అంతర్జాతీయ తెలుగు సంబరాలు - 2022

వికీపీడియా నుండి
(భీమవరం అంతర్జాతీయ తెలుగు సంబరాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలుగు తల్లి

అంతర్జాతీయ తెలుగు సంబరాలు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ సంస్థ ఆధ్వర్యంలో 2022 జనవరి 6,7,8 తేదీలలో నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకలు తెలుగు సాహితీవేత్తలు, కళాకారులు, తెలుగు భాషా వికాస సంస్థల సమన్వయంతో వెస్ట్ బెర్రి విద్యాలయ ప్రాంగణంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సంబరాలు జరగనున్నాయి.[1]

కార్యక్రమ కాల పట్టిక[మార్చు]

  • జనవరి 3న భీమవరంలో తెలుగు భాష వైభవ శోభాయాత్ర.
  • జనవరి 6న ప్రాచీన కవులు, రాజవంశీయుల కుటుంబీకులకు ఆంధ్ర వాయ పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేయుటకు సదస్సు ఏర్పాటు.
  • జనవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగింపు సభ, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు.[2]

కార్యక్రమ నిర్వహణ[మార్చు]

  • అధ్యక్షులు - గజల్ శ్రీనివాస్
  • ఉపాధ్యక్షులు - గురు సహస్రావధాని డా.కడిమిళ్ళ వరప్రసాద్, రెడ్డప్ప ధవేజీ, మహేశ్ వర్మ, కంతేటి వెంకట్రాజు, పొన్నపల్లి శ్రీరామరావు, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, ఆరేటి ప్రకాష్.
  • గౌరవ అధ్యక్షులు - భీమవరం ఎమ్యెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజులు.
  • కమిటీ సభ్యులు - రాయప్రోలు భగవాన్, కేశిరాజు రామ్‌ప్రసాద్, భట్టిప్రోలు శ్రీనివాస్, బి.రాంబాబు, లక్ష్మణ వర్మ, మంతెన రామ్‌కుమార్‌ రాజు, మేడికొండ శ్రీనివాస చౌదరి, జ్యోతి రాజ్, ఒడుపు గోపి, మహేష్‌.[3]

సౌకర్యాలు[మార్చు]

దేశ విదేశాలనుంచి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, రవాణా, భోజన సదుపాయం.

మూలాలు[మార్చు]

  1. "భీమవరం పట్టణంలో జనవరి 6,7,8 తేదీల్లో తెలుగు సంబరాలు". తెలుగు టైమ్స్.
  2. "భీమవరంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు". ఈనాడు.
  3. "జనవరి 6 నుంచి అంతర్జాతీయ తెలుగు సంబరాలు". సాక్షి.