వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 19వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత సైనిక దళం ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహుద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. భారత దేశంలో స్వచ్ఛదంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో, ముఖ్యముగా శాంతి పరిరక్షణలో భారతీయ సైనికదళం పాలు పంచుకొంది.

1948లో జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో భారతసైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని కాశ్మీర్‌నుండి వెళ్ళగొట్టడం మొదటియుద్ధం. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడింది. హైదరాబాద్ విమోచనం, గోవా-డామన్-డయ్యు ఆపరేషన్ భారతీయ సైన్యం అంతర్గతంగా సాగించిన రెండు మిలిటరీ ఆపురేషన్లు.

1965లో చైనాతో జరిగిన యుద్దంలో ఓడిపోయిన భారత్ మరో యుద్దానికి సిద్దం కాలేదు కాని అనతి కాలంలోనే కాశ్మీర్ ప్రజలు పాకిస్తానుకు మద్దతు ఇస్తారు అన్న అపోహలతో 1965లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన సైన్యాన్ని పంపి కాశ్మీర్‌‌లో యుద్ధానికి కారకుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యుద్ధంలోనే అత్యధికంగా యుద్ద ట్యాంకులను ఉపయోగించారు.

1971లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లో జరిగిన తిరుగుబాటుతో దాదాపు కోటి మంది శరణార్థులు భారతదేశాని రావడంతో భారత్-పాక్ యుద్దం మొదలయింది. తూర్పు పాకిస్తాన్‌కు పశ్చిమ పాకిస్తాన్ నుండి విమోచన కల్పించడం భారత్‌కు అన్ని విధాలా శ్రేయస్కరమయింది. 1999లో పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపి తీవ్రవాదులతో కలసి కార్గిల్ ప్రాంతాలు ఆక్రమించుకుంది. భారతీయ సైన్యం అనేక కీలక పర్వతాలలో, చెక్ పోస్టుల వద్ద ఉన్న తీవ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని రెండు నెలల్లో అన్నింటినీ స్వాధీనం చేసుకుంది.

డివిజన్, బ్రిగేడ్, బెటాలియన్, కంపెనీ, ప్లటూన్, సెక్షన్ అనేవి కొన్ని సైనిక విభాగాలు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సైన్యం - 13,00,000; రిజర్వ్ సైన్యం - 12,00,000; సైన్యం వనరులలో ప్రధాన యుద్ద ట్యాంకులు - 5000+; ఫిరంగులు - 12,800; బాల్లిస్టిక్ మిస్సైళ్ళు - 100; ఎయిర్ మిస్సైళ్ళు - 90,000; యుద్ద విమానాలు/వాహకాలు - 1130 ఉన్నాయి.....పూర్తి వ్యాసం: పాతవి