నరనారాయణ సేతు వంతెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరనారాయణ సేతు
నారాయణ సేతు రోడ్డు NH-17
Coordinates26°13′N 90°34′E
OS grid reference[1]
Carriesరోడ్డు, రైల్వే
Crossesబ్రహ్మపుత్రా నది
Localeజోగిఘోపా, అస్సాం
Characteristics
Designట్రస్
Total length2.284 కిలోమీటర్లు
Longest span125 మీ.
No. of spans10
History
Constructed byది బ్రెయిత్‌వైట్ బర్న్ & జెస్సోప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్
Construction start1989
Construction costరూ. 301 కోట్లు
Opened1998 ఏప్రిల్ 15
Location
Lua error in మాడ్యూల్:Mapframe at line 384: attempt to perform arithmetic on local 'lat_d' (a nil value).

చరిత్ర[మార్చు]

ఈ వంతెన బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. దీన్ని రోడ్డు, రైలు మార్గాలు రెండింటి కోసం నిర్మించారు. బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన మూడవ వంతెన ఇది. ఈ వంతెన అస్సాంలోని బొంగైగావ్ జిల్లా లోని జోగిఘోపాను, గోల్‌పారా జిల్లా లోని పంచరత్నల కలుపుతుంది. కోచ్‌ వంశానికి చెందిన 16 వ శతాబ్దపు రాజు నర నారాయణ్‌ పేరుమీదుగా ఈ వంతెనకు నరనారాయణ సేతు అని పేరు పెట్టారు. దీని నిర్మాణం 1989 లో మొదలైంది. 1998 ఏప్రిల్‌ 15 న అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి ప్రారంభించాడు. డబుల్‌ డెక్‌ మోడల్‌లో నిర్మించిన ఈ వంతెన నిర్మాణానికి సుమారు రూ. 301 కోట్ల రూపాయలు ఖర్చయింది.[1][2]

ఈ ట్రస్ రకం వంతెన పొడవు 2.284 కిలోమీటర్లు. దీన్ని ది బ్రెయిత్‌వైట్ బర్న్ & జెస్సోప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. 125 మీటర్ల పొడవుండే ప్రధాన స్పాన్లతో దీన్ని నిర్మించారు.

మూలాలు[మార్చు]

  1. "Naranarayan Setu In India". India9. Retrieved 5 October 2018.
  2. "Model project on Construction of Naranarayan Setu over river Brahmaputra at Jogihopa" (PDF). Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2014. Retrieved 28 మే 2019.