మైదానం (నవల)
మైదానం | |
కృతికర్త: | గుడిపాటి వెంకట చలం |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | అరుణా పబ్లిషింగ్ హౌస్ |
విడుదల: |
మైదానం గుడిపాటి వెంకట చలం 1927 లో రచించిన నవల. ఈ నవల ప్రధానంగా స్త్రీ స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తుంది.[1] ఈ నవలను ఆ సంవత్సరం ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీకి పంపించాడు కానీ బహుమతి రాలేదు. ఆ బహుమతి విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలు, అడివి బాపిరాజు రాసిన నారాయణరావు అనే నవలలకు దక్కాయి.[2]
ఈ నవల మొత్తం ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ స్త్రీ శారీరక సుఖం కోసం పడే తపన, దానికి వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, సమాజం యొక్క పాత్ర, ఇత్యాదివన్ని ఈ స్త్రీ ద్వారా మనకు వివరిస్తాడు చలం. ఈ నవల మొత్తం స్త్రీ కోణంలో వివరించబడుతుంది, అంతా తానే చెప్తున్నట్టుగా ఉంటుంది . నవల మొత్తంలో ప్రధాన పాత్రలు మూడు. మొదటిది మూలము అయిన రాజేశ్వరిది. రెండవది అమీర్. నవల మొత్తం వీరిద్దరే ప్రధాన కర్తలు కాగా మిగిలినది మీర్ అనే పాత్ర . ఈ నవలకి ముందు మాట, ఉపోద్ఘాతం, ఇతివృత్తం ఏమీ లేవు.
మూలాలు[మార్చు]
- ↑ "మైదానం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2021-01-30.
- ↑ "స్త్రీ స్వేచ్ఛాపతాకం". www.teluguvelugu.in. Retrieved 2021-01-30.