వాడుకరి:Purushotham9966/స్వప్న సారస్వతం నవల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రీస్తు శకం 1600 ప్రాంతంలో గోమంతకంలో(గోవాలో) పోర్చుగీసు వాళ్ళు కాలుబెట్టి మతప్రచారరం చేస్తూ, తరచూ హింసాపద్ధతుల్లో బలవంతంగా మతమార్పిడి చేశారు. స్థానిక రాజులు పోర్చుగీస్ వారి ఆయుధాముందు, శక్తిముందు తలవాల్చక తప్పలేదు. ఆనాటి కల్లోల వాతావరణంలో పోర్చుగీసు వారి దౌర్జన్యాల పాలబడిన సారస్వత బ్రాహ్మణులు తమ మతాన్ని, కుటుంబాలను కాపాడుకొనే ప్రయత్నంలో గోమంతకం నుంచి పడమటి సముద్రం అంచునే దక్షిణంవైపు పారిపోయి కర్ణాటకలో, కేరళలో స్థిరపడ్డా, తమ భాషను, ఆచారవ్యవహారాలను మరచిపోలేదు. ఈ నవల కొంకణీయుల వలసకథ. క్రీస్తు శకం 1200ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మణులు కాశ్మీరంనుంచి గోమంతానికి వలసవచ్చి గోవాలో స్థిరపడ్డా, చేపలు భుజించడం వంటి కాశ్మీరం అలవాట్లతో బ్రాహ్మణుల్లో విలక్షణంగా ఉంటారు.

సారస్వతులు సొంతఊరు, దేశం విడిచిపెట్టి దక్షిణాభిముఖంగా సుదీర్ఘమైన ప్రస్థానంలో కన్నడదేశంలో, అక్కడక్కడా కొన్ని ఊళ్లలో స్థిరపడ్డారు.

నాలుగు వందల సంవత్సరాలక్రితం జరిగిన సారస్వత బ్రాహ్మణుల వలసలను గూర్చి గోపాలకృష్ణ పై స్వప్న సారస్వతం పేరుతో ఏడుతరాల "పై వంశీయుల" చరిత్రను, జీవన యాత్రను తవ్వితీసి నవలారూపంలో సమర్పించాడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన షుమారు 600పుటల కన్నడ నవలను గుత్తి(జోళదరాశి)చంద్రశేఖర రెడ్డి తెలుగు చేశాడు. ఈ నవలలో ఆనాటి సారస్వత బ్రాహ్మణ సమాజంలోని మూఢనమ్మకాలు, సర్పదోషాలు, నాగపూజలు, పిచ్చి నమ్మకాలూ, అనాచారాలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ రచయిత చిత్రించాడు. సారస్వతుల్లో ఆనువంశికంగా కనిపించే అతి బాల్యవివాహాలు, బాలవితంతువులు, బాలవితంతువులను ఘోరంగా, సంఘబాహ్యుల్లాగా చూడడం, స్త్రీలుపడ్డ కష్టాలు అన్నీ నవలలో ఉన్నాయి. గోపాలకృష్ణ పై పరిశోధనాకృషి ఈ నవలలో కనిపిస్తుంది.