రాజనీతి శాస్త్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజనీతి శాస్త్రము (Political science) ఒక సాంఘిక శాస్త్రము.రాజ్యాన్ని ప్రభుత్వాన్నిఅధ్యయనం చేయడమే రాజనీతిశాస్త్ర అధ్యయనం. అయితే ఇది సాంప్రదాయంగా వస్తున్న నిర్వచనం.ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రము 'శక్తినీ', అధికారాన్నీ' అధ్యయనం చేస్తొంది. స్థూలంగా రాజ్యం, ప్రభుత్వం, రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది. "రాజనీతి శాస్త్రము" అంటే రాజ్యాన్ని గురించి అధ్యయనం" అని అరిస్టాటిల్ నిర్వచించారు.అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని పేర్కొన్నాడు.అదే విధంగా మానవుడు రాజకీయజీవి అని కూడా తెలిపాడు.ఆది నుండి మానవుడు సమాజంలో సభ్యుడిగా వుంటూ, క్రమేపి రాజకీయజీవిగా మారి, రాజ్య ప్రభుత్వాలను ఏర్పారుచుకున్నాడు.

రాజనీతి శాస్త్రము పుట్టుక[మార్చు]

రాజనీతిని ఆంగ్లంలో పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ అను పదం పోలిస్ అను గ్రీకు పదం నుండి ఉధ్బవించింది.పోలిస్ అనగా నగర రాజ్యము అని అర్ధము.క్రీ.పూ. 4వ శతాభ్దాం నాటికే గ్రీకు దేశంలో స్వయంపోషక రాజ్యాలు ఉండేవి.గ్రీకు తత్వవేత్తలయిన ప్లేటో, అరిస్టాటిల్లు నగర రాజ్యాల రాజకీయ వ్యవస్థను అధ్యయనం చేసేదానిని రాజనీతి శాస్త్రముగా భావించారు.

రాజనీతిశాస్త్ర వికాసం[మార్చు]

క్రీ.పూ. 4వ శతాభ్దానికి పూర్వమే రాజనీతిశాస్త్ర వికాసం ఆరంభమయింది.గ్రీకులు తత్వశాస్త్రము నుండి దీనిని వేరుచేసి, స్వతంత్ర సాంఘీకశాశాస్త్రంగా మారడానికి కృషి చేసారు.రాజకీయ వ్యవహారాల అధ్యయనానికి మొదటగా శాస్త్రియతను కల్పించినది గ్రీకులే.

ప్రాచీనకాలంలో రాజనీతిశాస్త్ర అభివృద్ధి[మార్చు]

క్రీ.పూ. 4వ శతాభ్దానికి పూర్వమే గ్రీకులు రాజకీయాలను క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం ఆరంభించారు.గ్రీకు తత్వవేత్తలయిన ప్లేటో, అరిస్టాటిల్లు రాజకీయాలు అను పదమును ఒక సమగ్ర భావనలో వాడారు.గ్రీకులు తత్వశాస్త్రము నుండి దీనిని వేరుచేసి నైతిక విలువలు గల శాస్త్రముగా భావించారు..

మధ్యయగములలో రాజనీతిశాస్త్ర అభివృద్ధి[మార్చు]

మధ్యయగాలలో దీనిని చర్చి యొక్క మతపరమైన కార్యకలాపాలను వివరించు శాఖగా గుర్తించారు.యూరప్లో సంస్కరణల కాలం వరకు రాజకీయాలు చర్చి ఆధిపత్యానికి లోఅబడి నడుచుకొనేవి.

ఆధునికకాలంలో రాజనీతిశాస్త్ర అభివృద్ధి[మార్చు]

ఆధునికకాలంలో రాజ్యం యొక్క పరిమాణంలోను, విధులలోను అనేక మార్పులు సంభవించాయి.రాజ్యపరిధి విస్తరించబడడంతో ప్రభుత్వ పాలన సంక్లిష్టంగా మారింది.ఫలితంగా రాజనీతి శాస్త్రము వాస్తవ ధోరణులను, లౌకిక దృక్పధాన్ని సంతరించుకుంది.పారిశ్రామిక విప్లవం తరువాత పెట్టుబడీదారి వ్యవస్థ ఉధ్బవించడంతో రాజ్య విధులలో మార్పులు వచ్చాయి.అంతకుముందు రాజ్యం, శాంతి భద్రతలకు సంబంధించిన విధులను మాత్రమే నిర్వహించవలసివచ్చేది.క్రమేపీ రక్షణ విధులతో పాటు, వర్తక, వాణిజ్య వ్యాపారాలను నియంత్రించడం, బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహించడం, మార్కెట్ లను నడిపించడం, సంక్షేమ పధకాలు నిర్వహిం చడం మొదలయిన విధులను నిర్వహించుట మొదలయింది.

శాస్త్రీయ దృక్పధం[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ప్రవర్తన వాదం' రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కొత్త దృక్పధాన్ని అలవాటు చేసింది.1950,60 దశకాలలో రాజనీతి శాస్త్ర అధ్యయనానికి శాస్త్రీయతకు ప్రాధాన్యం ఉండాలనే భావం బలపడింది.జీవ శాస్త్రము, భౌతిక శాస్త్రము వలనే ప్రామాణిక పరిశోధనలు చేపట్టడం మొదలయింది.దీని ఫలితంగా రాజనీతి శాస్త్ర అధ్యయనం రాజకీయ వ్యవస్థతో పాటు, దాని విధులు, అది పనిచేయు తీరును, వాటిని ప్రభావితం చేయు అంశాలను వివరించింది.

మార్కిస్టు దృక్పధం[మార్చు]

19వ దశాబ్దంలో కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన 'మార్కిస్టు దృక్పధం'రాజనీతి శాస్త్రమును మరో తరహాలో అవిష్కరించింది..అయితే మార్క్స్ రాజ్యం వర్గ సంస్థ అని, అది ధనిక వర్గాల ప్రయోజనాలను కాపాడుతుందని, పేదల ప్రయూజనాలను కాపాడుటకు వర్గపోరాటం తప్పదని, విప్లవ ఫలితంగా వ్యక్తిగత ఆస్తి, ధనిక-పేద వర్గాలు రద్దయి సమసమాజం ఏర్పడునని మార్క్స్ భావించాడు.

మూలాలు[మార్చు]

ఇంగ్లీష్: పొలిటికల్ సైన్స్.రాజనీతి శాస్త్రంపై ఇంగ్లీష్ వికీ వ్యాసం రాజ నీతి అనగా పరిపలనా అధికరికి ఉందవలసిన దక్షత, అదీ పరిపలనదక్షత