నాయకురాలు (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయకురాలు
కృతికర్త: ఉన్నవ లక్ష్మీనారాయణ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: త్రివేణి ప్రెస్, మచిలీపట్నం
విడుదల: 1926, 1969 (రెండవ ముద్రణ)
పేజీలు: 134


నాయకురాలు ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన నాటకం. 1901లో వచ్చిన ఈ నాటకంలో పల్నాటి వీరచరిత్రను గురించి రాయబడింది.[1]

కథా నేపథ్యం[మార్చు]

పౌరుషాలకు పురిటిగడ్డగా నిలిచిన పల్నాడులో దాయాదుల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో రచించిన ఈ నాటకంలో పలనాటి వీరుల బలాబలాల గురించి రాయబడింది. నాగమ్మ పాత్ర కీలకంగా చిత్రించబడి మానవధర్మం కన్నా సత్యధర్మమే గొప్పదన్న సందేశంతో సాగిన ఈ నాటకంలో సంభాషణలు, పద్యాలు చక్కగా కుదిరాయి.

పాత్రలు[మార్చు]

  1. ప్రతాపుడు
  2. నాగాంబిక (నాయకురాలు)
  3. బ్రహ్మనాయుడు
  4. బాలచంద్రుడు
  5. నలగామరాజు
  6. నరసింగరాజు
  7. మలిదేవరాజు
  8. అలుగురాజు
  9. కొమ్మరాజు
  10. అలరాజు
  11. కేతరాజు
  12. ఝట్టిరాజు
  13. పొదిలె పాపన్న
  14. కల్వగుంట కాశీపతి
  15. కేతురెడ్డి
  16. రామిరెడ్డి
  17. ముతసాని పిచ్చిరెడ్డి
  18. కన్నమదాసు
  19. లంకన్న
  20. చాకలి చంద్రన్న
  21. మంగలి మంచన్న
  22. కుమ్మరి తేర్కుడు
  23. అనపోతు
  24. అర్చకుడు
  25. సేవకుడు
  26. పెద్దసెట్టి
  27. బ్రహ్మణుడు
  28. గుమాస్తా
  29. సుద్ధులవాడు
  30. చెంచునాయకుడు
  31. గోసాయిలు
  32. సైనికులు
  33. ప్రజలు

మూలాలు[మార్చు]

  1. జాతీయోద్యమ ప్రతిబింబం నాయకురాలు, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 19 జూన్ 2017, పుట.14

ఇతర లంకెలు[మార్చు]