శ్రీచక్ర మహా మేరు యంత్రాలయం, ఏనుగుల మహల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీచక్ర మహా మేరు యంత్రాలయం తూర్పు గోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రం. దీనిని స్థానికులు ఏనుగుమహల్ గుడి అని కూడా పిలుస్తారు . ఇక్కడ "లలితా మహా త్రిపుర సుందరి " అమ్మ వారు యంత్ర స్వరూపిణిగా భక్తులకు అభయమిస్తున్నారు. ఈ క్షేత్రం తెలుగు రాష్ట్రాలలో ఏకైక మేరు శ్రీ చక్ర ఆలయం. 1983 లో ఆధ్యాత్మిక శాత్రవేత్త పద్మశ్రీ గ్రహీత శ్రీ ప్రణవానంద తన తపశ్శక్తి ని ధారబోసి శ్రీ చక్రం ప్రతిష్టించారు . శ్రీ చక్ర లఘు పూజా విధానం , నవారణ పూజా విధానం , శ్రీ చక్రం పై 400 పేజీల సమగ్ర గ్రంధాన్ని శ్రీ ప్రణవానంద స్వామిజి రచించారు.[1][2] ఈ దేవాలయం తూర్పు గోదావరి జిల్లా , కొత్తపేట మండలం , రావులపాలెం నుండి 8 కి.మీ దూరంలో , మందపల్లి గ్రామ సమీపాన ఆలయం కొలువు అయివుంది .

ఆలయ పూజా విధానం[మార్చు]

సాధారణంగా 16 ఉపచారాలు చేస్తారు కానీ ఇక్కడ 64 ఉపచారాలు చేయడం ప్రత్యేకత . దసరా ఉత్సవాలు ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతాయి . దసరా ఉత్సవాలు లో భాగంగా నిత్యం నవావరణ అర్చన , పంచామృత అభిషేకం , లలిత సహస్రనామ కుంకుమార్చన , నిత్యం భాగవత , సుందరకాండ పారాయణం జరుగుతాయి .

మూలాలు[మార్చు]

  1. ఈ టీవీ న్యూస్ ఇన్ యూట్యూబ్. "Meru Sri Chakra Yantralayam @ Yenugula Mahal". Retrieved 27 June 2021.
  2. "రాష్ట్రంలోని ఏకైక మేరు శ్రీచక్ర ఆలయం విశిష్టత తెలుసా?". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2021-06-27.