Jump to content

పర్లాకిమిడి రైల్వే స్టేషను

Coordinates: 18°47′09″N 84°04′46″E / 18.7857°N 84.07933°E / 18.7857; 84.07933
వికీపీడియా నుండి
(పర్లాకిమిడి రైల్వే స్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
పర్లాకిమిడి రైల్వే స్టేషను
General information
Locationపర్లాకిమిడి, ఒడిశా
భారతదేశం
Coordinates18°47′09″N 84°04′46″E / 18.7857°N 84.07933°E / 18.7857; 84.07933
Elevation60 m (197 ft)
Systemభారతీయ రైల్వేలు స్టేషన్
Operated byఈస్ట్ కోస్ట్ రైల్వే
Lineనౌపడా-గుణుపూర్ సెక్షన్
Platforms2
Tracks2
Construction
Parkingఅందుబాటులో ఉంది
Other information
Statusపనితీరు
Station codeపి.ఎల్.హెచ్
జోన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే
డివిజన్లు వాల్తేరు
History
Opened1899-1900
Location
పర్లాకిమిడి రైల్వే స్టేషను is located in Odisha
పర్లాకిమిడి రైల్వే స్టేషను
పర్లాకిమిడి రైల్వే స్టేషను
ఒడిశాలో స్థానం

పర్లాకిమిడి రైల్వే స్టేషను, ఈస్ట్ కోస్ట్ రైల్వే లోని వాల్తేరు డివిజనుకు చెందినది. ఇది ఒడిషా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో ఉంది. ఇది 1899 లో స్థాపించబడిన ఒడిషా మొదటి రాయల్ రైల్వే స్టేషను. మొత్తం విభాగాన్ని పర్లాకిమిడి గజపతి మహారాజు స్థాపించాడు. ఇది ఒడిషా రాష్ట్రంలోని మొదటి రైల్వే స్టేషను. ఇక్కడి రైలు మార్గం తూర్పు భారతదేశపు మొట్టమొదటి లైట్ రైలు మార్గం. దీనిని పర్లాకిమిడి లైట్ రైల్వే (పి.ఎల్.ఆర్) అని అంటారు. ఇది ఒడిషా రాష్ట్రంలోని పురాతన స్టేషన్లలో ఒకటి. ఇది రాష్ట్రంలో మొట్టమొదటి లైట్ రైల్వే స్టేషను. ఐదు సంవత్సరాల తరువాత, మయూర్భంజ్ స్టేట్ రైల్వే ఉనికిలోకి వచ్చింది. అందువల్ల ఇది ఒడిషాలోని మొదటి నారో గేజ్ రైల్వే స్టేషను.[1]

చరిత్ర

[మార్చు]

పర్లాకిమిడి లైట్ రైల్వే రెండు అడుగుల ఆరు అంగుళాల గేజ్ రైల్వే. పర్లాకిమిడి మహారాజు తన రాజధానిని కేవలం 40 కి.మీ (25 మైళ్ళు) దూరంలో ఉన్న నౌపడాతో కలపాలని నిర్ణయించుకున్నాడు. 1898లో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పూర్తిస్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి. రూ.7,00,000 వ్యయంతో నిర్మించిన ఈ మార్గాన్ని 1900 లో తెరిచారు. ప్రారంభ సంవత్సరాల్లో పర్లాకిమిడి రైల్వే, నష్టాలను చవిచూసింది. కానీ 1910 తరువాత, ఇది స్వల్పంగా లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. 1924–1925 తరువాత, లాభాలు పెరిగాయి. మహారాజా కుమారుడు కృష్ణ చంద్ర గజపతి 1929, 1931 ల్లో రెండు దశలలో గుణుపూర్ వరకు రైలు మార్గాన్ని విస్తరించడానికి ప్రేరేపించింది. తరువాత దీన్ని బెంగాల్ నాగపూర్ రైల్వేలో విలీనం చేసారు.[2]

రైల్వే పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

భారత స్వాతంత్ర్యం తరువాత దీన్ని ఈశాన్య రైల్వేలో విలీనం చేసారు. బ్రాడ్ గేజ్ మార్పిడి కోసం 1950, 1964, 1967 లో సర్వేలు జరిగాయి. చివరకు 2002 సెప్టెంబరు 27 న నౌపడా వద్ద నౌపడా-గుణుపూర్ గేజ్ మార్పిడి పనులకు శంకుస్థాపన జరిగింది. 2003 ఏప్రిల్ 1 నుండి ఇది కొత్తగా ఏర్పడిన తూర్పు తీర రైల్వేలో భాగంగా మారింది. చివరకు 2004 జూన్ 9 న గేజ్ మార్పిడి కోసం ఈ మార్గాన్ని మూసివేసారు.[3] 2011 ఆగస్టు 22 న పూరీ-గుణుపూర్ ప్యాసింజర్ ప్రవేశపెట్టడంతో సేవలు పునఃప్రారంభమయ్యాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. Samantray, Dilip Kumar (2022). "No 4 - The Royal Railways Of Odisha". Odisha The Railway Story. Bhubaneswar, Odisha: Teerataranaga Printers and Publication. pp. 106–112.
  2. "Parlakhimidi railway history".
  3. "Gauge conversion". Retrieved 2023-12-14.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  4. "Gunupur–Puri train service starts, Rayagada elated".