విష్ణు దిగంబర్ పలుస్కర్
విష్ణు దిగంబర్ పలుస్కర్ | |
|---|---|
![]() | |
| Background information | |
| Born | 1872 ఆగస్టు 18 కురుంద్వాడ్ |
| Origin | కురుంద్వాడ్, బాంబే ప్రెసిడెన్సీ, భారతదేశం |
| Died | 1931 ఆగస్టు 21 (వయసు: 59) |
| Genres | హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం |
| Occupation | గాయకుడు |
| Years active | 1890–1931 |
పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ (1872 ఆగస్టు 18 - 1931 ఆగస్టు 21) ఒక హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. ఇతను రఘుపతి రాఘవ రాజారామ్ భజన యొక్క అసలు వెర్షన్ పాడారు, 1901 లో "గంధర్వ మహావిద్యాలయ"ను స్థాపించారు. వాస్తవంగా ఇతని ఇంటిపేరు గాడ్గిల్, కాని వారు సాంగ్లి సమీపంలో ఉన్న పలూస్ గ్రామానికి చెందిన వారు కావడంతో "పలుస్కర్" కుటుంబానికి చెందిన వారిగా బాగా గుర్తింపు పొందారు.
బాల్య జీవితం, నేపథ్యం
[మార్చు]విష్ణు దిగంబర్ పలుస్కర్ "కురుంద్వాడ్" యొక్క మరాఠీ కుటుంబంలో జన్మించాడు, ఇది బాంబే ప్రెసిడెన్సీ బ్రిటిష్ పాలన సమయంలో, డెక్కన్ డివిజన్ కింద ఉన్న ఒక చిన్న పట్టణం, ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. ఇతని తండ్రి దిగంబర్ గోపాల్ పలుస్కర్ ఒక కీర్తన గాయకుడు. ఇతను ప్రాథమిక విద్య కోసం కురుంద్వాడ్ లోని ఒక స్థానిక పాఠశాలకు వెళ్లాడు. కానీ పలుస్కర్ చిన్న వయసులోనే ఒక విషాదానికి గురైనాడు.
ఒకరోజు దత్తజయంతి పండుగ సందర్భంగా టపాసులు కాల్చుతుంటే ఒక టపాసు అతని ముఖానికి దగ్గరగా పేలడంతో అతని రెండు కళ్లు దెబ్బతిన్నాయి. వీరు ఉంటున్నది చిన్న పట్టణం కావడంతో అక్కడ అందుబాటులో ఎటువంటి తక్షణ చికిత్స సదుపాయాలు లేకపోవడంతో పలుస్కర్ తన కంటి చూపు కోల్పోయారు. అయితే, అతను కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి చూపును పొందాడు[1].
మిరాజ్ యొక్క రాజు ఈ బాలుడి ప్రతిభను గుర్తించి బాలకృష్ణబువ ఇచల్కరంజికర్ అనే సంగీతకారుడి ఆధ్వర్యంలో సంగీకారునిగా మలచేందుకు ఇతనిని ఉంచాడు. పలుస్కర్ 1896 వరకు 12 సంవత్సరాల పాటు అతని వద్ద శిక్షణ తీసుకున్నాడు, అంతవరకు వీరిద్దరి మధ్య గురుశిష్యుల సంబంధముండేది, తరువాత విడిపోయారు.
మూలాలు
[మార్చు]- ↑ Deva, B. Chaitanya. "An Introduction to Indian Music". Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2006-05-10.
యివి చదవండి
[మార్చు]- Deva, B. Chaitanya (1981). An Introduction to Indian Music. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India.
- Athavale, V.R. (1967). Pandit Vishnu Digambar Paluskar. National Book Trust.
ఇతను సుప్రసిద్ధ గాయకుడు,దేశ భక్తుడు కాబట్టి అప్పటి కాంగ్రెస్ లో చేరి దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసేవారు.కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ప్రార్థన గీతంగా 1915 నుండి ప్రతి ఏటా వందేమాతరం ను పాడే ఆచారం అయిన ప్రవేశపెట్టారు.ఇలానే 1923 సం. లో కాకినాడ లో కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి.సమావేశానికి మౌలానా మహమ్మద్ అలీ అధ్యక్షులు గా ఉన్నారు.ప్రతి ఏటా ఆచారం ప్రకారం విష్ణు దిగంబర వందేమాతరం పడేందుకు వచ్చి నిల్చున్నారు.మూలాన అభ్యంతరం తెలిపారు.తమ మత ఆచారం ప్రకారం పాటలు పాడడం నిషిద్ధం అని చెప్పారు.అక్కడే గాంధీజీ కూడా ఉన్నారు.ఇతర నాయకులు కూడా ఉన్నారు.కానీ ఎవరు మౌలానా మాటకు విబేధించ లేదు.కానీ విష్ణుడిగాంబర్ దీనిని సహించలేక పోయారు.అతను గట్టిగా వాదించాడు.ఇది ఒక జాతీయ వేదిక, మస్జిద్ కాదు.సంగీతం పై అభ్యంతరం తెలిపేందుకు వీలులేదు.అధ్యక్షులు వారు ఇంకా ఏదో చెప్పబోయేలోపు ఆయన వందేమాతరం గీతం ఆలపించసాగారు.అధ్యక్ష స్థానం లో మహమ్మదలి తన ఆసనం నుండి లేచి బయటకు వెళిపోయాడు.విష్ణుడిగాంబర్ పాలుస్కర్ వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించారు.ఇలా దేశాభిమానాన్ని,మాతృభూమి పట్ల తనకున్న భక్తిభావన ఇలా నిరూపించాడు.దేశ ప్రజలకు ప్రీతిపాత్రుడు అయినారు.
