వస్త్రాపూర్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వస్త్రాపూర్ సరస్సు

వస్త్రాపూర్ సరస్సు భారతదేశం లోని గుజరాత్ రాష్ట్రంలో గల అహ్మదాబాద్ కు పశ్చిమాన ఉంది. దీనికి అధికారికంగా గుజరాత్ కవి నర్సింగ్ మెహతా జ్ఞాపకార్థం భక్త కవి నర్సింగ్ మెహతా సరోవర్ అని పేరు పెట్టారు.

ఉద్యానవనం[మార్చు]

ప్రతి వారాంతంలో చాలా మంది ఈ సరస్సును సందర్శిస్తారు. ఇది ప్రస్తుతం ఒక ప్రదర్శనశాలను, పిల్లల ఉద్యానవనాన్ని కలిగి ఉంది. సరస్సు చుట్టూ ఉన్న మార్గం గుండా ఉదయం, సాయంత్రం సమయాల్లో చాలా మంది జాగింగ్ చేస్తూ ఉంటారు.

సాంస్కృతిక కార్యక్రమాలు[మార్చు]

సరస్సు చుట్టూ ఉన్న పచ్చని పచ్చిక బయళ్ళలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. నర్మదా నది నుండి వచ్చే నీరు ఈ సరస్సులోకి అప్పుడప్పుడు వస్తుంది.[1]

నర్సింగ్ మెహతా[మార్చు]

2013 లో, నర్సింగ్ మెహతా జ్ఞాపకార్థం వస్త్రాపూర్ సరస్సును భక్త కవి నర్సింగ్ మెహతా సరోవర్ గా మార్చారు. సరస్సు తోటలో నర్సింగ్ మెహతా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.[2]

కరువు[మార్చు]

వస్త్రాపూర్ సరస్సు

2016 లో, సరస్సు దాదాపు ఎండిపోయింది. ప్రజలు చనిపోయిన చేపలను తొలగించి, మిగిలి ఉన్న చేపలను వేరే చోటికి తరలించారు.[3]

అభివృద్ధి[మార్చు]

సెప్టెంబర్ 2019 లో, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ సరస్సును నర్మదా నది నీటితో నింపాలని ప్రణాళికలు వేశారు.

మూలాలు[మార్చు]

  1. "Vastrapur Lake to become Narsinh Mehta Sarovar". 2013-02-25. Retrieved 2016-03-12.
  2. Prashant Dayal (2009-10-22). "Vastrapur Lake infused life in new Amdavad". The Times of India. Retrieved 2016-03-12.
  3. AFP (2016-04-30). "El Niño dries up Asia as La Niña looms". Cebu Daily News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-05-02.