బాబ్రీ మసీదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Babri Masjid

బాబ్రీ మసీదు భారతదేశంలోని అయోధ్యలో ఉన్న ఒక మసీదు. దీనిని హిందూ దేవుడైన శ్రీరాముడి జన్మస్థలం అని చాలా మంది హిందువులు నమ్ముతారు. ఇది 18 వ శతాబ్దం నుండి హిందూ ముస్లిం వర్గాల మధ్య వివాదానికి కేంద్రంగా ఉంది.[1] మసీదు శాసనాల ప్రకారం, మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు దీనిని 1528–29 (935 AH) లో జనరల్ మీర్ బాకీ నిర్మించారు. ఈ మసీదును 1992 లో హిందూ కరసేవకులు దాడి చేసి పడగొట్టారు. ఇది భారత ఉపఖండంలో మత హింసను రేకెత్తించింది.

ఈ మసీదు రామ్‌కోట్ ("రాముడి కోట") అని పిలువబడే కొండపై ఉంది.[2] హిందువుల ప్రకారం, బాకీ ఆ స్థలంలో ముందుగా ఉన్న రాముడి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఆలయం ఉనికి వివాదాస్పదమైంది.[3] సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వివాదాస్పద స్థలంలో తవ్వకం నిర్వహించింది. తవ్వకం సమయంలో వివిధ వస్తువులను కనుగొన్నారు. ఈ శిథిలాలు హిందూ నిర్మాణం ఉనికిని పోలి ఉన్నాయి. అలాగే, బాబ్రీ మసీదును నిర్మించినది ఖాళీ స్థలంలో కాదనీ, త్రవ్వబడిన నిర్మాణం కింద ఇస్లామిక్ నిర్మాణాల జాడలు లేవని`ఇ సుప్రీంకోర్టు గుర్తించింది.[4][5]

19 వ శతాబ్దం నుండి, మసీదుపై హిందువులు ముస్లింల మధ్య అనేక విభేదాలు, కోర్టు వివాదాలూ ఉన్నాయి. 1949 లో, హిందూ మహాసభతో సంబంధం ఉన్న హిందూ కార్యకర్తలు మసీదు లోపల రాముడి విగ్రహాలను రహస్యంగా ఉంచారు. ఆ తరువాత మరింత వివాదాలను నివారించడానికి ప్రభుత్వం ఈ భవనాన్ని మూసివేసింది. హిందువులు, ముస్లింలు కోర్టును ఆశ్రయించారు.[6] ప్రజలు ప్రవేశించకుండా విధంగా పోలీసులు, గేట్లకు తాళాలు వేసారు.

1992 డిసెంబరు 6 న, విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరి, మసీదును కూల్చివేసారు. దానితో భారత ఉపఖండం అంతటా అల్లర్లు చెలరేగాయి. సుమారు 2,000 మంది మరణించారు.[7][8][9][10]

రామ జన్మస్థలం అని నమ్ముతున్న ప్రదేశంలోనే మసీదును నిర్మించారనే హిందువుల వాదనను అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబరులో సమర్థించింది. కేంద్ర గోపురం ఉన్న స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు మూడవ వంతు స్థలం కూడా లభించింది.[11][12] ఈ నిర్ణయం తరువాత అన్ని పార్టీలు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసాయి. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2019 ఆగస్టు నుండి అక్టోబరు వరకు దావాను విచారించింది.[12][13] 2019 నవంబరు 9 న, సుప్రీంకోర్టు దిగువ కోర్టు తీర్పును రద్దు చేసి, మొత్తం స్థలాన్ని (2.77 ఎకరాల భూమి) హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి ఒక ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. కూల్చివేసిన బాబ్రీ మసీదు ఉన్న స్థలానికి బదులుగా ఐదు ఎకరాల స్థలాన్ని ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.[14] ఒకప్పుడు బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశం నుండి 19 మైళ్ళు (30 కి.మీ), అయోధ్య నుండి 11 మైళ్ళ (18 కి.మీ) దూరంలో ఉన్న ధన్నిపూర్ గ్రామంలో ప్రభుత్వం బోర్డుకు స్థలాన్ని కేటాయించింది.[15]

చరిత్ర[మార్చు]

ఈ మసీదు నిర్మాణానికి కారకుడైన మొఘల్ చక్రవర్తి బాబర్ పేరు మీదుగా ఈ మసీదుకు బాబ్రీ మసీదు అని పేరు వచ్చింది.[16] 1940 కి ముందు దీన్ని మస్జిద్-ఎ-జన్మస్థాన్ అని పిలిచేవారని అధికారిక పత్రాల్లో రాసి ఉంది.[17]

నిర్మాణం[మార్చు]

ఢిల్లీ సుల్తానేట్ పాలకులు, వారి వారసులైన మొఘలులు కళ, వాస్తుశిల్పానికి గొప్ప పోషకులు. వీరు అనేక చక్కని సమాధులు, మసీదులు, మదర్సాలను నిర్మించారు. ఇవి విలక్షణమైన శైలిని కలిగి ఉంటాయి, ఇది తుగ్లక్ తర్వాతి పాలకుల నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. భారతదేశం అంతటా మసీదులు వేర్వేరు శైలులలో నిర్మించబడ్డాయి. స్వదేశీ కళా సంప్రదాయాలు బలంగా ఉన్న ప్రాంతాలలో, స్థానిక చేతివృత్తులవారు చాలా నైపుణ్యం కలిగిన ప్రాంతాలలో శైలి బాగా అభివృద్ధి చెందింది. అందువల్ల ప్రాంతీయ లేదా ప్రాంతీయ శైలులు స్థానిక ఆలయం లేదా దేశీయ శైలుల నుండి అందువల్ల మసీదుల శైలులు రూపుదిద్దుకున్నాయి. ఇవి ఇంకా వాతావరణం, భూభాగం, పదార్థాల మీద కూడా ఆధార పడ్డాయి. అందువల్ల బెంగాల్, కాశ్మీర్, గుజరాత్ మసీదుల మధ్య అపారమైన వ్యత్యాసం ఉంది. బాబ్రీ మసీదు జౌన్‌పూర్ సుల్తానేట్ యొక్క నిర్మాణ శైలిని అనుసరించింది. పడమటి వైపు నుండి చూసినప్పుడు, ఇది జౌన్‌పూర్‌లోని అటాలా మసీదును పోలి ఉంటుంది.[18]


మూలాలు[మార్చు]

  1. "Timeline: Ayodhya holy site crisis". BBC News. 6 December 2012.
  2. Hiltebeitel, Alf (2009), Rethinking India's Oral and Classical Epics: Draupadi among Rajputs, Muslims, and Dalits, University of Chicago Press, pp. 227–, ISBN 978-0-226-34055-5
  3. Udayakumar, S.P. (August 1997). "Historicizing Myth and Mythologizing History: The 'Ram Temple' Drama". Social Scientist. 25 (7): 11–26. doi:10.2307/3517601. JSTOR 3517601.
  4. Digital, Times Now. "Did you know seven evidences unearthed by ASI proved a temple existed at Ayodhya? Details here". Times Now. Retrieved 2 December 2020.
  5. Web desk, India Today. "Ayodhya verdict: The ASI findings Supreme Court spoke about in its judgment". India Today. Retrieved 2 December 2020.
  6. "Tracing The History of Babri Masjid". Outlook (Indian magazine). 1 December 2017.
  7. Fuller, Christopher John (2004), The Camphor Flame: Popular Hinduism and Society in India, Princeton University Press, p. 262, ISBN 0-691-12048-X
  8. Guha, Ramachandra (2007). India After Gandhi. MacMillan. pp. 582–598.
  9. Khalid, Haroon (14 November 2019). "How the Babri Masjid Demolition Upended Tenuous Inter-Religious Ties in Pakistan". The Wire. Retrieved 30 May 2020.
  10. "As a reaction to Babri Masjid demolition, What had happened in Pakistan and Bangladesh on 6 December, 1992". The Morning Chronicle. 6 December 2018. Archived from the original on 3 ఫిబ్రవరి 2021. Retrieved 30 May 2020.
  11. The Three Way Divide, Outlook, 30 September 2010.
  12. 12.0 12.1 "Ayodhya dispute: The complex legal history of India's holy site". BBC News. Retrieved 16 October 2019.
  13. "Supreme Court hearing ends in Ayodhya dispute; orders reserved". The Hindu Business Line. Press Trust of India. 16 October 2019. Retrieved 18 October 2019.
  14. "Ram Mandir verdict: Supreme Court verdict on Ram Janmabhoomi-Babri Masjid case". The Times of India. 9 November 2019. Retrieved 9 November 2019.
  15. Sharma, Ritwik (14 February 2020). "The mood in Dhannipur, a village in Ayodhya, chosen for the 'Babri Masjid'". Business Standard. Retrieved 28 August 2020.
  16. Flint, Colin (2005). The geography of war and peace. Oxford University Press. p. 165. ISBN 978-0-19-516208-0.
  17. Multiple sources state this fact:
  18. Asgharali Engineer, ed. (1990). Babri-Masjid Ramjanambhoomi controversy. Ajanta Publications. p. 37.