విరాట్ రామాయణ్ మందిరము
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
| విరాట్ రామాయణ్ మందిరము | |
|---|---|
| దస్త్రం:ViraatRamayanMandir.jpg విరాట్ రామాయణ్ మందిరము నిర్మాణ పటము | |
| మతం | |
| అనుబంధం | Hinduism |
| జిల్లా | తూర్పు చంపారన్ |
| స్థానం | |
| ప్రదేశం | కేసరియా |
| దేశం | భారతదేశము |
![]() Interactive map of విరాట్ రామాయణ్ మందిరము | |
| నిర్మాణ శైలి | |
| సృష్టికర్త | మహావీర్ మందిర్ ట్రస్ట్, పాట్నా |
| Website | |
| official page | |
విరాట్ రామాయణ్ మందిరము ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయము. దీని దేవాలయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2013 నవంబరు 13 బుధవారం ఆవిష్కరించారు. సుమారు 20 వేల మంది కూర్చునే సామర్ధ్యముతో త్వరలో నిర్మించబోయే ఈ దేవాలయం ఎత్తు 405 అడుగులు ఎత్తు ఉంటుంది . ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సమక్షంలో విరాట్ రామాయణ్ మందిర్ కు శంకుస్థాపన చేశారు.
నిర్మాణము
[మార్చు]అత్యంత సంపన్న ట్రస్ట్ గా పేరొందిన మహావీర్ మందిర్ ట్రస్ ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టింది. 500 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ దేవాలయాన్ని పాట్నాకు 125 కిలో మీటర్ల దూరంలోని దక్షిణ చంపారన్ జిల్లాలోని కెసారియా సమీపంలోని జంకి నగర్ లో నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి మహావీర్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంబోడియాలోని 12వ శతాబ్దంలో నిర్మించిన ఆంగ్కోర్ వాట్ఆలయము (215 అడుగులు) కు రెండింతలు పెద్దదిగా ఉంటుంది.ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 18 దేవాలయాలు ఉంటాయి. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే శివాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని నిర్మించబోతున్నారు.
