బంగారయ్యపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంగారయ్యపేట గ్రామం.తూర్పు గోదావరి జిల్లా తుని నియోజక వర్గములో కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామ పంఛాయితీ శివారు గ్రామంగా ఉంది[1].ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయమున్నది.150 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన శివాలయం ఉంది. ఈ శివాలయంలో విశిష్టమైన ఒక ప్రత్యేకత ఉంది.భారతదేశంలో మరెక్కడా లేనటువంటి విఛిత్రమైన విషిష్టతతో ఈ ఆలయ విరాజిల్లుతుంది.. ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ ఏకాదశ్ర్ రోజున ఈ ఆలయములో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం జరుగును. ఈ ఆలయంలో శివలింగానికి పూజిస్తారు.విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వరుని కల్యాణం జరుగుతుంది.శివకేశవులు ఇద్దరు ఒక్కటే అనే హిందూ సిద్దాంతం ఈ ఆలయంలో అచరిస్తారు.ఈ గ్రామంలో ఎక్కువగా చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవించు కుటుంబాలు ఉన్నాయి. కాలక్రమేణా చేనేత పరిశ్రమ కుంటుపడుట వలన ఇక్కడి ప్రజల జీవనం చాలా దుర్బరమైన స్థితిలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Bangarayyapeta Village , Routhulapudi Mandal , East Godavari District". www.onefivenine.com. Retrieved 2021-06-01.