పంచానన్ మహేశ్వరి

వికీపీడియా నుండి
(పంచనన్ మహేశ్వరి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పంచానన్ మహేశ్వరి
జననం(1904-11-09)1904 నవంబరు 9
జైపూర్
మరణం1966 మే 18(1966-05-18) (వయసు 61)
రంగములువృక్షశాస్త్రం
చదువుకున్న సంస్థలుఈవింగ్ క్రిస్టియన్ కాలేజ్
ముఖ్యమైన పురస్కారాలుఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ (1965)[1]

పంచానన్ మహేశ్వరి (1904 నవంబరు 9 - 1966 మే 18) ప్రముఖ భారతీయ వృక్షశాస్త్రజ్ఞుడు, రాయల్ సొసైటీ సభ్యుడు. అంజిస్పెర్మస్ ను టెస్ట్ ట్యూబ్‌లో పెంచే సాంకేతికతను ఆవిష్కరించినందుకు గాను ఆయన ప్రసిద్ధుడయ్యాడు. ఈ ఆవిష్కరణతో గతంలో పెంచడానికి సాధ్యపడని కాని కొన్ని సంకర జాతి మొక్కలను కృత్రిమంగా పెంచగలిగారు.

చదువు[మార్చు]

పంచానన్ జైపూరులో జన్మించాడు. అలహాబాదులోని ఎవింగ్ క్రిస్టియన్ కళాశాలలో చదివాడు. వైద్య విద్య చదవాలనేది అతడి ఆశయం.[1] ఎవింగ్‌లో ఉండగా విన్‌ఫీల్డ్ డడ్జన్ సలహా మేరకు తన లక్ష్యాన్ని సైన్సువైపు మళ్ళించాడు.[1] డడ్జన్ ప్రభావంతోనే ఆయన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (1925), మాస్టర్ ఆఫ్ సైన్స్ (1931), డాక్టర్ ఆఫ్ సైన్స్ (1931) డిగ్రీలు పొందాడు.

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

1934 లో పంచానన్ మహేశ్వరి బెంగళూరులోని భారతీయ విజ్ఞానశాస్త్ర అకాడమీ గౌరవ సభ్యుడయ్యాడు. 1968 లో భారతీయ సైన్స్ కాంగ్రెస్ సంఘం బీర్బల్ సాహ్నీ మెడల్‌తో ఆయన్ను గౌరవించింది.[2] 1965 లో ఆయన రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికయ్యాడు. ఈ గౌరవం పొందిన భారతీయ వృక్షశాస్రవేత్తల్లో ఆయన రెండోవాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Steward, F. C. (1967). "Panchanan Maheshwari 1904-1966". Biographical Memoirs of Fellows of the Royal Society. 13: 256–226. doi:10.1098/rsbm.1967.0013.
  2. "BIRBAL SAHNI MEDAL". Archived from the original on 2013-10-21. Retrieved 2017-01-03.