రాణి పద్మావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాణి పద్మావతి
18 వ శతాబ్దపు పెయింటింగ్ పద్మిని.
18 వ శతాబ్దపు పెయింటింగ్ పద్మిని
సమాచారం
బిరుదుమేవార్ రాణి
దాంపత్యభాగస్వామిరతన్ సేన్
మతంహిందూమతం మతం

పద్మిని ని పద్మావతి అని కూడా పిలుస్తారు. ఈమె 13 వ -14 వ శతాబ్దపు భారతీయ రాణి.16 వ శతాబ్దపు గ్రంథాలు అనేకం ఆమె గురించి ప్రస్తావించాయి. వాటిలో 1540లో మాలిక్ ముహమ్మద్ జైసీ రాసిన ఒక పురాణ కల్పిత కవిత " పద్మావత్ " మొట్టమొదటి మూలంగా విశ్వసించబడుతుంది.

జయసీ వ్రాతలు ఆమె కథను ఈ క్రింది విధంరాజ్యవరిస్తుంది: పద్మావతి సింహళ రాజ్యానికి (శ్రీలంక) చెందిన పద్మిని ఉహాతీతమైన అందమైన యువరాణి. చిత్తూరు కోట రాజపుత్ర పాలకుడు రతన్ సేన్ రాకుమారి పద్మావతి అందం గురించి హీరామన్ (మాట్లాడే చిలుక) చెప్పగా విన్నాడు. ఆయన సాహసోపేతంగా అన్వేషణ సాగించి ఆమెను చేరుకొని తరువాత వివాహం ద్వారా చేపట్టి ఆమెను తీసుకుని చిత్తూర్ కోటకు తీసుకువచ్చాడు. రతన్ సేన్ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చేత బంధించి ఖైదు చేయబడ్డాడు. రతన్ సేన్ జైలులో ఉండగా రాజు కుంభాల్నెరు దేవ్పాలు పద్మావతి అందానికి ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రతిపాదించాడు. రతన్ సేన్ చిత్తూరు కోటకు తిరిగివచ్చి దేవ్పాలుతో ద్వంద్వ యుద్ధం చేసాడు. ద్వంద్వ యుద్ధంలో రతన్ సేన్, దేవ్పాలు ఇద్దరూ మరణించారు. పద్మావతిని పొందేందుకు అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరును ముట్టడించాడు. ఖిల్జీకి వ్యతిరేకంగా పోరాడి ఓటమి ఎదుర్కున్న తరువాత చిత్తూరు పట్టుబడింది. పద్మావతి సహచరులు జౌహర్ స్వీయ-ఆత్మాహుతి చేసుకొని ఖిల్జీ లక్ష్యాన్ని ఓడించి తమ గౌరవాన్ని కాపాడుకున్నారు. రాజపుత్రులు యుద్ధభూమిలో పోరాడి మరణించారు.

హిందూ, జైన సంప్రదాయాల్లో ఆమె గురించి అనేక ఇతర లిఖిత, మౌఖిక సంప్రదాయ కథనాలు వాడుకలో ఉన్నాయి.సంస్కరించబడిన రచనలు సుఫీ కవి జయసీ రచనలకు మద్య భేదాలు ఉంటాయి. ఉదాహరణకు రాణి పద్మిని భర్త రతన్ సేన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ముట్టడిని వ్యతిరేకించి పోరాడుతూ మరణించిన తరువాత ఆమె ఆత్మాహుతి చేసుకుందని కొంతమంది తమ వ్రాతలలో ప్రస్తావించారు. ఈ సంస్కరణలలో ఆమె హిందూ రాజపుత్ర రాణిగా వర్ణించబడింది. ఒక ముస్లిం దండయాత్రకు వ్యతిరేకంగా ఆమె గౌరవాన్ని కాపాడుకోవడాన్ని రచయిత సమర్థించాడు. సంవత్సరాలుగా ఆమె చారిత్రాత్మక వ్యక్తిగా కనిపించింది. ఆమె పాత్ర అనేక నవలలు, నాటకాలు, టెలివిజన్ సీరియళ్ళు, సినిమాలలో కనిపించింది. 1303 లో ఖిల్జీ చిత్తూరు ముట్టడి చారిత్రక సంఘటన అయినప్పటికీ అనేక మంది ఆధునిక చరిత్రకారులు పద్మిని పురాణాలలో ఆమె ఉనికి ప్రామాణికతను ప్రశ్నించారు.

పురాణ ప్రస్తావనలు[మార్చు]

రాణి పద్మిని జీవితంలోని వివిధ అంశాలను అందించే అనేక 16 వ శతాబ్దపు గ్రంథాలు మనుగడలో ఉన్నాయి.[1] సుదీ స్వరకర్త మాలిక్ ముహమ్మద్ జైసీ అవధి బాషా వ్రాసిన పద్మావత్ (సా.శ. 1540) వీటిలో మొదటిది అని భావిస్తున్నారు. ముందుగా ఇది పర్షియా లిపిలో వ్రాయబడింది.[2] 14 వ శతాబ్దంలో ముస్లిం మత న్యాయవాదులు వ్రాసిన చరిత్రలలో 1302 చిత్తోర్గఢ్ ఆక్రమణను వివరించే ఈ రాణి గురించి ప్రస్తావించబడలేదు.[3] 14 వ - 16 వ శతాబ్దాల మధ్య జైన గ్రంథాలలో - నబినందన్ జనుధర్, చిటాయ్ చరిత్ర, రాయన్ సెహ్రా రాణి పద్మిని గురించి పేర్కొన్నారు.[4] సుమారు 1500 లేదా అంతకుముందు ప్రాంతీయ మౌఖిక సంప్రదాయంలో వివిధ రకాల ఇతిహాసాలు ప్రస్తావించబడ్డాయి. పలు భాషల్లో ఈ స్మృతులు పునరావృతమై కాలక్రమేణా ఇతిహాసాలుగా రూపాంతరం చెందాయి.[5] తరువాత ఆమె కథను ప్రస్తావిస్తూ అనేక సాహిత్య రచనలు ఉత్పత్తి చేయబడ్డాయి; వీటిని నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు: [6]

పెర్షియన్ ఉర్దూ ఉపయోజనాలు

16 - 19 వ శతాబ్దాల్లో కనీసం 12 పర్షియన్, ఉర్దూ అనువాదాలు ఉన్నాయి. మాలిక్ ముహమ్మద్ జైసీ పద్మావత్ రచనలకు అనువాదాలు ఉత్పత్తి చేయబడ్డాయి.[7] 20 వ శతాబ్దంలో మరింత ఉర్దూ సంస్కరణలు సృష్టించబడ్డాయి. అవన్నీ జయసీ ప్రేమ కవి సంప్రదాయానికి అనుగుణంగా ఉన్నాయి.[5]

రాజపుత్ర జానపద గాథలు

సా.శ.1589 లో హేమ్రత్న్ కవి " గోరా బాదల్ పద్మిని చౌపాయి ". ఇది మొదటి పౌరాణిక రాజ్పుట్ "వాస్తవగాధ"గా ప్రదర్శించబడింది.[8] 16 వ - 18 వ శతాబ్దాల మధ్యకాలంలో పద్మావతి పురాణం సంబంధిత రాజపుత్రుల రచనలు ప్రస్తుత రాజస్థాన్లో రాజపుత్ర నాయకుల ఆదరణతో సంగ్రహించబడ్డాయి. జయాసి వ్రాసిన రాజపుత్రుల వివాహం ప్రధానాంశంగా కాకుండా రాజపుత్రుల రచనలు వారి రాజ్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీకి వ్యతిరేకంగా రక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ రాజపుత్రుల గౌరవాన్ని నొక్కి చెప్పాయి.[7]

జేమ్స్ టోడ్ సంస్కరణ 1829-32 సమయంలో జేమ్స్ టోడ్ అతని " అన్నల్స్ అండ్ ఆంటిక్విటీస్ ఆఫ్ రాజసా'హన్ " లో పురాణాన్ని పునఃసృష్టిలో బ్రిటిష్రాజ్ స్థావరాన్ని చేర్చాడు. రాజ్పుత్ నాయకులచే రచించబడిన రచయితల మౌఖిక, సంప్రదాయ రచనల నుండి సంగ్రహించిన సమాచారం ఆధారంగా అతని సంస్కరణను రూపొందించారు.[7]

బెంగాలీ స్వీకరణలు

19 వ శతాబ్దం చివరిలో జేమ్సు టోడ్ రచనలు బ్రిటిషు ఇండియా రాజధాని కలకత్తా చేరుకున్న సమయంలో అనేక బెంగాలీ సంస్కరణలు జరిగాయి. ఈ బెంగాలీ కథలు పద్మావతిని ఒక హిందూ రాణిగా చిత్రీకరించాయి. ముస్లిం ఆక్రమణదారులకు వ్యతిరేకంగా తమ గౌరవాన్ని కాపాడటానికి ఆమెను తనకుతాను ఆత్మాహుతి చేసుకున్నది.[7]

ఈ వివిధ సాహిత్య రచనలతో ప్రాంతీయ వర్గాల జ్ఞాపకాలలో రాణి జీవితంలో అనేక వ్యాఖ్యానాలు సంరక్షించబడుతుంది [9] రాణిపద్మిని గురించిన మౌఖిక పురాణములు, ఒకేవిధమైన వ్రాతపూర్వక పురాణాలు పాత్రలను, సాధారణ కథాంశాలను పంచుకున్నప్పటికీ వేటికవి కొన్ని ప్రత్యేకతలతో వివరాలను వ్యక్తం చేస్తాయి. మౌఖిక సంస్కరణలు సాంఘిక సమూహాల దృక్పధాన్ని వివరించాయి. అయితే ప్రారంభ సాహిత్య సంస్కరణలలో రచయిత రాజాస్థాన కేంద్రీకృతంగా దృశ్యాలను వర్ణించారు.[9] రాణి పద్మినీ గురించి మౌఖిక వ్రాతరూప పురాణాలలో ఒకరికొకరు అదనపు సమాచారం చేర్చారని రమ్యా శ్రీనివాసన్ రచనల ఆధారంగా భావిస్తున్నారు. ఒక్కొక రచన ప్రేక్షకుల సున్నితభావాలతో ప్రభావితమైంది. ముస్లిం సంస్కరణలు ఢిల్లీ సుల్తానేట్ అధినేత అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరు మీద విజయం సాధించి దానిని స్వాధీనం చేసుకున్నట్లు జయించినట్లు వివరిస్తున్నాయి. హిందూ, జైన్ సంస్కరణలు పద్మిని జీవితంలో ఢిల్లీ సుల్తానుకు వ్యతిరేకంగా ప్రదర్శించిన స్థానిక ప్రతిఘటనను వివరిస్తున్నాయి.[10]

సాహిత్యంలో[మార్చు]

మాలిక్ ముహమ్మద్ జయాసీ పద్మావత్ (క్రీ.పూ 1540)[మార్చు]

జయాసి వ్రాతలలో పద్మావతి సింహళ ద్వీప రాజ్య (సింగల్ రాజ్యం, శ్రీలంక) రాజు గంధర్వ సేన్ కుమార్తెగా వర్ణించబడింది.[11] చిలుక చిత్తొడ్ ఘర్ రాజు రతన్ సేన్ కు పద్మావతి గురించి ఆమె అందం గురించి వర్ణిస్తుంది. రతన్ సేన్ చిలుక వర్ణనకు మైమరిచి తన రాజ్యమును వదిలిపోయి ఒక సన్యాసిగా ఔతాడు. పక్షిని అనుసరిస్తూ ఏడు సముద్రాలు దాటి ద్వీప రాజ్యంలోకి ప్రవేశిస్తాడు.[12] అక్కడ అతను పద్మావతిని కలుసుకుంటాడు. ఆమెను పొందడానికి అడ్డంకులను అధిగమించి సమస్యలను ఎదుర్కొని చివరకు ఆయన విజయంసాధిస్తాడు. ఆమెను వివాహం చేసుకుని తన భార్యగా ఆమెను తీసుకుని చిత్తోరుకు తిరిగి తీసుకువెళ్ళి అక్కడ తిరిగి రాజు అవుతాడు. రతన్ సేన్ దుశ్చర్యచేసిన ఒక బ్రాహ్మణ పండితుడిని దేశం నుండి బహిష్కరిస్తాడు. ఆ పండితుడు తరువాత సుల్తాన్ అల్లావుద్దీన్ వద్దకు చేరుకుని అతనికి పద్మావతి గురించి వర్ణించి చెపుతాడు. [12] పద్మావతి కొరకు సుల్తాన్ దుష్టశక్తులతో ఆమె కోసం అన్వేషిస్తూ చిత్తోర్ను ముట్టడించారు. రతన్ సేన్ మరో ప్రత్యర్థి రాజపుత్ర పాలకుడుతో యుద్ధం చేస్తూ చనిపోతాడు. [12] పద్మావతి తనను తాను అగ్నికి ఆత్మాహుతి చేసుకుంటుంది. అల్లావుద్దీన్ ఇస్లామిక్ రాజ్యం కొరకు చిత్తూరును జయించినప్పటికీ తన వ్యక్తిగత అన్వేషణలో విఫలమౌతాడు.[13]

ఈ మొట్టమొదటి సాహిత్య సంస్కరణలో జైసీకి జననం, మరణం సంవత్సరం అస్పష్టంగా ఉంది.[14] ఆయన ఢిల్లీ సుల్తానేటు ముగిసిన తరువాత మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇస్లామిక్ చక్రవర్తి బాబరు పాలనా కాలంలో నివసించాడు. సుఫీ సంప్రదాయంలో జయసీ స్వరాలు భారత ఉపఖండంలో వ్యాప్తి చెందాయి.[15] 16 వ - 19 వ శతాబ్దాల్లో పద్మావతిపై జయసి రచనల నుండి వచ్చిన వైవిధ్యమైన సూత్రాలు సుఫీ సంప్రదాయంలో ఉన్నాయి.[16] ఒకప్పుడు యువరాణి పద్మావతి హీరామన్ అనే మాట్లాడే చిలుక సన్నిహిత మిత్రులు అయ్యారు. ఆమె, చిలుక వేదాలు - హిందూ గ్రంథాల అధ్యయనం చేస్తారు. [17] ఆమె తండ్రి తన కుమార్తెకు చిలుక సాన్నిహిత్యం చూసి క్రుద్ధుడై చిలుకను చంపమని ఆదేశించాడు. అది విని భయపడిన చిలుక తనప్రాణం రక్షించుకోవడానికి రాకుమార్తెకు వీడ్కోలు పలికి ఆమెను విడిచి వెళుతుంది. ఒక వేటకాడు ఆ చిలుకను పట్టి ఒక బ్రాహ్మణుడికి విక్రయిస్తాడు. బ్రాహ్మణుడు దానిని చిత్తోరుకు తీసుకుని వెళతాడు. ఇక్కడ స్థానికంగా ఉన్న రాజు రతన్ సేన్ దాన్ని కొనుగోలు చేసాడు. చిలుక మాట్లాడగలిగే సామర్థ్యాన్ని చూసి ప్రభావితుడౌతాడు.[17]

రతన్ సేన్ ఎదుట చిలుక పద్మావతి అందాన్ని ఎంతో ప్రశంసించింది రతన్ సేన్ పద్మావతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను నాథ్ యోగిగా తన రాజ్యాన్ని వదిలి వెళతాడు. చిలుక మార్గనిర్దేశం చేసి అతని 16,000 అనుచరులతో కలిసి రతన్ సేన్‌ను ఏడు సముద్రాలను దాటించి తర్వాత సింఘాల్కు చేర్చింది. అక్కడ అతను పద్మావతిని కోరుకుంటూ ఆలయంలో తపస్సులను ప్రారంభించాడు. ఇంతలో పద్మావతి ఆలయంలోకి వచ్చిందని చిలుక తెలియజేసింది. కానీ వెంటనే రతన్ సేన్ను కలుసుకోకుండా ఆమె తిరిగి రాజభవనం చేరుకుంది. వచ్చారు. ఆమె రతన్ సేన్ కోరుకోవడం మొదలైంది.[17]

ఇంతలో పద్మావతిని కలుసుకునే అవకాశం రాలేదని రతన్ సేన్ తెలుసుకున్నాడు. ఆయన తనను తాను నాశనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆయన ప్రయత్నన్ని శివపార్వతులు అడ్డగించారు.[18] శివుని సలహా ప్రకారం రతన్ సేన్, అతని అనుచరులు సింఘాల్ సామ్రాజ్యం రాజ కోటపై దాడి చేసి ఓడించబడి ఖైదు చేయబడ్డారు. అయితే ఇప్పటికీ సన్యాసిగానే ఉన్నాడు. రతన్ సేన్‌కు మరణశిక్ష అమలు చేయడానికి ముందుగా ఆయన చిత్తోరు రాజని బహిర్గతం చేశాడు. గంధర్ సేన్ పద్మవతిని రతన్ సేన్కు ఇచ్చి వివాహం చేసి రతన్ సేను 16,000 మంది పురుషులతో సింగల్లో 16,000 మంది పద్మిని మహిళా అనుచరులను ఏర్పాటు చేశాడు.[19]

చిలుకతో మాట్లాడుతున్న రాణి నాగమతి, పద్మావత్ సచిత్ర సంగ్రహ గ్రంథం c.సా.శ. 1750

కొంతకాలం తరువాత రతన్ సేన్ పక్షి నుండి అందుకున్న సందేశం ద్వారా అతని మొదటి భార్య - నాగమతి - అతనిని చిత్తూరుకు తిరిగి రావాలని ఎదురు చూస్తుందని గ్రహించాడు. తన కొత్త భార్య పద్మావతి అతని 16,000 మంది అనుచరులు, వారి 16,000 మంది సహచరులతో రతన్ సేన్ చిత్తూరుకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ప్రయాణ సమయంలో సముద్ర దేవత రతన్ సేన్ను ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళపై గెలుచుకున్నానని గర్వించినందుకు తుఫాను సృష్టించి శిక్షించింది: రతన్ సేన్, పద్మావతి తప్ప మిగిలినవారు తుఫానులో చంపబడ్డారు. పద్మావతి మహా సముద్రం కుమార్తె అయిన లాచ్చ్మి ప్రార్థించింది. రతన్ సేన్ మహా సముద్రం ద్వారా రక్షింపబడ్డాడు. పద్మావతికి రతన్ సేన్ ప్రేమను పరీక్షించాలని లాచ్మి నిర్ణయించుకుంది. ఆమె పద్మావతిగా మారువేషం ధరించి రతన్ సేన్ ముందు కనిపించింది. కానీ రాజు మోసపోలేదు. సముద్ర దేవుడు, లాచ్మీ తరువాత పద్మావతితో రతన్ సేన్ను తిరిగి కలిపి వారికి బహుమతులు ఇచ్చారు. ఈ బహుమతులతో రతన్ సేన్ పూరీ వద్ద నూతన మందిరం ఏర్పాటు చేసి పద్మావతితో చిత్తోరుకు తిరిగి చేరుకున్నాడు.[19]

చిత్తూరులో రతన్ సేన్ ఇద్దరు భార్యలు నాగమతి, పద్మావతి మధ్య శత్రుత్వం ఏర్పడింది. కొంతకాలం తర్వాత రతన్ సేన్ బ్రాహ్మణ న్యాయవాది రాఘవ్ చేతన్ మోసం కోసం బహిష్కరించబడ్డాడు. రాఘవ్ చేతన్ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దిన్ ఖిల్జీ సభకు చేరుకుని పద్మావతి అనూహ్యమైన అందాల గురించి చెప్పాడు. [19]పద్మావతిని చేపట్టాలని నిర్ణయించుకున్న అల్లావుద్దీన్ చిత్తోరు మీద దాడి చేసాడు. రతన్ సేన్ అల్లావుద్దీనుకు కప్పం చెల్లించడానికి అంగీకరించినప్పటికీ పద్మావతిని అప్పగించడానికి నిరాకరించాడు. చిత్తోరును స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన అల్లావుద్దీను రతన్ సేన్‌తో శాంతి ఒప్పందం చేసుకున్నాడు. తరువాత ఆయన రతన్ సేనును మోసంతో లోబరుచుకుని ఢిల్లీకి తీసుకుని వెళ్ళాడు. పద్మావతి రతన్ సేన్ విశ్వాసపాత్రులైన గోరా, బాదలుతో కొంత మంది అనుచరులతో ఢిల్లి చేరుకుంది. అక్కడ పద్మావతి తన అనుచరులను స్త్రీ సహచరుల రూపంలో తీసుకునిపోయి రతన్ సేనుని విడిపించి ఆయనతో చిత్తోరుకు చేరుకుంది. యుద్ధంలో గోరా అల్లావుద్ధీను సైనికుల చేతిలో మరణించగా బాదల్‌తో పద్మావతి రతన్ సేనులు చిత్తోర్ చేరుకున్నారు.[20]

ఇంతలో చిత్తూరు పొరుగువారి రాజ్యపు రాజు అయిన కుంభాల్నెర్ రాజు దేవిపాలు కూడా పద్మావతితో ప్రేమలో పడతారు. రతన్ సేన్ ఢిల్లీలో ఖైదు చేయబడిన సమయంలో పద్మావతికి ఒక సందేశకుడు ద్వారా వివాహం ప్రతిపాదించాడు. రతన్ సేన్ చిత్తూరుకు తిరిగి వచ్చిన తరువాత ఈ అవమానాన్ని ఎదుర్కోవడానికి దేవ్పాలును శిక్షించాలని అతడు నిర్ణయించుకున్నాడు. తరువాతి యుద్ధంలో దేవపాలు, రతన్ సేన్ ఒకరినొకరు చంపుకుంటారు. ఇంతలో పద్మావతిని పొందేందుకు అల్లావుద్దీను మరోసారి చిత్తూరుపై దాడి చేశాడు. అల్లావుద్దీనుతో పోరాడి ఓటమిని పొందిన తరువాత రతన్ సేన్ అంత్యక్రియల అగ్నిలో నాగమతి, పద్మావతులు సహగమనం చేస్తారు. చిత్తూరులోని ఇతర మహిళలు కూడా సామూహిక ఆత్మాహుతిలో మరణించారు (జౌహర్). చిత్తోరు మనుష్యులు అల్లావుద్దీనుకు వ్యతిరేకంగా పోరాడి మరణించారు. విజయం సాధించిన తరువాత అల్లావుద్దీను ఖాళీగా ఉన్న కోటను మాత్రమే పొందారు.[20] ఖిల్జీ సామ్రాజ్య లక్ష్యాలు రతన్ సేన్, పద్మావతి చేత ఓడించబడ్డాయి. ఎందుకంటే వారు తమను లొంగిపోవడానికి నిరాకరించి బదులుగా తమను తాము ఆత్మాహుతి చేసుకున్నారు.[21]

Hemratan's Gora Badal Padmini Chaupai (1589 CE)[మార్చు]

చిత్ర్రకోట్ రాజపుత్ర రాజు అయిన రతన్ సేనుకు గొప్ప పాకశాస్త్ర నిపుణురాలైన ప్రభావతి అనే భార్య ఉంది. ఒకరోజు తాను సిద్ధం చేసిన ఆహారానికి రాజు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రభావతి తన కంటే గొప్ప మహిళను తీసుకురమ్మని రతన్ సేనుని సవాలు చేసింది. రతన్ సేన్ ప్రభావతి కంటే గొప్ప మహిళను తీసుకుని వస్తానని ఆగ్రహంతో తన అనుచరునితో బయటకు వెళ్ళాడు. ఒక మహిళను కలుసుకున్నాడు. యోగి నాథు అనే ఒక సన్యాసి సింఘల్ ద్వీపంలో పద్మినీ జాతి మహిళలు అనేకమంది ఉన్నారని రతన్ సేనుతో చెప్పాడు. రతన్ సేన్ సేన్ మరొక సన్యాసి సహాయంతో సముద్రమును దాటి సింఘల్ ద్వీపం చేరుకుని అక్కడ చదరంగం క్రీడలో సింఘాల్ రాజును ఓడించాడు. సింఘాల్ రాజు తన సోదరి పద్మినిని రతన్ సేనుకు ఇచ్చి వివాహం చేస్తాడు. ఆయన రతన్ సేనుకు ఇచ్చిన బృహత్తర వరకట్నం సింఘాల్ రాజ్యంలో అర్ధభాగం, 4000 గుర్రాలు, 2000 ఏనుగులు, పద్మిని కోసం 2000 సహచరులు ఉన్నారు.[22]

చిత్తోరులో రతన్ సేన్, పద్మిని ప్రేమైక జీవితం సాగిస్తున్న సమయంలో బ్రాహ్మణుడు రాఘవ వ్యాస్ అనుకోకుండా వారిని అడ్డుకున్నారు. రతన్ సేన్ కోపాన్ని భయపడి ఆయన తప్పించుకుని ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ ఆయన అల్లావుద్దీను ఖిల్జీ సభలో గౌరవం పొందాడు. సింఘాల్ ద్వీపంలో అందమైన పద్మిని మహిళల ఉనికి గురించి అల్లావుద్దీను తెలుసుకుని అతను సింఘాలు ద్వీపం మీద దండయాత్ర చేశాడు. అయితే అతని సైనికులు సముద్రంలో మునిగిపోయారు. అల్లావుద్దీన్ సింఘాల్ రాజు నుండి కప్పం పొందగలిగినప్పటికీ కానీ ఏ పద్మినీ జాతి మహిళలను పొందలేకపోయాడు. ప్రధాన భూభాగంలో ఉన్న పద్మావతి మాత్రమే పద్మినీ జాతి మహిళ అని ఉందని అల్లవుద్దీన్ తెలుసుకున్నారు. అందువలన అతను 2.7 మిలియన్ల సైనికులను సేకరించి, చిత్తూరును ముట్టడించాడు. పద్మిని సంగ్రహావలోకనం తరువాత ఆయన రతన్ సేనుని మోసగించి బంధించాడు.[22]

భయభ్రాంతులకు గురైన చిత్తోరు ప్రముఖులు పద్మినిని అల్లావుద్దీనుని అప్పగించాలని భావించారు. గోరా, బాదిల్ అనే ఇద్దరు ధైర్యసాహసాలు కలిగిన యోధులు - పద్మావతికి సహకరించి ఆమెను కాపాడటానికి, వారి రాజును రక్షించడానికి అంగీకరించారు. రాజపుత్రులు పద్మావతిని అల్లావుద్దీన్ శిబిరానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. పద్మినీతో ఆమె చెలికత్తెల బదులుగా పల్లకీలలో దాగి ఉన్న యోధులు ఢిల్లీకి చేరుకుని రాజపుత్ర యోధులతో కలిసి రాజును రక్షించారు. గోరా అల్లావుద్దీన్ సైన్యంతో పోరాడి మరణించగా బాదల్ చిత్తోర్ రాజు, పద్మినీలతో చిత్తోరు చేరుకున్నారు. గోరా భార్య స్వీయ-సతీ సహగమనానికి పాల్పడింది (సతి). పరలోకంలో గోరాకు ఇంద్ర సింహాసనానికి సగం లభించింది.[23]

జేంస్ టాడ్ రచనలు[మార్చు]

19 వ శతాబ్దపు బ్రిటిష్ రచయిత జేమ్స్ టోడ్ రాజస్థాన్ తన " అన్నల్స్ అండ్ యాంటిక్విటీస్లో " ఒక సంస్కరణ సంకలనం చేశాడు. టోడ్ పుస్తకంలో సంకలనం చేసిన సమాచారానికి సంబంధించిన పలు వనరులను, శాసనాలు, వ్యక్తులను పేర్కొన్నారు.[24] అయినప్పటికీ ఆయన పద్మినీ పురాణాన్ని ప్రత్యేకించి సంకలనం చేయటానికి ఉపయోగించిన కచ్చితమైన మూలాలకి అతను పేరు పెట్టలేదు.[25] అతను మాలిక్ ముహమ్మద్ జైసీ పద్మావత్ గురించి కానీ ఇతర సూఫీ రచనలను కానీ ప్రస్తావించ లేదు.[24] ఆయన పద్మిని పురాణంలో ఖమ్మర్ రాసో గురించి ప్రస్తావించినప్పటికీ హిందూ, జైన్ సాహిత్య రచనలతో పాటు స్థానిక బర్డిక్ ఇతిహాస కథనాల మీద మరింత ఆధారపడ్డాడు. పద్మిని జీవిత కథ టోడ్ వెర్షన్ బహుళ వనరుల సంశ్లేషణ పద్మినికి సంబంధించిన ప్రాథమిక ఆధారాల పరిశోధనలో గ్యాన్చంద్ర టాడుకు సాయం అందించాడు.[26]

టోడ్ వెర్షన్ ప్రకారం పద్మిని సిలోన్ పాలకుడు చౌహాన్ హామిర్ సంక్ కుమార్తె.[27]స్వల్పకీర్తి కలిగిన లాచ్మన్ సింగ్ (అలియాస్ లఖమ్సీ లేక లక్ష్మమసింహ) సమకాలీన చిత్తోరుకు పాలకుడుగా ఉన్నాడు. పద్మిని లచ్మాన్ సింగ్ మామ మహారాణా భీమ్ సింగ్ ( భిమ్సి) వివాహం చేసుకున్నారు.[28] ఆమె సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. అల్లావుద్దీన్ (అలా) ఆమెను పొందటానికి చిత్తోరు మీద దాడిచేసాడు. చర్చల తరువాత పద్మావతి అందాన్ని అద్దం ద్వారా చూసాడు. రాజపుత్రులు అల్లావుద్దీన్ కోరిక మీద పద్మిని కొలను అంచున ఒక గదిలో కూర్చునేలా ఏర్పాటు చేసి పద్మావతిని సంగ్రహావలోకము చేయడానికి అల్లావుద్దీనుకు అవకాశం కలిగించారు. అది అల్లావుద్దీనుని పద్మినీపట్ల మరింత మోహితుని చేసింది. దురదృష్టవంతుడైన రాజపుత్ర రాజును సుల్తాన్ తన శిబిరానికి వెళ్ళి హాని లేకుండా తిరిగి చిత్తోరు చేరుకుంటాడు. [28]

ఏమైనప్పటికీ పద్మినిని ద్రోహముతో పట్టుకోవటానికి అల్లావుద్దీన్ ప్రయత్నించాడు. సుల్తాన్ ముస్లిం సైన్యం శిబిరానికి చేరేసమయంలో భీమిసి బందీగా తీసుకువెళ్ళాడు. అల్లావుద్దీన్ రాజపుత్ర రాజు విడుదలకు బదులుగా పద్మినిని కోరాడు. పద్మిని తన మామ గోర, అతని మేనల్లుడు బాదల్తో కలసి జౌహర్తో పాటు ఇతర రాజపుత్ మహిళలతో కలిసి ఒక భారీ నియంతృత్వంతో దాడి చేస్తుంది.[28] లొంగిపోకుండా భీంసిని కాపాడటానికి పద్మావతి గోర, బాదల్ ప్రయత్నం చేస్తుంది. పద్మిని తన తోటి ఉద్యోగులు, ఇతర మహిళా సహచరులతో కలిసి వస్తానని వారు అల్లుద్దీనుకు తెలియజేస్తుంది. వాస్తవానికి చిత్తూరు సైనికులు పల్లకీలలో ఉంచి ఇతర సైనికులు వాహనదారులుగా మారువేషంలో ఉన్నారు. [28]ఈ పథకంలో గోర, బాదల్ భీమిసును కాపాడగలిగినప్పటికీ ఈ కార్యక్రమంలో చిత్తూరు సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారు. అలాడుద్దీన్ చిత్తూరును మరోసారి పెద్ద దళాలతో దాడి చేశాడు. చిత్తూరు ఓటమిని ఎదుర్కొంది. పద్మిని, ఇతర మహిళలు స్వీయ-ఆత్మాహుతి (జౌహర్) తో చనిపోతారు. భిమ్సి, ఇతర పురుషులు అప్పుడు చంపబడిన తరువాత అలావుద్దీన్ కోటను స్వాధీనం చేసుకున్నాడు.[28][29]

జేమ్స్ టాడ్ ప్రచురణ తర్వాత కనుగొన్న శాసనాలు ఆయన లక్ష్మణసింహ (లాచ్మన్ సింగ్) ను రాజుగా పొరపాటుగా పేర్కొన్నట్లు భావిస్తున్నారు. బదులుగా ఈ శాసనాల ఆధారంగా రాణిపద్మిని సంబంధిత సాహిత్యం ఇతర రూపాల్లో కనిపించే ఒక పాత్ర రతన్ సింహా (రతన్ సింగ్ లేదా రతన్ సేన్) చిత్తోరు రాజుగా ఉన్నాడని భావిస్తున్నారు.[30] అదనంగా 1303 లో రత్నాసింహా తరువాత లక్ష్మణసింహా చిత్తోరురక్షణ కొరకు ముస్లింపాలకులకు వ్యతిరేకంగా పోరాడి విజయంసాధించాడని ధ్రువీకరించింది. [31]

బెంగాలి రచనలు[మార్చు]

పద్మిని జౌహర్ (మూకుమ్మడి ఆత్మాహుతి), "క్రూర ముస్లిములు"కు నుండి వారి పవిత్రతను కాపాడాలని కోరుకునే ఇతర మహిళలతో యగ్నేస్వర్ బందోపద్యాయ్ " మేవార్ " రచన (1884) స్పష్టంగా వివరిస్తుంది.[32]

రంగలాల్ బందోపాధ్యాయ రాజపుత్ర రాణి పద్మిని కథ ఆధారంగా దేశభక్తిపూరితంగా రచించినపద్యం " పద్మిని ఉపఖయన్ " 1858 లో ప్రచురించబడింది.[33][34]

కీషీద్ ప్రసాద్ విద్యావినోడ్ నాటకం పద్మిని (1906) జేమ్స్ టాడ్ రచన ఆధారంగా: చిత్తూరు పాలకుడు లక్ష్మణింసింహా అని పద్మిని రాజపుత్ర యోధుడు భీంసింహ భార్య. విద్యావినోద్ కథలో పలు ఉప-కథనాలు ఉన్నాయి. వీటిలో అల్లావుద్దీన్ చేత బహిష్కృత భార్య నాసిబన్, లక్ష్మణింషా కుమారుడు అరుణ్. అయినప్పటికీ అల్లావుద్దీన్ పద్మిని అతని నివేదిక కొన్ని వ్యత్యాసాలతో టాడ్ సంస్కరణను అనుసరిస్తుంది. భీంసింహాను వంచనతో అల్లావుద్దిన్ పట్టుకుంటాడు. కానీ పద్మిని పల్లకీ వ్యూహం ఉపయోగించి అతనిని కాపాడుకుంటుంది. మరొక ప్రసిద్ధ యోధుడు గోరా ఈ పోరాటంలో చంపబడ్డాడు. రాజపుత్ పురుషులు మరణపోరాటం సాగిస్తున్న సమయంలో పద్మిని, ఇతర మహిళలు తమను ఆత్మాహుతి చేసుకుంటారు. లక్ష్మణసింహా వంశం అరుణ్ కుమార్తె రుక్మ పేద అటవీ-నివాస మహిళగా మిగిలిపోయింది. [35]

అబనీంద్రనాథ్ ఠాగూర్ రాజకహాని (1909) కూడా టాడ్ కథ ఆధారంగా రాజపుత్ చరిత్ర వివరణతో ప్రారంభమవుతుంది. భీంసింహా సింహళ ద్వీపానికి ప్రయాణించిన తరువాత పద్మినిని వివాహం చేసుకుని ఆమెను చిత్తోరుకు తీసుకుని వెళతాడు. అల్లావుద్దీన్ పద్మిని సౌందర్యం గురించి పాటలు పాడే అమ్మాయి ద్వారా తెలుసుకుని ఆమెను పొందటానికి చిత్తార్ను ముట్టడించాడు. చిత్తూరును కాపాడటానికి తన భార్య అల్లావుద్దీనుకు లొంగిపోవటానికి భీంసింహ అంగీకరిస్తాడు. కానీ అతని తోటి రాజపుత్రులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. వారు అలౌద్దినుతో పోరాడి ఓడిస్తారు. తరువాత అల్లాద్దీన్ భీంసింహాను వంచనతో బంధించి విడుదచేయడానికి పద్మిని కావాలని కోరతాడు. పద్మిని రాజపుత్ర యోధులైన గోర, బాదల్‌ల తోడ్పాటుతో పల్లకీ వ్యూహంతో ఆమె తన భర్తను రక్షించుకుంటుంది. ఈ పోరాటసమయంలో గోరా మరణిస్తాడు. ఇంతలో తైమూర్ ఢిల్లీ సుల్తానును ముట్టడి చేసడన్న వార్త విని అల్లావుద్దీన్ ఢిల్లీకి తిరిగి రావలసి వస్తుంది. 13 ఏళ్ళ తర్వాత అల్లౌద్దిన్ తిరిగి వచ్చి చిత్తోరుకోటను ముట్టడిస్తాడు. లక్ష్మణింసింహా పద్మినీని అలూయిద్దీనుకు సమర్పించాలని భావించినప్పటికీ భిమ్సింహా అతనిని ఒప్పించి ఏడు రోజులపాటు పోరాడటం సాగిస్తాడు. శివుని ఆశీర్వాదంతో పద్మిని, లక్ష్మణింసింహా, మంత్రుల ముందు దేవతగా కనిపించి వారి నుండి రక్తబలి కోరుతుంది. తరువాత చిత్తూరు స్త్రీలు సామూహిక ఆత్మాహుతితో మరణిస్తారు. అయితే పురుషులు మరణపోరాటం సాగించారు. విజయంసాధించిన అల్లావుద్దీన్ పద్మినీ భవనం మినహా మినహా చిత్తూరులోని అన్ని భవనాలను కాల్చి నాశనం చేసిన తర్వాత ఢిల్లీకి తిరిగి వెళతాడు.

[36]

చారిత్రాత్మకత[మార్చు]

This building in Chittorgarh is purported to be Rani Padmini's palace, but this is not certain and is a relatively modern structure.[37]

క్రీస్తుశకం 1303 లో alla uddin ఖల్జీ చిత్తోరు ముట్టడి ఒక చారిత్రిక సంఘటన. ఈ విజయం తరచుగా పద్మిని పురాణం ద్వారా సుల్తాన్ ఖిల్జీ రాణి పట్ల మోహితుడైన ఈ కథనం చారిత్రాత్మక ఆధారాన్ని కలిగి ఉంది.[38]

సా.శ. 1303 ఆస్థాన కవి, పాన్గేరిస్టు అమీర్ ఖుస్రావు రచించిన " ఖజాన్ ఉల్-ఫుట్హు "లో వర్ణించబడిన చిత్తోర్ ముట్టడి గురించి ప్రస్తావించిన మొట్టమొదటి ఆధారంగా భావించబడుతుంది. ఆయన ప్రచార సమయంలో అల్లుద్దీనుతో కలిసి పనిచేశాడు. ఖుస్రూ ఏ పద్మావతి లేదా పద్మిని గురించి ప్రస్తావించనప్పటికీ ఖుస్రూ ప్రతిష్ఠాత్మక రచన తరువాత అనువాదకుడు పద్మిని గురించి సూచించాడు.[39] అమీర్ ఖుస్రూ చిత్తోరు ముట్టడిని తన తరువాత శృంగార రచన " దివాల్ రాణి ఖిజర్ ఖాన్ (c. సా.శ. 1315) లో వర్ణించాడు. ఇది అల్లాదీన్ కుమారుడు, గుజరాత్ యువరాణి మధ్య ఉన్న ప్రేమను వివరిస్తుంది. మళ్ళీ అతను పద్మిని గురించి ప్రస్తావించలేదు.[40]

అషీర్బది లాల్ శ్రీవాత్సవ, దశరథ శర్మ, మొహమ్మద్ హబీబ్ వంటి కొందరు పండితులు, ఖజీన్ ఉల్-ఫుతులో పద్మిని సమాచారం అమీర్ ఖుస్రూ మర్మంగా సూచన అందించినట్లు సూచించారు.[41] అదేవిధంగా 1931 లో చరిత్రకారుడు సుబిమల్ చంద్ర దత్తా చెప్పిన ప్రకారం ఖోస్రో 14 వ శతాబ్దపు చోటారు చారిత్రక కవిత్వపు శ్లాఘన, పక్షి హుడ్హౌడ్ గురించి ప్రస్తావించబడింది. తరువాత కాలం రచనలలో చిలుక కనిపిస్తుంది.[42] "అల్లాద్దీన్ ఒక మహిళ లొంగిపోవడం గురించి ప్రస్తావించాడు, బహుశా పద్మిని ".[43]

కిషోరీ సరణ్ లాల్, కాళికా రంజన్ ఖాన్న్గో వంటి ఇతర చరిత్రకారులు పద్మిని గురించి అమీర్ ఖుస్రూ ప్రస్తావన గురించి వివరణను ప్రశ్నించారు.[44]

దత్తా ప్రకారము ఖుస్రావు కవిత కచ్చితమైన చారిత్రక వివరణ సాధ్యము కాదు. పద్మిని కొరకు తనకున్న మోహం కారణంగా అలోఅవుద్దీను చిత్తోరు మీద దాడి చేయలేదని అస్సలు చెప్పలేము. అల్లావుద్దీను ఖిల్జీ మేవార్ ప్రాంతంలోని ఇతర దాడులు చేసినప్పుడు కేవలం రాజకీయ విజయాన్ని సాధించాయని దత్తా పేర్కొన్నాడు.[43] సా.శ. 1297 లో జియాదుద్దీన్ బరని ప్రకారం అల్లావుదీన్ కోత్వాల్ అధికారి రణధంబోరు ప్రపంచాన్ని గెలవటానికి ముందు చిత్తోరు, చందేరి, ధర్, ఉజ్జయినీలను జయించాలని అల్లావుద్దీను ఖిల్జీకి చెప్పాడు. ఇది పద్మినీ కొరకు కానప్పటికీ చిత్తోరుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించటానికి అల్లావుదీనుని ప్రేరేపించింది.[45] అంతేకాక అల్లావుద్దీను మీద తిరుగుబాటు చేసిన వారికీ, పోరాడిన ప్రజలకు మేవార్ శరణు ఇచ్చింది. [46] లొంగిపోవాలనే చర్చల సందర్భంగా పద్మినిని ఇవ్వాలని నిర్భందిస్తూ అల్లావుద్దీన్ ప్రస్తావించినట్లు దత్తా చెప్పాడు. ఇది దీర్ఘకాలం ఉల్లంఘించిన రాజపుత్ర రాజ్యాన్ని అవమానించేందుకు ఉద్దేశించిన నిర్భందంగా భావించబడింది.[47] అంతేకాదు ఖుస్రూ అకస్మాత్తుగా అల్లావుద్దిన్ తనతో పాటు కోటలోకి వెళ్ళాడని అకస్మాత్తుగా పేర్కొన్నాడు. కానీ ఎందుకు వెళ్ళాడు అన్న ఎటువంటి వివరాలను అందించలేదు. ఖుస్రా మూలం అతని పోషకుడు చక్రవర్తి "కోపంతో బాధపడుతున్నది" అని ప్రస్తావిస్తూ రాజపుత్ర రాజు లొంగిపోయి "రాజరిక కరుణ"ను స్వీకరించిన తరువాత ఒక్క రోజులో "30,000 హిందువులు వధించడానికి " అల్లవుద్దీను ఉత్తర్వు దారితీసిందని దత్తా వివరించాడు. [48] పద్మిని లేదా సమానమైన పదం ఖుస్రూ మూలలో కనిపించనప్పటికీ అది చిత్తోరు ముట్టడిని నిర్ధారిస్తుంది. తరువాత క్రూరమైన యుద్ధం, తరువాత పద్మిని శకం మొదలైంది.[49]

చారిత్రక పాత్రగా అభివృద్ధి[మార్చు]

జియాదుద్దీన్ బరనీ, ఇసామి చిత్తోరు ముట్టడి ఇతర ప్రారంభ ఆధారాలు వంటివి పద్మిని గురించి ప్రస్తావించ లేదు. వారి రికార్డులు ప్రకారం అల్లావుద్దీను చిత్తూరును స్వాధీనం చేసుకుని అక్కడ సైనిక గవర్నర్లను ఏర్పాటు చేసిన తరువాత రతెన్సెన్, అతని కుటుంబాన్ని క్షమించిన తరువాత ఢిల్లీకి తిరిగి వచ్చాడని తెలియజేస్తున్నాయి.[50][51] పద్మిని మొట్టమొదటి అనిశ్చితమైన సాహిత్య ప్రస్తావన మాలిక్ ముహమ్మద్ జైసీ పద్మావత్ (సా.శ. 1540)లో చేయబడింది.[12] రమ్య శ్రీనివాసన్ రచనల ఆధారంగా "మల్వా సుల్తానేట్ (1469-1500) జయాసి అల్లూదిన్ ఖిల్జీ, గియాత్ అల్-దిన్ ఖిల్జీ పద్మిని కోసం అన్వేషణను చేపట్టారు. హిందూ శాస్త్రాలలో వర్ణించిన పద్మినీజాతి స్త్రీల కొరకు రాజపుత్ర యువరాణి గురించి కాక ఆదర్శవంతమైన మహిళ కొరకు అన్వేషించారని వివరిస్తుంది. ఉదయపూర్ ప్రాంతంలోని ఒక హిందూ శాసనం ప్రకారం గిహాత్ అల్-దిన్ ఖిల్జీ 1488 లో రతన్ సేను కొరకు పోరాడిన రాజపుత్ర నాయకుడు బాదల్-గోర చేత యుద్ధంలో ఓడిపోవడం యాదృచ్ఛికంగా జరిగింది.[52] హేమారతన్ " గోర బాదల్ పద్మిని చౌపాయి " (సా.శ. 1589) కధల పేర్లు నిజమైన సంఘటనల ఆధారంగా దీనిని పేర్కొన్నారు.[8] అప్పటి నుండి 19 వ శతాబ్దం వరకు ఈ రెండు సంస్కరణల అనేక ఇతర అనుకరణలు ఉత్పత్తి చేయబడ్డాయి.[5] 16 వ శతాబ్దపు చరిత్రకారులైన ఫిర్షితా, హజీ-ఉద్-దాబీర్ పద్మినిని చారిత్రాత్మక వ్యక్తిగా పేర్కొనడానికి పూర్వపు రచయితలుగా ఉన్నారు. కానీ వారి రచనలు ఒకదానికొకటి జైసీతో విభేదిస్తాయి. ఉదాహరణకు ఫిరిష్ట ప్రకారం పద్మిని రతన్ సేన్ కుమార్తె (భార్య కాదు).[53]

ప్రస్తుతం నమ్మదగనిదిగా పరిగణించబడుతున్న 1820 లలో బ్రిటీష్ రచయిత జేమ్స్ టాడ్,[54] 1820 లో రాజస్థాన్ పురాణగాధలను సంగ్రహించాడు. ఆయన పద్మినిని ఒక చారిత్రాత్మక వ్యక్తిగా పరిచయం చేస్తూ పద్మిని చిత్తోరు చారిత్రాత్మక ముట్టడితో సంబంధం కలిగి ఉన్నదని పేర్కొన్నాడు. 19 వ శతాబ్దంలో స్వదేశీ కదలిక సమయంలో పద్మిని భారత దేశభక్తికి చిహ్నంగా మారింది. భారతీయ జాతీయ రచయితలు ఆమె కథను వీరోచిత త్యాగానికి ఉదాహరణగా చిత్రీకరించారు. 1905 తర్వాత ఆమె పాత్రతో అనేక నాటకాలు ప్రదర్శించబడ్డాయి.[55] ఐర్లాండులో జన్మించిన సోదరి నివేదిత (1866-1971) కూడా చిత్తోరును సందర్శించి పద్మిని చారిత్రాత్మకమైనదని భావించింది. అబనీంద్రనాథ్ ఠాగూర్ (1871-1951) రాజకహీని ఆమెను పాఠశాల విద్యార్ధుల మద్య ఒక చారిత్రక వ్యక్తిగా ప్రచారం చేసింది. తరువాత కొన్ని చరిత్ర పాఠ్యపుస్తకాలు పద్మిని పొందటానికి ఖిల్జీ చిత్తోరును ఆక్రమించాడని తెలియజేయడం మొదలైంది.[56] జవహర్లాల్ నెహ్రూ " ది డిస్కవరీ ఆఫ్ ఇండియా (1946)" కూడా అద్దంలో పద్మినీని చూసిన ఖిల్జీని గురించి వివరిస్తుంది; నెహ్రూ కథనం ఇటీవలి స్థానిక కవుల రచనల మీద ఆధారపడిందని భావిస్తున్నారు.[57]

20 వ శతాబ్దం నాటికి రాజపుత్రంలోని రాజ్పుత్ హిందూ స్త్రీలు పద్మినిని రాజపుత్ర స్త్రీత్వము చారిత్రక ప్రతీకగా వర్ణించారు. [58] హిందూ కార్యకర్తలు ఆమెను చురుకైన హిందూ స్త్రీగా వర్ణించారు. ఆక్రమణదారు ఖల్జీకి వ్యతిరేకంగా ప్రతిఘటన చేసిన వీరోచిత చర్యగా ఆమె ఆత్మాహుతి వర్ణించబడింది.[56] ఆమె పాత్రకు ఆమెను గౌరవించటానికి, ముస్లిల అఘాయిత్యానికి బలికావడానికి బదులుగా జౌహారుకు ఇష్టపడటం ధైర్యానికి చిహ్నంగా భావించబడింది. [59]

సింబాలిజం[మార్చు]

రాణి పద్మిని జీవిత కథ కొన్ని ముస్లిం సుఫీ, హిందూ నాథ్, జైన్ సాంప్రదాయిక వ్రాతప్రతుల్లో పొందుపరచబడింది. దీనిలో ఇతివృత్తాలు సింబాలిక్గా ఉన్నాయి.[60] వీటిలో కొన్ని 17 వ శతాబ్దానికి చెందినవి, చిత్తోరు (చిత్-ఔర్) మానవ శరీరాన్ని సూచిస్తుందని చెపుతారు. రాజు మానవ ఆత్మ, సింగాల ద్వీపం రాజ్యం మానవ హృదయం, పద్మిని మానవ మనస్సు. ఈ చిలుక గురువు (గురువు) మార్గదర్శకులు, సుల్తాన్ అల్లావుద్దీన్ మాయ (ప్రాపంచిక భ్రాంతి) ను సూచిస్తుంది. [61] రాణి పద్మిని జీవిత కథ అటువంటి అనురూప వివరణలు రాజస్థాన్లోని హిందువులు, జైనుల బర్డిక్ సంప్రదాయాలలో కూడా కనిపిస్తాయి.[62]

ప్రముఖ మాధ్యమసంస్కృతిలో[మార్చు]

పద్మిని పురాణం ఆధారంగా అనేక చిత్రాలు భారతదేశంలో తయారు చేయబడ్డాయి. వీటిలో దేబాకి బోస్ నిశ్శబ్ద చిత్రం " కమోనర్ అగున్ " లేదా ఫ్లేమ్స్ ఆఫ్ ఫ్లెష్ (1930).[63] , హిందీ భాషా చిత్రం " మహారాణి పద్మిని " (1964) ఉన్నాయి.[64]

  • 1963 లో మొదటిసారిగా ఈ చిత్రం తమిళంలో " చిట్టూర్ రాణి పద్మిని " గా చిత్రీకరించబడింది. సి. వి. శ్రీధర్ రాసి, చిత్రపు నారాయణ రావు దర్శకత్వం వహించి శివాజీ గణేసన్, వైజయంతిమలా ప్రధాన పాత్రలలో నటించారు.[65]
  • 1986 లో హేమా మాలిని రాణి పద్మిని పాత్రను ఆంథాలజీ సీరీస్ తెరా పన్హీ ధారావాహిక భాగాలలో ఒకటిగా నటించింది.[66]
  • 2009 లో చిత్తోరుకి రాణి పద్మిని కా జోహర్ హిందీ భాషా టెలివిజన్ ధారావాహిక సోనీ టి.వి.లో ప్రసారమైంది.
  • 2017 లో చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి పద్మావతి చిత్రాన్ని హిందీ భాషా చిత్రంగా నిర్మించాలని నిశ్వయించుకున్నాడు.

ఇందులో దీపికా పడుకొనే పద్మావతి పాత్ర పోషించింది. ఈ చిత్రం వివాదాస్పదంగా మారింది. ఇది విపరీతంగా ప్రజలలో విభజన జరగడానికి దారితీసింది. విడుదలకు ముందు ఈ సినిమాలో జైసీ సంస్కరణను సమర్పించి, రాజపుత్ రాణిని తృణీకరించినట్లు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు భావించారు. కొంతమంది రాజకీయ నాయకులు వివరణను ఇవ్వాలని నిర్బంధం చేశారు. ఇతరులు దీనిని విడుదల చేయడానికి మద్దతు చేశారు.[67] ఖల్జీ, పద్మిని మధ్య ఒక శృంగార సన్నివేశంతో చరిత్రను వక్రించిందని ఆరోపిస్తూ నిషేధానికి పిలుపునిచ్చారు. చలన చిత్ర దర్శకుడు చిత్రంలో ఇటువంటి దృశ్యం లేదని వివరించారు. చలనచిత్రాన్ని నిషేధించాలన్న పిటిషన్ను భారతీయ సుప్రీం కోర్ట్ తిరస్కరించింది. భారతీయ రాజ్యాంగం ద్వారా సంరక్షించబడిన వాక్స్వాతంత్ర్యం కారణంగా చూపి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ చిత్రం పద్మవవత్ గా 2018 జనవరి జనవరి చివరలో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విడుదలైంది.[68][69]

వెలుపలి లింకులు[మార్చు]

  1. Ramya Sreenivasan 2007, pp. 2–3, Quote: "Multiple narratives of Padmini of Chitor first emerged in the sixteenth century, and survived over the next four centuries.".
  2. Ramya Sreenivasan 2007, pp. 2, 9.
  3. Ramya Sreenivasan 2007, p. 4.
  4. ""Khilji did not attack Chittor for Padmini"".
  5. 5.0 5.1 5.2 Ramya Sreenivasan 2007, pp. 3–4.
  6. Ramya Sreenivasan 2007, p. 2-3.
  7. 7.0 7.1 7.2 7.3 Ramya Sreenivasan 2007, p. 3.
  8. 8.0 8.1 Ramya Sreenivasan 2007, pp. 3, 209.
  9. 9.0 9.1 Ramya Sreenivasan 2007, pp. 6–8.
  10. Ramya Sreenivasan 2007, pp. 7–12.
  11. Ramya Sreenivasan 2007, pp. 27, 35–36.
  12. 12.0 12.1 12.2 12.3 Ramya Sreenivasan 2007, p. 27.
  13. Ramya Sreenivasan 2007, p. 27, Quote: "As Jayasi points out, a victorious Alauddin failed in his quest, even as Chitaur became Islam.".
  14. Ramya Sreenivasan 2007, p. 28.
  15. Ramya Sreenivasan 2007, pp. 29–32, 36–45, 204.
  16. Ramya Sreenivasan 2007, pp. 29–30, 123–124.
  17. 17.0 17.1 17.2 Ramya Sreenivasan 2007, p. 207.
  18. Ramya Sreenivasan 2007, pp. 207–208.
  19. 19.0 19.1 19.2 Ramya Sreenivasan 2007, p. 208.
  20. 20.0 20.1 Ramya Sreenivasan 2007, p. 209.
  21. Ramya Sreenivasan 2007, pp. 201–202.
  22. 22.0 22.1 Ramya Sreenivasan 2007, p. 210.
  23. Ramya Sreenivasan 2007, p. 211.
  24. 24.0 24.1 Ramya Sreenivasan 2007, p. 137.
  25. Ramya Sreenivasan 2007, p. 138.
  26. Ramya Sreenivasan 2007, pp. 119, 138–139.
  27. Ramya Sreenivasan 2007, p. 140.
  28. 28.0 28.1 28.2 28.3 28.4 Lindsey Harlan 1992, pp. 183-185 with footnotes.
  29. Ramya Sreenivasan 2007, pp. 214–217.
  30. Subimal Chandra Datta 1931, pp. 289–290.
  31. Subimal Chandra Datta 1931, pp. 293–294.
  32. Ramya Sreenivasan 2007, pp. 224–225.
  33. K. M. George (1992). Modern Indian Literature, an Anthology: Surveys and poems. ISBN 9788172013240. Retrieved March 1, 2018.
  34. Sisir Kumar Das (2005). History of Indian Literature. ISBN 9788172010065. Retrieved March 1, 2018.
  35. Ramya Sreenivasan 2007, pp. 222–224.
  36. Ramya Sreenivasan 2007, pp. 225–226.
  37. Shiri Ram Bakshi 2008, p. 182, Quote: "At Chitor no building of this class can with certainty be said to have existed anterior to the sack of the place by Alauddin in 1303.".
  38. Catherine B. Asher & Cynthia Talbot 2006, p. 41.
  39. Ramya Sreenivasan 2007, pp. 22–23, Quote: "His [Amir Khusrau] eyewitness account does not mention Padmini, although its modern translator sees a covert allusion to the queen: (...)".
  40. Ramya Sreenivasan 2007, pp. 22–24.
  41. Ram Vallabh Somani 1976, pp. 97–98.
  42. Subimal Chandra Datta 1931, p. 298 footnote 3.
  43. 43.0 43.1 Subimal Chandra Datta 1931, pp. 297–298.
  44. Ram Vallabh Somani 1976, p. 98.
  45. Subimal Chandra Datta 1931, p. 290.
  46. Subimal Chandra Datta 1931, p. 291.
  47. Subimal Chandra Datta 1931, p. 298.
  48. Subimal Chandra Datta 1931, p. 292-293.
  49. Subimal Chandra Datta 1931, p. 289-293.
  50. Aditya Behl 2012, p. 177.
  51. V. K. Agnihotri 2010, p. 2.
  52. "What history can and can't tell you about Alauddin Khilji and legend of Padmavati".
  53. Syama Prasad Basu 1963, p. 139-141.
  54. Jason Freitag 2009, pp. 3–5.
  55. Ratnabali Chatterjee 1996, p. 37.
  56. 56.0 56.1 Ratnabali Chatterjee 1996, p. 38.
  57. Ram Ohri (28 January 2017). "Rani Padmini And Alauddin Khalji: Separating Fact From Fiction". Swarajya. Retrieved 31 January 2017.[permanent dead link]
  58. Ramya Sreenivasan 2007, p. 1.
  59. Lindsey Harlan 1992, pp. 182–187.
  60. Ramya Sreenivasan 2007, pp. 30–31, 44–45, 95.
  61. Ramya Sreenivasan 2007, pp. 30–31, 44–45.
  62. Ramya Sreenivasan 2007, pp. 94–96.
  63. Kishore Valicha 1980, p. 124.
  64. Rajendra Ojha 1998, p. 91.
  65. Chitoor Rani Padmini (1963)
  66. "When Hema Malini played Rani Padmini". Retrieved April 19, 2018.
  67. People feel Padmini has been denigrated in Padmavati: Nitish, Press Trust of India, India Today (December 2017)
  68. Padmaavat previews box office collection: Deepika film opens to terrific response, India Today (January 2018)
  69. Padmavat: Controversial film cleared by India's top court, BBC News (January 2018)