ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట): కూర్పుల మధ్య తేడాలు
Mukteshvari (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 55: | పంక్తి 55: | ||
==విశేషాలు== |
==విశేషాలు== |
||
ఈ పాటను [[పి.సుశీల]] నటి [[జయసుధ]] కొరకు పాడారు. |
ఈ పాటను [[పి.సుశీల]] నటి [[జయసుధ]] కొరకు పాడారు. దర్శకుడు [[దాసరి నారాయణరావు]] ఈ పాటను [[జయసుధ]] మరియు [[అక్కినేని నాగేశ్వరరావు]] మీద చిత్రీకరించారు. ఈ పాట [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. [[పి.సుశీల]]కు ఈ పాట వలన 1982 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయనిగా నంది బహుమతి లభించింది. [[రమేష్ నాయుడు]] సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది. |
||
==లింకులు== |
==లింకులు== |
03:23, 30 జనవరి 2011 నాటి కూర్పు
ఆకులో ఆకునై పూవులో పూవునై 1982లో విడుదలైన మేఘసందేశం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట పాడినందుకు పి.సుశీలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గాయనిగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటకు సాహిత్యం అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం అందించింది రమేష్ నాయుడు.
పాట
ఆ......
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరి చేడే చిన్నరి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరణి వెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
విశేషాలు
ఈ పాటను పి.సుశీల నటి జయసుధ కొరకు పాడారు. దర్శకుడు దాసరి నారాయణరావు ఈ పాటను జయసుధ మరియు అక్కినేని నాగేశ్వరరావు మీద చిత్రీకరించారు. ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. పి.సుశీలకు ఈ పాట వలన 1982 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయనిగా నంది బహుమతి లభించింది. రమేష్ నాయుడు సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.