భారతీయ నాగరికతా విస్తరణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ నాగరికతా విస్తరణము
కృతికర్త: మారేమండ రామారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: భారతీయ సంస్కృతి
ప్రచురణ: వేంకట్రామ అండ్ కో
విడుదల: 1947
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 89

భారతీయ నాగరికతా విస్తరణము మారేమండ రామారావు గారు రచించిన చారిత్రక గ్రంథం. దీనిని 1947 సంవత్సరంలో వేంకట్రామ అండ్ కో వారు ముద్రించారు.

భారతదేశంలోని పూర్వ సంస్కృతీ నాగరికతలు ప్రపంచమంతటా విస్తరించిన అద్భుత క్రమాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది. కాకతీయ సంచిక, శాతవాహన సంచిక వంటి సుప్రసిద్ధ, ప్రామాణిక సంచికలకు సంపాదకత్వం వహించిన చారిత్రిక పరిశోధకుడు, రచయిత మారేమండ రామారావు లభించిన ఆధారాలను అనుసరించి రచించిన గ్రంథమిది. పాశ్చాత్య ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రీ-క్రిస్టియన్ యుగానికి చెందిన మతాలు, నాగరికతలు భారతదేశ నాగరికతతో ముడిపడినవని ప్రస్తుత పరిశోధనలు కనుగోనగా అప్పటికి దొరికిన ఆధారాలను ఉపయోగించి తూర్పుదేశాల్లోని వివిధ నాగరికాంశాలకు నేరుగా భారత మూలాలు ఉన్నాయని రామారావు వివరించారు.

పుస్తకంలోని విషయాలు[మార్చు]

  • 1. ఆదర్శములు
  • 2. నాగరికతా విస్తృతి
  • 3. ఆఫ్‌గనిస్థానము
  • 4. మధ్య ఆసియా
  • 5. చైనాదేశము
  • 6. చంపారాజ్యము
  • 7. కాంభోజరాజ్యము
  • 8. దక్షిణహిందూదేశము - ప్రాగ్భారతదేశములు
  • 9. ఆంధ్రదేశము - ప్రాగ్భారతదేశములు
  • 10. సుమత్రాద్వీపము
  • 11. యవద్వీపము
  • 12. యవద్వీపకళ

మూలాలు[మార్చు]