Coordinates: 24°37′N 82°00′E / 24.617°N 82.000°E / 24.617; 82.000

వింధ్య పర్వతాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వింధ్య పర్వత శ్రేణులు

వింధ్య పర్వతాలు లేదా వింధ్య పర్వత శ్రేణి (ఆంగ్లం : Vindhya Range), (సంస్కృతం विन्‍ध्य ) పశ్చిమ మధ్య భారత ఉపఖండంలో గల పర్వతశ్రేణులు. ఈ పర్వత శ్రేణులు ఉత్తరభారత్, దక్షిణ భారత్ విడదీస్తున్నాయి. ఇవి అతి ప్రాచీన ముడుత పర్వతా శ్రేణులు.

ఈ పర్వతశ్రేణులు ప్రధానంగా మధ్యప్రదేశ్లో గలవు. వీటి పశ్చిమ భాగాలు గుజరాత్ లోనికి తూర్పుభాగాలలో (గుజరాత్ ద్వీపకల్పంలో) చొచ్చుకుపోయి ఉన్నాయి. వీటి తూర్పు భాగాలు మిర్జాపూర్ వద్దగల గంగానది వరకూ వ్యాపించియున్నాయి.

వీటి దక్షిణ వాలులు నర్మదా నది, అరేబియా సముద్రం వరకూ వ్యాపించియున్నవి.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

అమరకోశం రచయిత చేసిన ఒక వ్యాఖ్యానం ఆధారంగా వింధ్య అనే పదానికి సంస్కృత పదం వింధ్ (అడ్డుకోవడం) మూలం అని భావిస్తున్నారు. ఒక పౌరాణిక కథలో (క్రింద చూడండి) వింధ్య ఒకసారి సూర్యుడు మార్గానికి ఆటంకంగా ఉందని వివరిస్తుంది. [1] నిరంతరం పెరుగుతూ సూర్యుడి మార్గాన్ని అడ్డగిస్తున్న గొప్పపర్వతం అయిన వింధ్య అగస్త్యుడికి ఇచ్చిన మాటకు విధేయత చూపి ఆగిపోయిందని వాల్మీకి రామాయణం సూచిస్తుంది.[2] మరొక సిద్ధాంతం ఆధారంగా సంస్కృతంలో "వింధ్య" అంటే "వేట" ఈ ప్రాంతంలో నివసించే గిరిజన వేట - సేకరణ విధానంలో జీవించిన వేటగాళ్ళు నివసించారు కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు సూచించబడి ఉండవచ్చు.[3]

వింధ్యపర్వత ప్రాంతాన్ని "వింధ్యాచల" లేదా "వింధ్యాచల్" అంటారు. అచల (సంస్కృతం), లేదా అచలే (హిందీ)అంటే చలించనిది అని అర్ధం. పర్వతం చలించనిది కనుక దీనికి అచలం అనే పేరును సూచిస్తుంది.[4][5] మహాభారతంలో కూడా ఇది వింధ్యపర్వతంగా సూచించబడింది. గ్రీకు భౌగోళికశాస్త్రవేత్త టోలెమీ విధియస్ (ఔండియన్) వింధ్యపర్వతాలు నర్మదోస్ (నర్మదా), ననగౌండా (తపతి) నదులకు మూలంగా ఉన్నాయని అభివర్ణించాడు. కౌషితాకి వీటిని " దక్షిణపర్వత" ఉపనియాహద్ పేర్కొన్నాడు. వింధ్యపర్వతం ( "దక్షిణ మౌంటైన్") కూడా గుర్తించబడుతుంది.[6]

విస్తరణ[మార్చు]

వింధ్య భౌగోళికంగా విభిన్న పర్వతావళిగా విస్తరించి ఉంది. ఈ పర్వతావళిని సామూహికంగా వింధ్య అని పిలుస్తారు.[7] వింధ్యపర్వతాలు నిజానికి పర్వత చీలికలతో, కొండలతో, పర్వతాలతో, పీఠభూములతో ఏర్పడిన పర్వతాల గొలుసు. "వింధ్య" అనే పేరుతో సాంప్రదాయకంగా పిలువబడుతుంది. వింధ్యపర్వతాల ఖచ్చితమైన ఎత్తు వివిధ సమయాలలో మారుతూ ఉంది.

చారిత్రక వివరణ[మార్చు]

వింధ్య శ్రేణి - మండవ్, మధ్యప్రదేశ్‌

గతంలో "వింధ్య" అనే పదం విస్తృత అర్ధంలో ఉపయోగించారు. ఇండో-గంగా మైదానాలు, దక్కన్ పీఠభూమి మధ్య కొండల సరిహద్దుగా భావించినట్లు పాత గ్రంధాలలో పేర్కొన్న వివిధ వివరణలు తెలియజేస్తున్నాయి. వింధ్యపర్వతాలు ఉత్తరంగా గంగా నుండి దక్షిణంగా గోదావరి వరకు విస్తరించాయి.[1]

కొన్ని పురాణంలో ప్రత్యేకించి వింధ్య అనే పదం నర్మదా, తపతి నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణిగా వివరించబడింది. ఇప్పుడు ఆప్రాంతం సాత్పూరా శ్రేణులు అని పిలువబడుతుంది.[3][8] వరాహ పురాణం సాత్పురా శ్రేణిని వింధ్య అనే పదం ( "వింధ్య పాదాల") ఉపయోగించింది.

అనేక పురాతన భారతీయ గ్రంథాలు, శాసనాలు (ఉదాహరణకు గౌతమీపుత్ర శాతకర్ణి (నాసిక్ ప్రశాంతి)) మద్య భారతదేశాన్ని వింధ్య, క్సా (క్సావత్ లేదా రిక్షా), పరియాత్ర (పరిపత్ర)లో అనే మూడు పర్వత శ్రేణులుగా పేర్కొన్నాడు. మూడు శ్రేణుల ప్రాంతం భరతవర్షగా పిలువడింది. అనగా ఇవి ఏడు కుల పర్వతాల ( "క్లాన్ పర్వతాలు") లో చేర్చబడ్డాయి భారతదేశం. ఈ మూడు శ్రేణుల ఖచ్చితమైన గుర్తింపు కారణంగా పలు వివరణలో వైవిధ్యం లేదు . ఉదాహరణకు కూర్మ, మత్స్య, వింధ్య బ్రహ్మాండ పురాణాలు తపతినది మూలంగా ఈ పర్వతాలను పేర్కొన్నాయి; బ్రహ్మా, విష్ణు పురాణాలలో అయితే దాని మూలంగా క్సా పేర్కొనబడలేదు.[9] కొన్ని పురాణ గ్రంధాలు భారతదేశం కేంద్రంలో వింధ్యపర్వతాలు ఉన్నట్లు పేర్కొన్నాయి.

వాల్మీకి రామాయణం ప్రస్తుత కర్ణాటక భూభాగాన్ని వింధ్యగా వివరించింది. ఇందులో వింధ్య కిష్కిందకు దక్షిణాన (రామాయణ 4-46. 17)ఉన్నట్లు పేర్కొన్నది. వింధ్యపర్వతాలకు దక్షిణంగా విస్తరించిన సముద్రంలో లంక ఉన్నట్లు పేర్కొకొన్నది. చాలా మంది మేధావులు వివిధ మార్గాలలో ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి ప్రయత్నించారు. ఒక సిద్ధాంతం రామాయణం వ్రాసిన సమయంలో వింధ్యపర్వతప్రాంతాలు ఇండో-ఆర్యన్ ప్రజలనివాసిత ప్రాంతంగా వివరించబడింది. ఫ్రెడెరిక్ ఈడెన్, ఫార్గిటార్ వంటి ఇతరులు అదే పేరోతో దక్షిణ భారతదేశంలో మరో పర్వతం ఉందని అని విశ్వసిస్తున్నారు.[10] మాధవ్ వినాయక్ కైబ్ మద్యభారతదేశంలో లంక ఉన్నట్లు సూచించాడు.[11]

బరాబర్ మౌఖారి అనంతవర్మన్ శాసనం బీహార్ నాగార్జున కొండను వింధ్యపర్వతశ్రేణిలో ఒక భాగంగా పేర్కొన్నాడు.[6]

ప్రస్తుతకాల వివరణ[మార్చు]

భారతదేశంలోని ప్రముఖ పర్వత శ్రేణుల మ్యాప్, మధ్య భారతదేశంలోని వింధ్య పర్వతాలను చూడవచ్చు

వింధ్య ప్రధానంగా నర్మదా నది ఉత్తరాన ఉన్న మద్యభారత పర్వతశ్రేణులకు, కొండలు, పర్వతాలకు నెలవై ఉంది.[3] వీటిలో కొన్ని ప్రత్యేకమైన కొండలశ్రేణిగా ఉన్నాయి.[12]


వింధ్యపర్వతశ్రేణి పశ్చిమం నుండి తూర్పుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రం సరిహద్దు వరకు విస్తరించి ఉంది. కొండల శ్రేణి చంపానెస్ సమీపంలోని ఆరావళి పర్వతశ్రేణి వరకు వింధ్య విస్తరించింది. వింధ్యపర్వతశ్రేణి ఎత్తు చోటా ఉదయపూర్ తూర్పున శిఖరాగ్రానికి చేరుకుంటుంది.[13]

ప్రధాన వింధ్యపర్వతశ్రేణి మద్యభారతంలో దక్షిణంగా ఎత్తైన ఏటవాలు ఏర్పరుస్తుంది. ఇది సుమారు మధ్యప్రదేశులో నర్మదానదికి సమంతరంగా తూర్పు-పడమర దిశలో మాల్వా పీఠభూమి, దక్షిణ కుడ్యగా విస్తరించింది.

వింధ్యతూర్పు భాగం పలు పర్వతశ్రేణులుగా విభజితమై ఉంది. అమరకాంతక్ సమీపంలో మైకల్ కొండలలో సాత్పురా శ్రేణి సంగమిస్తున్న, సాన్,నర్మదా నదుల సంగమస్థానానికి ఎగువన వింధ్య ఒక దక్షిణ శ్రేణి విస్తరించి ఉంది. ఉత్తర పర్వతశ్రేణి వింధ్య పీఠభూమి, భాండర్ పీఠభూమి, కైమూర్ పర్వతశ్రేణి పేర్లతో సాన్ నది ఉత్తరంగా విస్తరించి ఉంది.[14] ఈ విస్తృత శ్రేణి బీహారులోని కైమూర్ జిల్లా వరకు విస్తరించి ఉంది. బుందేల్ఖండు అంతటా వింధ్యపర్వతశ్రేణి విస్తరించి ఉంది.[6] ఉత్తరంగా విస్తరించిన వింధ్యాచల్, చునార్ (మిర్జాపూర్ జిల్లా), వారణాసి సమీపంలో పలుప్రాంతాలలో విస్తరించి ఉంది.

విధ్య పీఠభూమి ఈ పర్వతశ్రేణి కేంద్రభాగానికి ఉత్తరంగా విస్తరించి ఉంది. రేవా-పన్నే పీఠమూమి కూడా సమిష్టిగా వింధ్య పీఠభూమిగా పిలువబడింది.

ఎత్తు[మార్చు]

వింధ్యపర్వతాల ఎత్తు గురించి వైవిధ్యమైన వివిధ మూలాలు ఉన్నాయి. ఎం.సి చతుర్వేది సరాసరి ఎత్తు 300 మీటర్ల ఉన్నట్లుగా పేర్కొన్నాడు.[15] ప్రదీప్ శర్మ వింధ్య "సరాసరి ఎత్తు" 350-650 ఉంటుందని సూచించాడు. 1200 కిలోమీటర్ల ప్రాంతంలో ఎత్తు 700 మీటర్లకు చేరుకుంటుందని పేర్కొన్నాడు.[14]

సముద్ర మట్టానికి 2,467 అడుగులు (752 మీ) ఎత్తులో ఉన్న సద్భావనా శిఖరం (గుడ్ విల్ పీక్) విధ్యపర్వతశ్రేణిలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావిస్తున్నారు.[16] అలాగే సింగ్రామపూర్ సమీపంలో ఉన్న కలుమార్ కలుంబె శిఖరాన్ని ఈ ప్రాంతంలోని ప్రజలు భాన్రర్ (లేక పన్నా) కొండలు అని పిలుస్తారు.[7] చారిత్రక గ్రంధాలు వింధ్యలో ఉన్నట్లు పేర్కొన్న అమరకాంతక్ (1000 మీ) శిఖరం ప్రస్తుతం సాత్పూరా పొడిగింపుగా పరిగణించబడుతుంది. ఇది మైఖేల్ శ్రేణిలో ఒక భాగంగా పరిగణిస్తారు.[17]

భీంబేట్కా వద్ద వింధ్య పర్వతాలు
భీంబేట్కా వద్ద వింధ్య పర్వతాలు

సంస్కృతి[మార్చు]

ఆర్యావత్రానికి దక్షిణ సరిహద్దుగా ఉన్న విధ్యపర్వతాల భౌగోళిక వివరణా చిత్రం

వింధ్యపర్వతశ్రేణిని ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య భారతీయసాంప్రదాయ భౌగోళిక సరిహద్దుగా భావిస్తారు.[18] భారతదేశంలోని పురాణాలలో భౌగోళికంగానూ రెండింటిలోనూ వింధ్యపర్వతాలు ప్రముఖ స్థానం కలిగి ఉంది.[1] ప్రాచీన భారతీయ గ్రంధాలలో వింధ్య ఇండో-ఆర్యన్ భూభాగాల మధ్య నిర్మించని సరిహద్దుగా పరిగణిస్తారు.[3] అత్యంత పురాతన హిందూ మతం రచనలలో ఆర్యావతానికి దక్షిణ సరిహద్దు భావిస్తారు.[1]వింధ్యపర్వతశ్రేణులలోని అరణ్యాలలో నిషాదులు, ఇతర మ్లేచ్చతెగలు వంటి ఆటవీ తెగలకు చెందిన ప్రజలు నివసించారని మహాభారతంలో పేర్కొనబడింది.[19] తరువాత మరాఠీ, కొంకణి వంటి భాషలు విస్తరించిన కాలంలో ఇండో-ఆర్యన్ భాషలు వింధ్య దక్షిణాన విస్తరించాయి. ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య సాంప్రదాయ సరిహద్దులో ఈ భాషల ఉనికిని చూడవచ్చు.[1][20]

విధ్యపర్వతాలు భారత పౌరాణిక కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. వింధ్యపర్వతాలు చాలా ఎత్తైనవి కానప్పటికీ చారిత్రాత్మకంగా దట్టమైన అరణ్యాలు, నూతనవ్యక్తుల మీద దాడిచేసి చంపే ప్రమాదకరమైన ఆటవీ తెగల ప్రజలకు అవి నివాసితప్రాంతాలుగా ఉన్న కారణంగా అవి సాధారణ ప్రజలు చేరుకోలేని ప్రమాదకరమైన ప్రదేశాలుగా ఉండేవి.[21][22] రామాయణం వంటి పాత సంస్కృత రచనలలో అవి నరమాంస భక్షకులు, రాక్షసుల స్థావరాలుగా వర్ణించబడ్డాయి.[23] తరువాత రచనలు రాక్షసులను సంహారం చేసిన శక్తి (దేవత కాళి లేదా దుర్గ)నివాసప్రాంతంగా విధ్యపర్వతప్రాంతాలను వర్ణించాయి. ఆమె వింధ్యవాసినిగా వర్ణించబడింది. విధ్యపర్వత ప్రాంతంలోని ఉజ్జయినిలో ఆమె కొరకు అంకితం చేయబడిన ఆలయం నిర్మించబడింది.[24][25] మహాభారతం వింధ్యపర్వతప్రాంతం కాళి "శాశ్వతమైన నివాసం" గా పేర్కొన్నది.[26]

ఒక పురాణంలో వింధ్య పర్వతం ఒకసారి మేరు పర్వతంతో పోటీగా సూర్యునికి ఆటంకంగా పెరుగుతున్నట్లు వర్ణించబడింది. తరువాత మునీశ్వరుడైన అగస్త్యుడు దక్షిణదేశంలో ప్రయాణించడానికి మార్గం సులభతరం చేయటానికి పెరగడం ఆపమని వింధ్యపర్వతాన్ని కోరాడు. అగస్త్యుడు పట్ల ఉన్న గౌరవం కారణంగా వింధ్య దాని ఎత్తు తగ్గించి అగస్త్యుడు ఉత్తరప్రాంతానికి తిరిగి వెళ్ళేవరకు పెరగడం ఆపివేస్తానని వాగ్దానం చేసింది. అగస్త్యుడు దక్షిణప్రాంతంలో స్థిరపడ్డారు. వింధ్య పర్వతాలు ఇచ్చినమాటను నిలుపుకుంటూ తిరిగి మరింత ఎదుగలేదు.[27]వాల్మీకి రామాయణ కిష్కిందకాండలో మయాసురుడు వింధ్యలో ఒక ఇంటిని నిర్మించినట్లు పేర్కొనబడింది.[28] దక్షకుమారచరిత్ర మగధ రాజు రాజహంస ఆయన మంత్రులు యుద్ధంలో పరాజయం పొందిన తరువాత వారి రాజ్యం నుండి బలవంతంగా పంపబడిన తరువాత వింధ్యపర్వత అడవిలో ఒక కొత్త కాలనీ సృష్టించాడని పేర్కొన్నది.

భారతదేశం జియోలాజికల్ సర్వే నుండి వింధ్యపర్వతావళి పటం (1871)

భారతదేశం జాతీయ గీతంలో పేర్కొన్న రెండు పర్వత శ్రేణులలో హిమాలయాల పర్వతాలతో వింధ్యపర్వతం కూడా చేర్చబడింది.[29]

నదులు[మార్చు]

గంగా-యమునా వ్యవస్థలోని అనేక ఉపనదులు వింధ్య నుండి ఉద్భవించి గంగానదిలో సంగమిస్తున్నాయి.[20] వీటిలో చంబల్, బెత్వా, ధాసన్, కెన్, దంసా, కాళి సింధు, ప్రభాతి నదులు ఉన్నాయి. వింధ్య ఉత్తర వాలులో ప్రవహిస్తూ ఈ నదులు ప్రజావసారాలకు తగినంత నీటిని సరఫరా చేస్తున్నాయి.

నర్మదా, సాన్ నదులు వింధ్య దక్షిణ వాలులో ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు ఇప్పుడు సాత్పూరా విస్తరణగా గుర్తించబడుతున్న మైఖల్ కొండలలో జన్మించాయని భావిస్తున్నారు. అయినప్పటికీ పాత రచనలు ఈ ప్రాంతాన్ని వింధ్యాపర్వతప్రాంతంగా పేర్కొంటున్నాయి.

భౌగోళికం[మార్చు]

" విధ్యన్ సూపర్ గ్రూఫ్ " ప్రపంచంలో అతిపెద్ద, దట్టమైన సెడిమెంటరీ సక్సెషనుగా గుర్తించబడుతుంది.[30]

విధ్యపర్వతాలలో ప్రాంరభకాలంలో కనుగొనబడిన బహుకణ శిలాజం యుకర్యోటె (ఫిలమెంటస్ ఆల్గే) 1.6 బిలియన్ సంవత్సరాల పూర్వం ఏర్పడిందని భావించబడుతుంది.[31] జీవ ఆవిర్భావంలో భాగంగా నమోదుచేయబడిన షెల్డ్ ప్రాణులు 550 మిలియన్ల సంవత్సరాల పూర్వకాలానికి చెందినవని భావిస్తున్నారు. [32]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Kalidasa, HH Wilson (1843). The Mégha dúta; or, Cloud messenger. pp. 19–20.
  2. "Sloka & Translation | Valmiki Ramayanam". www.valmiki.iitk.ac.in. Archived from the original on 2 ఏప్రిల్ 2018. Retrieved 2 April 2018.
  3. 3.0 3.1 3.2 3.3 Edward Balfour (1885). The Cyclopædia of India and of Eastern and Southern Asia, Commercial Industrial, and Scientific: Products of the Mineral, Vegetable, and Animal Kingdoms, Useful Arts and Manufactures. Bernard Quaritch. pp. 1017–1018.
  4. Prabhakar Patil (2004). Myths and Traditions in India. BPI. p. 75. ISBN 9788186982792.
  5. Anura Goonasekera; Cees J. Hamelink; Venkat Iyer, eds. (2003). Cultural Rights in a Global World. Eastern Universities Press. p. 186. ISBN 9789812102355.
  6. 6.0 6.1 6.2 PK Bhattacharya (1977). Historical Geography of Madhya Pradesh from Early Records. Motilal Banarsidass. pp. 60–69. ISBN 978-81-208-3394-4.
  7. 7.0 7.1 William Wilson Hunter (1908). Imperial Gazetteer of India. Clarendon Press. p. 316.
  8. James Outram (1853). A few brief Memoranda of some of the public services rendered by Lieut.-Colonel Outram, C. B.: Printed for private circulation. Smith Elder and Company. p. 31.
  9. Harihar Panda (2007). Professor H.C. Raychaudhuri, as a Historian. Northern Book Centre. pp. 128–130. ISBN 978-81-7211-210-3.
  10. Vasudev Vishnu Mirashi (1 January 1975). Literary and Historical Studies in Indology. Motilal Banarsidass. p. 212. ISBN 978-81-208-0417-3.
  11. Madhav Vinayak Kibe (1947). Location of Lanka. Pune: Manohar Granthamala. p. 16. OCLC 33286332.
  12. W.W. Hunter (2013). The Indian Empire: Its People, History and Products. Routledge. p. 35. ISBN 978-1-136-38301-4.
  13. VN Kulkarni. "Physical Geology of Gujarat" (PDF). Public Works Department, Government of Gujarat. Retrieved 20 June 2014.
  14. 14.0 14.1 Pradeep Sharma (2007). Human Geography: The Land. Discovery Publishing House. p. 209. ISBN 978-81-8356-290-4.
  15. Mahesh Chandra Chaturvedi (27 August 2012). Ganga-Brahmaputra-Meghna Waters: Advances in Development and Management. CRC Press. p. 19. ISBN 978-1-4398-7376-2.
  16. "Places of Interest". DIET Hatta. Archived from the original on 18 జూలై 2014. Retrieved 20 June 2014.
  17. K. Sankaran Unni (1996). Ecology of River Narmada. APH Publishing. p. 15. ISBN 978-81-7024-765-4.
  18. Noboru Karashima (2014). A Concise History of South India. Oxford University Press. p. xviii. ISBN 978-0-19-809977-2.
  19. Ved Vyasa (1886). The Mahabharata (12.58.3211). Translated by Kisari Mohan Ganguli. Bhārata Press.
  20. 20.0 20.1 M.S. Kohli (2002). Mountains of India: Tourism, Adventure and Pilgrimage. Indus Publishing. p. 32. ISBN 978-81-7387-135-1.
  21. John Avery (1880). "Influence of the Aryans upon the Aboriginal speech of India". The American Antiquarian. Jameson & Morse. 3: 122.
  22. Jürgen Neuß (2012). Narmadāparikramā – Circumambulation of the Narmadā River: On the Tradition of a Unique Hindu Pilgrimage. BRILL. p. 20. ISBN 978-90-04-22857-3.
  23. Stephen Vincent Brennan (January 2006). Classic Legendary Hero Stories: Extraordinary Tales of Honor, Courage, and Valor. Globe Pequot Press. p. 5. ISBN 978-1-59228-872-4.[permanent dead link]
  24. Cynthia Ann Humes (1998). "Vindhyavasini: Local Goddess yet Great Goddess". In John Stratton Hawley; Donna M. Wulff (eds.). Devī: Goddesses of India. Motilal Banarsidass. p. 49. ISBN 978-81-208-1491-2.
  25. Vanamali (21 July 2008). Shakti: Realm of the Divine Mother. Inner Traditions / Bear & Co. p. 166. ISBN 978-1-59477-785-1.
  26. Ved Vyasa (1886). The Mahabharata (4.6.232). Translated by Kisari Mohan Ganguli. Bhārata Press.
  27. Roshen Dalal (2014). The Religions of India: A Concise Guide to Nine Major Faiths. Penguin Books Limited. p. 124. ISBN 978-81-8475-396-7.
  28. Swami Parmeshwaranand (2001). Encyclopaedic Dictionary of Puranas. Sarup & Sons. p. 871. ISBN 978-81-7625-226-3.
  29. Edgar Thorpe; Showick Thorpe (2008). Pearson General Knowledge Manual 2009. Pearson Education India. pp. 323–326. ISBN 978-81-317-2300-5.
  30. Jyotiranjan S Ray (February 2006). "Age of the Vindhyan Supergroup: A review of recent findings" (PDF). Journal of Earth System Science. 115 (1): 149–160. doi:10.1007/BF02703031.
  31. Bengtson, S.; Belivanova, V.; Rasmussen, B.; Whitehouse, M. (May 2009). "The controversial "Cambrian" fossils of the Vindhyan are real but more than a billion years older" (PDF). Proceedings of the National Academy of Sciences of the United States of America. 106 (19): 7729–7734. Bibcode:2009PNAS..106.7729B. doi:10.1073/pnas.0812460106. ISSN 0027-8424. PMC 2683128. PMID 19416859.[permanent dead link]
  32. Rex Dalton & Killugudi Jayaraman (22 April 2009). "Indian fossil find resolves fraud accusations". Nature. doi:10.1038/news.2009.383.

బయటి లింకులు[మార్చు]

24°37′N 82°00′E / 24.617°N 82.000°E / 24.617; 82.000