పర్వతేశ ప్రభు శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్వతేశ ప్రభు శతకము
కవి పేరుకోట సుందరరామశర్మ
మొదటి ప్రచురణ తేదీ1990
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంపర్వతేశ ప్రభూ
విషయము(లు)భక్తి, నీతి
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుశార్దూల విక్రీడితము
ప్రచురణ కర్తత్రిపురసుందరీ ప్రతిష్టానము, చింతగుంట పాలెము, మచిలీపట్నం
ప్రచురణ తేదీ1990
మొత్తం పద్యముల సంఖ్య108
మొత్తం పుటలు48

పర్వతేశ ప్రభు శతకమును కోట సుందరరామశర్మ వ్రాశాడు. పూనా నగరంలో వెలసిన శంకరుని గురించి ఈ శతకంలో 108 పద్యాలలో వర్ణించాడు. ఈ శతకాన్ని 1990లో మచిలీపట్నం సమీపంలోని చింతగుంటపాలెం త్రిపురసుందరీ ప్రతిష్టానము వారు ప్రచురించారు. ఈ పుస్తకంలో ఎడమవైపు తెలుగు పద్యాలు, కుడివైపు దానికి అనుకరణమైన సంస్కృత శ్లోకాలు ముద్రించారు[1].

ఈ శతకంలో

  • శివవందనము
  • వరణము
  • గణనము
  • కారుణ్యము
  • శివయాత్ర
  • నీతి
  • శరణము

అనే ఏడు విభాగాలున్నాయి.

ఉదాహరణ[మార్చు]

ఈ శతకంలోని ఒక పద్యం మచ్చుకు:

కన్నుల్ మూసిన, విచ్చినం గనగఁ నౌఁ గైలాస శై లాభమై
మిన్నుల్ వ్రాలిన క్రేవ నీ శిఖరియుం; 'బెణ్ణాస' పొన్నాసయున్
మన్నాసన్ విడినట్టి వారికగు - యుష్మత్ - సత్య సందర్శనం
బెన్నన్ మాదృశ చర్మ చక్షులకు ఱాలే, పర్వతేశ ప్రభూ!

మూలాలు[మార్చు]

  1. ఘట్టమరాజు, అశ్వత్థనారాయణ (1 April 1990). "గ్రంథ విమర్శలు - పర్వతేశ ప్రభు శతకము". భారతి. 67 (4): 64. Retrieved 24 February 2017.[permanent dead link]