షీలా మెహ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షీలా మెహ్రా
జననంభారతదేశం
వృత్తిగైనకాలజిస్ట్
ప్రసూతి వైద్యుడు
పురస్కారాలుపద్మశ్రీ
రాధా రామన్ పురస్కారం
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జీవిత కాల సాఫల్య పురస్కారం

షీలా మెహ్రా భారతీయ స్త్రీ జననేంద్రియ వైద్యురాలు, ప్రసూతి వైద్యురాలు. ఆమె న్యూ ఢిల్లీ మూల్ చంద్ ఆసుపత్రిలో స్త్రీ జననేంద్రియ, ప్రసూతి శాస్త్ర విభాగం డైరెక్టర్ గా ఉన్నారు.[1][2] లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ నుండి 1959లో పట్టభద్రురాలైన ఆమె, యునైటెడ్ కింగ్‌డం లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ నుండి DRCOG, MRCOG డిగ్రీలను పొందారు.[1] ఆమె ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఒబెస్ట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ICOG) లో ఫెలోషిప్, రాధా రామన్ అవార్డు (1998), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు (2006) వంటి పురస్కారాలను అందుకున్నారు.[3][1] భారత ప్రభుత్వం 1991లో ఆమెకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Dr. Sheila Mehra". Ziffi. 2015. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 7 October 2015.
  2. "Moolchand profile". Moolchand Healthcare. 2015. Retrieved 7 October 2015.
  3. "Health Tourism profile". Health Tourism. 2015. Retrieved 7 October 2015.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబర్ 2015. Retrieved 21 July 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)