శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 1901లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1932లో ఎం.ఎ., 1936లో డాక్టరేట్ ఇన్ సైన్స్ చదివాడు. లండన్‌లో పి.హెచ్.డి. చేశాడు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిజిక్సులో లెక్చరర్‌గా ఒక దశాబ్దం పనిచేశాడు. తరువాత బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశాడు. పరిశోధనా తత్వంగల శ్రీపాద, వరంగల్లు ప్రాంతంలో దేవాలయాలు పరిశీలించాడు. బౌద్ధ ఆరామాలను హిందూ దేవాలయాలుగా మారిన తీరుపై వ్రాశాడు. తిరుపతిలో వెంకటేశ్వర విగ్రహం స్త్రీ రూపంలో వుంటుందన్నాడు. ఈయన రచనలు రాష్ట్ర ఆర్కియిలాజికల్ శాఖ ప్రచురించింది. గోపాలకృష్ణమూర్తి కవితా ధోరణులపై పత్రికలో వ్రాశాడు. ఆయన ప్రవేశించని రంగం అంటూ లేదు. కళలు, శిల్పం, దేవాలయాలు, కవిత్వం, సైన్స్ వుండేవి. వినువీధుల శీర్షికన సైన్స్ ఎంతో చక్కగా అందరికీ అర్థం అయ్యే శైలిలో వివరించాడు. ఈయన జిల్లెళ్ళమూడి అమ్మ బోధనలకు ప్రభావితుడై భక్తుడిగా మారాడు[1]. ఈయన 1977లో రాజమండ్రిలో తనువు చాలించాడు.

రచనలు[మార్చు]

  1. లేపాక్షి కళామండపం
  2. స్వర కల్పన
  3. కవితా పరిశీలనం
  4. దేశి సారస్వతం
  5. తెలుగు ఏకాంకిక నాటక పరిచయము[2]
  6. అర్థ శతాబ్దపు ఆంధ్ర కవిత్వము
  7. దాక్షిణాత్య శిల్పం
  8. విజ్ఞాన సాధన
  9. విజ్ఞాన వీధులు (సైన్స్)
  10. మనభూమి - ఆకాశము
  11. ఇంటింటా విజ్ఞాన సర్వస్వము
  12. రాకెట్లు - ఆకాశయానము
  13. వైజ్ఞానిక గాథాశతి
  14. ఆంధ్రశిల్పము
  15. స్త్రీల పాటలు (సేకరణ)
  16. అక్షర తుణీరం
  17. అమ్మ - అమ్మవాక్యాలు
  18. అమ్మతో జరిపిన సంభాషణలు
  19. English – Telugu Dictionary of Scientific terminology

కలంపేరు[మార్చు]

  • కృష్ణశ్రీ

మూలాలు[మార్చు]