులు. ఆయన వేసిన ‘’త్రిశూలం ‘’చిత్రం చూసి ఉప్పొంగిపోయిన విశ్వనాధ ‘’నాకు రాజ్యం ఉంటె ఆ రాజ్యాన్ని మీకు ఇచ్చేసేవాడిని ‘’అన్నాడు .ఎంతో ఆనందించిన చటర్జీ కాలేజి వదిలి వెళ్ళేటప్పుడు విశ్వనాధను పిలిచి ‘’మీరు రాజ్యం పోగొట్టుకోనక్కరలేదు .ఈ త్రిశూలం మీకు బహుమతిగా ఇస్తున్నాను ‘’అంటే గుండె ద్రవించింది విశ్వనాధకు .త్రిశూలం పేరుతొ నాటకం రాసి ఆ త్రిశూలాన్నే ముఖ చిత్రంగా వేయించి కృతజ్ఞత చెప్పుకొన్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. విషాదాంత నాటకరచన విశ్వనాథవారి విలక్షణత 31 Oct 2010[permanent dead link]
  2. కోవెల, సుప్రసన్నాచార్య (2002). "త్రిశూలం - ఒక పరిశీలన". విశ్వనాథ భారతి. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. pp. 221–231.
  3. విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు Posted on సెప్టెంబర్ 29, 2015