పుష్పదంతుడు (జైనమత తీర్థంకరుడు)
స్వరూపం
| పుష్పదంతుడు | |
|---|---|
| 9వ జైన తీర్థంకరుడు | |
తీర్థంకరుని విగ్రహం | |
| వివరములు | |
| యితర నామం: | సువిధి |
| చారిత్రక తేదీ: | 10^218 సంవత్సరాల పూర్వం |
| కుటుంబం | |
| తండ్రి: | సుగ్రీవ |
| తల్లి: | రామ (సుప్రియ) |
| సామ్రాజ్యం: | ఇక్ష్వాకులు |
| ప్రదేశాలు | |
| జననం: | కాకండి (ఉత్తరప్రదేశ్ లోని కుఖుడూ) |
| మోక్షం: | షికార్జీ |
| Attributes | |
| రంగు: | తెలుపు |
| గుర్తు: | మొసలి |
| ఎత్తు: | 100 ధనుష (300 మీటర్లు) |
| మరణ సమయానికి వయస్సు: | 200,000 పూర్వ (14.112 క్వింటిలియన్ సంవత్సరాల వయస్సు) |
| ఆరాధ్య దైవం | |
| యక్షుడు: | వాజిత్ |
| యక్షిణి: | సుతర |
జైనమతం లో పుష్పదంతుడూ (సంస్కృతం: पुष्पदन्त),'సువిధినాథుడు గా కూడా పిలువబడుతాడు. ఇతడు తొమ్మిదవ జైన తీర్థంకరుడు. [1] జైన మతం ప్రకారం ఆయన సిద్ధుడుగా మారి, ఆయన కర్మ బంధాలను నాశనం చేయుట కొరకు ఆత్మను పరిత్యజించాడని జైనుల నమ్మకం.
పుష్పదంతుడు ఇక్ష్వాకు వంశ రాజైన సుగ్రీవుడు, రాణీ రామి లకు కకండి (ఉత్తర ప్రదేశ్ లోని డియోరియా) లో జన్మించారు.[1] ఆయన విక్రమనామ సంవత్సరం మార్గశిర కృష్ణ పక్షంలో ఐదవరోజున జన్మించారు. పుష్పదంతుడు జైనమతం యొక్క తొమ్మిదవ తీర్థంకరునిగా ఋషభనాథుడు ప్రారంభించిన సాంప్రదాయాలలోని నాలుగు విభాగాల సంఘాన్ని పునర్నిర్మించారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]