విక్రమశిల సేతు
విక్రమశిల సేతు | |
---|---|
![]() విక్రమశిల సేతు | |
Coordinates | 25°16′41″N 87°01′37″E / 25.278°N 87.027°E |
OS grid reference | [1] |
Crosses | గంగా నది భాగల్పూర్ |
Locale | భారతదేశం బీహార్ భాగల్పూర్ |
Maintained by | బీహార్ ప్రభుత్వం |
Characteristics | |
Material | ఉక్కు |
Total length | 4,700 metres (15,400 ft) |
History | |
Construction end | 2001 |
Opened | 2001 |
Statistics | |
Toll | నాలుగు చక్రాల వాహనాలు |
Location | |
![]() |
విక్రమశిల సేతు భారతదేశంలోని బీహార్ లో భాగల్పూర్ సమీపంలో గంగా నది పై నిర్మించిన వంతెన. దీనిని పేరు విక్రమశిల సేతు అని పురాతన మహావిహరా పేరు పెట్టారు. ఈ విహారాన్ని రాజు ధర్మపాలుడు (783 నుండి 820 AD) స్థాపించాడు.
చరిత్ర[మార్చు]
విక్రమశిల సేతు భారతదేశంలో నీటిపై అతి పొడవైన వంతెన. 4.7 కిలోమీటర్ల పొడవు ఉన్న రెండు లైన్ల వంతెన ఇది. ఇది గంగకు ఇరువైపుల ఉన్న NH 80, NH 31 జాతీయ రహదారులను కలుపుతుంది. నదికి దక్షిణపు ఒడ్దున ఉన్న భాగల్పూర్ లోని బరారీ ఘాట్ నుండి ఉత్తరాన ఉన్న నౌగాచాయా వరకు ఈ వంతెనను నిర్మించారు. ఇది భాగల్పూర్ పట్టణాన్ని పూర్ణియా, కతిహార్లతో కలుపుతుంది. ఈ వంతెన నిర్మాణంతో భాగల్పూర్ నుండి గంగకు ఆవల ఉన్న అనేక ప్రదేశాల మధ్య రోడ్డు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది.
ట్రాఫిక్ సమస్యలు[మార్చు]
పెరిగిన ట్రాఫిక్ కారణంగా వంతెనపై తీవ్రమైన ట్రాఫిక్ పెరిగింది ఎప్పుడు రద్దీగా ఉంటుంది. దానికి మరొక వంతెన సమాంతరంగా నిర్మించాలని డిమాండ్ వచ్చింది. 24 కిలోమీటర్ల పొడవున విక్రమశిల-కాటరియా రైలు-కమ్-రహదారి వంతెనను, 4,379.01 కోట్ల వ్యయంతో నిర్మించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.
మూలాలు[మార్చు]
- "CM for a bridge parallel to Vikramshila Setu". The Times of India. 6 March 2016.'
- "'Bridge parallel to Rajendra Setu to be ready in 3 years'". The Times of India. 12 June 2018.