నిడమర్తి లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిడమర్తి లక్ష్మీనారాయణ (1878 - 1928) గ్రంథాలయోద్యమములో పాల్గొన్న ప్రముఖులలో ఒకారు.

జననము[మార్చు]

శ్రీ నిడమర్తి లక్ష్మీనారాయణ (1878 - 1928) పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామములో 1878 వ సంవత్సరములో జన్మించారు.

గ్రంధాలయోధ్యమములో పాత్ర[మార్చు]

వీరు గ్రామ స్థాయిలో అనేక ప్రజోపయోగ కార్యక్రమాలనునిర్వహించిన ప్రముఖ కార్యకర్త. చరుచుగా అయ్యంకి వారిని కలుస్తూ వారి సలహాలుతీసుకొమ్ని తాడేపల్లి గూడెం తాలూకాలో అనేకగ్రంధాలయాల స్థాపనకు కృషి చేశారు. 1923 వ సంవత్సరములో ప్రథమ పశ్చిమ గోదావరి జిల్లా మహా సభ నిర్వహించారు. భీమవరంలో జరిగిన ఈ సభకు జిల్లాలోని కార్యకర్త లందరూ తరలి వచ్చారు. లక్ష్మీనారాయణ గారి సేవా నిరతి - త్యాగాన్ని గిరుంచి ...... వారు మరణించిన 60 సంవత్సరాల తర్వాత కూడా తాడేపల్లి గూడెం ప్రాంతములో ఇప్పటికీ చెప్పుకుంటారు. అంతటి త్యాగ మూర్తి నిడమర్తి వారు.

మూలాలు[మార్చు]

  • గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట. 45