విద్యా హక్కు చట్టం - 2009
| విద్యా హక్కు చట్టం, 2009 | |
|---|---|
| భారత పార్లమెంటు | |
| |
| Citation | Act No. 35 of 2009 |
| Enacted by | భారత పార్లమెంటు |
| Assented to | 26 ఆగస్టు 2009 |
| Commenced | 1 ఏప్రిల్ 2010 |
| Related legislation | |
| భారత రాజ్యాంగం 86వ సవరణ (2002) | |
| Status: Unknown | |
ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం -2009 (RTE-2009) అనేది 4 ఆగస్టు 2009న రూపొందించబడిన భారత పార్లమెంటు చట్టం, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A లో ఉంది. భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ఈ చట్టం 1 ఏప్రిల్ 2010న అమల్లోకి వచ్చినప్పటి నుండి విద్యను ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కుగా అందించే 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.[1]
అధికారం
[మార్చు]భారత రాజ్యాంగంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రం, రాష్ట్రాలు రెండూ ఈ చట్టంలో సవరణలు చేయవచ్చు. చట్టం అమలు కోసం కేంద్రం, రాష్ట్ర, స్థానిక సంస్థలకు నిర్దిష్ట బాధ్యతలను నిర్దేశిస్తుంది.
ఆమోదం
[మార్చు]ఈ బిల్లును 2 జూలై 2009న మంత్రివర్గం ఆమోదించింది. రాజ్యసభ 20 జూలై 2009న బిల్లును ఆమోదించింది. లోక్సభ 4 ఆగస్టు 2009న ఆమోదించింది. 26 ఆగస్ట్ 2009న రాష్ట్రపతి ఆమోదం పొంది, చట్టంగా నోటిఫై చేయబడింది.[2]
అమలు
[మార్చు]ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాలు విద్యలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Provisions of the Constitution of India having a bearing on Education". Department of Higher Education. Archived from the original on 1 February 2010. Retrieved 1 April 2010.
- ↑ "Right to Education". LawJi.in : one-stop destination for all law students. Archived from the original on 2018-09-27. Retrieved 2018-09-26.