Coordinates: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695

వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం
వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం is located in Andhra Pradesh
వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం
వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:అంబాజీపేట పుల్లేటికుర్రు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం తూర్పు గోదావరి జిల్లాలోని, అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రు గ్రామంలో దేవాలయం ఉంది.

స్ధల పురాణం[మార్చు]

పూర్వం అభయారణ్య ప్రాతం అయిన ఈ ప్రాతంలో ఒక బ్రాహ్మణుడు నిత్యం పరమశివుని అత్యంత భక్తి శ్రధ్దలతో పూజిస్తుండేవాడు.ఒకరోజున ఆ బ్రాహ్మణున్ని అరణ్యంలో ఒక పులి (వ్యాఘ్రం) తరమసాగింది.భయపడి ఆ బ్రాహ్మణుడు దిక్కు తోచని స్థితిలో తను రోజూ అర్చించే ఆ పరమశివున్ని నమ్ముకుని ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడే ఉన్న ఒక బిల్వ వృక్షం (మారేడు చెట్టు) ఎక్కాడు.పులి మారేడు చెట్టు క్రింద ఆ బ్రాహ్మణుని కొరకు కాచుకుని కుర్చుంది. దీంతో ఏమి చెయ్యాలో తోచక ఆ మారేడు చెట్టు యొక్క ఆకులు ఒక్కటొక్కటీ తెంపి పరమశివుని స్మరిస్తూ ఆ పులిపై వేయసాగాడు. కొంతసేపటికి ఆ మారేడు ఆకులతో ఆ పులి కప్పబడి కదలకుండా అలానే ఉంది.దీంతో ఆ పులి నిద్రిస్తుందేమో అని ఆ బ్రాహ్మణుడు భావించి మెల్లిగా చెట్టు నుండి క్రిందికి దిగి అగ్రహారం లోకి వెళ్ళి తన తోటి వారికి ఈ విషయం చెప్పి పులిని చంపడానికి కర్రలు, బరిసెలతో అక్కడికి వచ్చాడు.అయితే ఎంతకీ పులి ఆ మారేడు ఆకులనుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్కడి వారు ఆ అకులను తొలగించి చూడగా ఆ అకుల క్రింద శివలింగం కనిపించెను. పులి శివలింగముగా మారిన ప్రాంతాన్ని వ్యాఘ్రేశ్వరము అని అక్కడ స్వయంభూగా వెలసిన ఆ శివుని వ్యాఘ్రేశ్వరుడు అనే పేరు వచ్చింది. పులి వేటాడిన ఊరు కనుక ఆ ఊరుకు పులి వేట ఊరు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే పుల్లేటికుర్రుగా రూపాతరం చెందింది.[1]

మదనగోపాలస్వామి దేవాలయం[మార్చు]

శ్రీ వ్యాఘ్రేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే వున్న మరో ఆలయంలో మదనగోపాలస్వామి ఉంది.నాలుగు వందల ఏళ్ళక్రితం ప్రతిష్ఠించబడిన శ్రీ మదనగోపాలస్వామి ఈ నాటికీ భక్తుల్ని అలరించడం విశేషం.స్వామి వారి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వరుడు బాలాత్రిపురసుందరి కొలువై భక్తులకు దర్శనం ఇస్తారు.

ఉత్సవాలు[మార్చు]

ప్రతి సంవత్సరం మహాశివరాత్రిన, దేవీనవరాత్రులు వైభవంగా జరుగుతాయి.

మూలాలు[మార్చు]

  1. ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.