పింకీ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పింకీ సింగ్
వ్యక్తిగత సమాచారం
జాతీయత భారతీయురాలు
జననం (1980-08-14) 1980 ఆగస్టు 14 (వయసు 43)[1]
ఢిల్లీ, భారతదేశం

పింకీ కౌశిక్ సింగ్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ మహిళా లాన్‌ బౌల్స్‌ క్రీడాకారిణి. ఆమె 2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో లాన్‌బౌల్స్‌లో భారత మహిళల జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి, స్వర్ణ పతకం గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది.[2][3]

క్రీడా జీవితం[మార్చు]

పింకీ ఢిల్లీ యూనివర్సిటీ తరఫున క్రికెట్‌ ఆడింది. ఆమె తను పనిచేస్తున్న పాఠశాలలో నేషనల్‌ లాన్‌ బౌల్స్‌కు వేదికైంది. ఆ సమయంలో ఆమె ఆ ఆటను చూసి కొద్ది రోజుల్లోనే దానిని నేర్చుకోవడంతో పాటు జాతీయ శిబిరానికి అర్హత సాధించింది.[4] ఆమె 2007లో మొదటి లాన్ బౌల్స్ నేషనల్స్‌లో పాల్గొంది. పింకీ కామన్వెల్త్ గేమ్స్ లో 2014లో గ్లాస్గో, 2018 గోల్డ్ కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్ ట్రిపుల్స్ అండ్ ఫోర్స్ ఈవెంట్‌లలో భారతదేశం తరపున మూడుసార్లు ప్రాతినిధ్యం వహించింది.

మూలాలు[మార్చు]

  1. "Athlete profile". Commonwealth Games federation. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 30 May 2021.
  2. Namasthe Telangana (3 August 2022). "బంతులాటలో బంగారం". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  3. Sakshi (3 August 2022). "ఊహించని ఫలితం.. 'ఆనందం నాలుగింతలు'". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  4. "Rolling her arm under". 7 April 2010. Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.