Jump to content

సాతాని

విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి

చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు

[మార్చు]

ప్రపంచంలో ప్రతి జాతి ఉనికికి ప్రదాన కారణం కాలపరీక్ష కు నిలబడటమే.సాత్వతమ్ సొంతమైన చాత్తదశ్రీవైష్ణవబ్రాహ్మణజాతి కొన్నిశతబ్దాలుగా ఉనికిచాటుతునేఉంది. సాత్వతులు శతతులు, శాత్తదులు ,చాత్తదులుగా పరమాణక్రమంచేంది కాలపరీక్ష కు నిలబడింది.చాత్తదశ్రీవైష్ణవబ్రాహ్మణజాతిచరిత్ర  ప్రతి సంప్రదాయ చాత్తద శ్రీవైష్ణవ బ్రాహ్మణ ఇంట్లో కొన్ని వందల ఏళ్ళుగా పిడిలుగా వంశానుగతంగా వారి నేళమాళిగలో ఇప్పటికి పూజలు అందుకుంటున్న పెరుమాండ్ల విగ్రహాలలో దాగిఉంది. వారి తాతముత్తాలు ఆచరించిన సత్ శ్రీవైష్ణవ ఆచారసంప్రదాయల్లో నెలకొంది.కొన్ని యుగాలలో విలసిల్లిన  మన చరిత్ర వైభవం ఎవరో ఓక విదేశీ రీసర్చ్ చేసె వ్యక్తి మనకులంమీద పరిశోదన చేసి చేప్పిందే మన చరిత్ర  కాదని తెలుసుకోవాలి.ఆయన పరిశోధన చేసిన సమయంలో మనవారి జీవన నేపథ్యంగానే బావించాలి. శ్రీ వైష్ణవ బ్రాహ్మణ జాతి చరిత్ర ను పరిశీలిస్తే భగవత్ శ్రీ రామనుజునికి ముందు ఆ తర్వతగా చెప్పుకోవాలి. భగవత్ రామనుజునికి ముందుకంటే మనమ్ సాత్వత లుగా పాంచారాత్రఆగమాన్నిఅనుసరిస్తు విష్ణువర్చన చేస్తున్నామ్.ధన్వంతరి వైద్యం ఉప విధిగా నిర్వహిస్తు జీవనం వేళ్ళదిస్తున్నారు .

సాత్వతం ఫౌష్కరం చైవ జయఖ్యం తంత్రముత్తమ్

రత్నత్రయ మితిఖ్యాదం తద్విశేష ఇహాచ్చతే.

సాత్వత, ఫౌష్కర,జయాఖ్య సంహితలు రత్నత్రయమని ప్రసిద్ధి పోందినవి ఈ పంచరాత్రమును అనుసరించేవారి పాంచరాత్రులు గా పిలుస్తున్నారు.

పాంచరాత్రప్రవక్తారం వన్దే నారయణప్రభుమ్

పరశరం చ మైత్రేఘాం బారధ్వాజం కపింజలమ్

వసిష్టాదిమునిమ్ వన్దే పాంచరాత్ర ప్రవక్తాన్

అనాది వైష్ణవొ విష్ట ఆది పాంచరాత్రకః

పాంచరాత్రులోశుక్లయజుశ్యాకులు ,కృష్ణయజుశ్యాకులున్నారు. క్యాతయన ,అపస్తంభ ,సూత్రికులతోపాటు భోదాయన సూత్రికులు కూడాఉన్నారు.వడగలై తేంగలై తేగలవారు ఉన్నారు.అయితే వీరు శాఖభేదాలు పెద్దగా పాటించరు.భగవదారాధనమే మెక్షసాదనమని బలంగా విశ్వసిస్తారు.పాంచరాత్రులు 108సంహితలను అనుసరిస్తున్నారు.ఆనాదియిన సాత్వతసంహితను (చాత్తదశ్రీవైష్ణవలు) సాత్వతులుపాటిస్తున్నారు.శ్రీవైష్ణవజాతినిఉజ్జీపజేయడంతోపాటు నాథముని,యామునాచార్యుల గురుపరంపర ను కోనసాగించాటానికి ఈ భూ లోకంలోని శ్రీపేరంబుదురులో భగవత్ శ్రీరామనుజుడు జన్మించారు.ఆయన మన సాత్వత జాతియుడే. అందుకు మనమెంతో గర్వించాలి.భగవత్ రామనుజుని రాక అనంతరం శ్రీవైష్ణవ  మతధర్మం సబ్బండ వర్గాలకు చేరువైంది.అప్పటి వరకు శ్రీవైష్ణవమతం ఒక తాటిపై నడిచింది. తరువాత కాలంలో సుమారు 11శతాబ్దంలో శ్రీవైష్ణవ జాతి రెండు గా విడిపొయింది. 1300 మంది శాత్తద శ్రీవైష్ణవులు, 1200మంది శాత్తిని శ్రీవైష్ణవులుగా విడిపోయినట్లు "కోయిల్ ఓలుగు' అనే శ్రీరంగశాసనం తేలియజేస్తుంది.రెండు వర్గాలు భరతఖండంలోని ఉత్తరదిశకు బయలుతేరుతూ నరులకు నారాయణ మంత్ర మహాత్యాన్ని వివరించారు. ఆది వైష్ణవులైన శాత్తదులైతే తమ వైవిధ్యమైన  ప్రక్రియల తో శ్రీవైష్ణవ మతవ్యాప్తిగావించారు. శాత్తద శ్రీవైష్ణవ బ్రహ్మణ కులమూలవృత్తియిన అర్చకత్వంతోపాటు ఉపవృత్తి అయిన విద్యా ,వైద్యం ఆధారం చేసుకోని ముందు కు సాగారు.శైవమతాన్ని తమ ప్రాణంగా ఆచరించే అప్పటి రాజులు వైష్ణవ మతాన్ని త్రీవంగా వ్యతిరేఖిస్తు మన జాతిని అణగదొగ్కారు.ముఖ్యంగా కుళాతచోళుడు అనే చోళచాణ్యీకులరాజు వైష్ణవ ద్వేషిగా పేరు గడించారు.అలాంటి రాజులకాలంలో సైతం మన శాత్తద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు పెరమాండ్లపై తమ అపారభక్తిపారవశ్యంతో తమప్రాణాలకు తేగించి మతవ్యాప్తిని గావించారు. తమ శరీరధర్మమైన బ్రాహ్మణ్యంకంటె ఆత్మ ధర్మమైన శ్రీవైష్ణవ మతాన్ని ఉజ్జీపజేయాటానికి బయలుదేరిన మనవాళ్ళు ఉత్తరమున మహంతులుగా కన్నడదేశమున అయ్యంగార్లుగా ద్రావిడ దేశమున అయ్యర్ గా ఆంద్రా తెలంగాణ దేశమున అయ్యగార్లు గా ప్రసిద్దిపోందారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మతవ్యాప్తికి తమను అనుకులంగామలుచుకున్నారు.  మనిషి జననం నుండి అంత్యేష్టి వరకు పూజాదికార్యక్రమాలు  నిర్వహించారు. నారయణ మంత్రం ప్రతి ఒక్కరిచే పలకించటం కోసం ఏ వృత్తినైన తమ ప్రవృత్తిగా మార్చుకున్నారు. ప్రపంచంలో కరుడు గట్టిన శ్రీవైష్ణవులు ఎవరైన ఉన్నారంటే

చాత్తాద శ్రీవైష్ణబ్రహ్మణులే.సమాజంలో కఠర్పంక్తి శ్రీ వైష్ణవులు గా పేరుపోందారు

తెలంగాణలోని కొండగట్టు దేవాలయంలో అర్చకులుగా చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు పనిచేస్తున్నారు [1]

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని గూడెం గుట్ట దేవస్థానంలో చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అర్చకులుగా పనిచేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్లోని పెంచలకోనలో లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నారు

తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతంలోని మన్యంకొండలో చాత్తాద శ్రీవైష్ణవబ్రాహ్మణులు అర్చకులుగా ఉన్నారు

మహబూబ్ నగర్లోని చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులుగా చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు పనిచేస్తున్నారు [2]

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 200 సంవత్సరాల కు పైగా శ్రీవైష్ణవులు నిర్వహించినటువంటి చరిత్రను మనం చూడవచ్చును అందులో చాత్తా శ్రీవైష్ణవ బ్రాహ్మణ తెలుగు చెందినటువంటి కందడై వంశస్తుడైన రామానుజ అయ్యంగార్ యొక్క విశిష్టత ఎంత గొప్పది

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 25 వేల దేవాలయాలు చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అర్చకులుగా పనిచేస్తూనే ఉన్నవి అలాగే వీరు వైష్ణవ సమాజంలో పురోహిత వర్గంగా కూడా ప్రసిద్ధి చెందారు కొన్ని వేల మంది పురోహితులు చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులుగా ఉన్నారు.

చాత్తాద శ్రీవైష్ణవ పద ఉత్పత్తి

[మార్చు]

శతదామాన్= శ్రీ మహా విష్ణువు ,

శ్రీ మహా విష్ణువుయొక్క గర్భం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుని శతనన్ద  అని అంటారు బ్రహ్మను అదిగా చేసుకొని ఆ సంప్రదాయాన్ని కొనసాగించిన కారణంగా వీరిని శాత్తాద అంటారు  కాబట్టి బ్రాహ్మీ సంభూతమైనటువంటి శక్తిని కలిగి విష్ణువును ఆరాధించే వంటివారు అని అర్థం బ్రహ్మ నిత్యమూ భగవానుడైన శ్రీమహావిష్ణువు ఎట్లా ఆరాధిస్తూ ఉంటాడో అట్లా చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు ఏప్పుడు శ్రీ మహా విష్ణువును ఆరాధించే స్థితిని కలిగి ఉంటారు శ్రీ పాద్మసంహిత, జయాఖ్య సంహిత, పురుషోత్తమ సంహిత, సాత్వత సంహిత, శ్రీ ప్రశ్న సంహిత, లాంటి 108 సంహితలను ఆధారంగా చేసుకొని. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరణ చేస్తూ, ప్రతి నిత్యం భగవంతుని కైంకర్యాన్ని చేస్తూ, ప్రతి పనిని భగవంతునికి అర్పిస్తూ,వారి జీవితాన్ని కొనసాగించే వారు చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు బ్రహ్మ ముఖము ద్వారా వెలువడిన ఆగమాలను నారద మహాముని విని ఐదు రాత్రుల్లో వినటం వల్ల అది పాంచరాత్ర ఆగమ అయింది ఆ పాంచరాత్ర ఆగమాన్ని శాండిల్య, ఔపగాయన,మౌంజాయన,కౌశిక ,భారద్వాజుడు వారి పరంపరలో  108 సంహితలుగా దాన్నిఅందించారు, ఈ ఆగమాలను ప్రామాణికంగా చేసుకొని  చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు,నిత్య నైమిత్తిక కర్మలను అలాగే ఆలయ పరంపరాఖ్యమైన కర్మలను ఆచరణ చేస్తూ వారి జీవితాన్ని భగవంతుడికి అర్పించి ఆరాధించి ఒక అద్భుతమైన మానవతావాద బ్రాహ్మణం చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు

                       భగవంతుని సాత్వతాంపతి అని అంటూ ఉంటారు సాత్వతులు అంటే భగవంతుడికి అంత ప్రీతి, సాత్వతులు అంటే ఎవరో కాదు సాత్వత సంహితనూ ఆధారం చేసుకొని భగవంతునికి ప్రీతి పాత్రం కావాలంటే తాము ఎలా జీవించాలో తెలుసుకొని అలా జీవించే వ్యక్తులు సాత్వతులు  అని కూడా పిలవబడే చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు

గురుపరంపరను అనుసంధానం చేసుకొని ‘అష్టాక్షరీ’నే ఎంతో ప్రేమతో జపించేవారని తెలుస్తుంది.[3]

చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణుల యొక్క చరిత్ర

[మార్చు]

శాతవాహనుల కాలంలోనూ చోళ రాజుల కాలంలోను పాండ్యుల కాలంలోనూ విజయనగర సామ్రాజ్యాధిషులైన సాలువ నరసింహ రాయలు మరియు కృష్ణదేవరాయలు కాలంలోనూ కాకతీయ సామ్రాజ్య కాలంలోనూ వీరి వైభవం అత్యంత పరమోన్నతంగా వికసించింది వీరు ఆ కాలంల ఈ రాజ్యాలలో మంత్రులుగా అగ్రహారాధీశులుగా బ్రాహ్మణులకే తలమానికంగా నిలిచినటువంటి చరిత్ర కనబడుతుంది

ముఖ్యంగా శఠగోప యతి అనే చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణుడు విజయనగర అధీశులకు గురువుగా వ్యవహరించినట్టు చారిత్రిక ఆధారాలు తెలియజేస్తున్నాయి అలాగే కృష్ణదేవరాయలు కాలంలోని అల్లసాని పెద్దన చాత్తాద శ్రీవైష్ణ బ్రాహ్మణ తెగు చెందినవాడు శ్రీ పరావస్తు పీఠానికి చెందిన పరావస్తు చిన్నయ సూరి అద్భుతమైన కవిగా వెలసిల్లాడు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో కాకుచ్చం శేషప్పకవి చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణుడిగా అద్భుతమైన సేవలను అందించారు విశేషమైన పద్య కవితలతో ఆకట్టుకున్నారు హనుమద్దాసు విశేషమైనటువంటి కీర్తనలతో ఆకట్టుకున్నారు తెలంగాణ గోర్కీగా ప్రసిద్ధి చెందిన తిరునగిరి రామాంజనేయులు తిరుమల తిరుపతి దేవస్థానాలను నడిపిన కందాడై రామానుజ అయ్యంగార్ ఇలా చెప్పుకుంటూపోతేకొన్నివందలమందికవులుఈచాత్తాదశ్రీవైష్ణవబ్రాహ్మణ సమాజంలో ఉన్నారు

తెలంగాణలోని హైద్రాబాద్, వరంగల్, కరింనగర్ జిల్లాలలో వీళ్ళు అధికంగా వున్నారు.[4]

చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణ జీయర్లు

[మార్చు]

పరావస్తు పీఠానికి సంబంధించినటువంటి కొన్ని గ్రంథాలలో

ముక్తవరం పీఠానికి యాదవాద్రి జీయరుస్వామి

విలాస సాగర మఠానికి శఠగోపదేశకులను జీయర్ స్వామి

కేశవపురం మఠానికి మానవాల జీయర్

తాళ్లూరి మఠానికి యతిరాజజీయర్

మాగడి మఠానికి అసూరి యతిరాజ జీయర్ ను

శిబి మఠానికి కురుతాళ్వార్ జీయర్ ను

కర్ణాటకలోని తుముకూరు కఠికల్లు, కొప్పం, నరసింహరాజపురం, బేలూరు, తిరునారాయణపురం, కారక్కి, అమ్మలఝరి మొదలయిన ప్రాంతాలలో జీయర్ మఠ అధిపతులుగా చేసినట్టు ఆధారాలు ఉన్నాయి

కవులు

[మార్చు]

చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణ కవులు కొంతమంది

1.శఠగోపయతి

2.అల్లసాని పెద్దన

3.పరావస్తు చిన్నయ సూరి

4.శేషప్ప కవి ధర్మపురి

5.మన్నెంకొండ హనుమద్దాసు

6.తిరునగరి రామాంజనేయులు

7.అజగీయ మానవాళ మహాముని

8.కందాడై రామానుజ అయ్యంగార్

9.డా. తిరునగరి రామానుజయ్య

10.సింహగిరి కృష్ణమాచార్యులు

11.బుక్కపట్టణం బుచ్చి వెంకటాచార్యులు

12.తిరుకోవలూరు శ్రీరంగస్వామి

13.శ్రీపెరంబుదూర్ జై కిషన్

14.అనంత దాసు తిరునగరి

15.అనంతయ్య కాకుత్సం

16.అనంతయ్య ప్రబంధం

17.అప్పదాసు

18.ఆంజనేయులు తిరునగరి

19.ఆదివరాహచార్యులు శ్రీ కుమారస్వామి

20.ఆనందయ్య సూరి చిన్న

21.ఆరావముదయ్య -మళయనూర్ రాశీపురం

22.ఆవులన్న హిందూపురం

23.ఉదయవర్లు టి

24.కనకశ్రీ రామమూర్తి, మాధవపురి

25.కన్నయ్యర్ కవిలి

26.కిష్టయ్య ఆర్తి

27.కూరత్తాల్వార్ అయ్యంగార్

28.కృష్ణదాసు ఉప్పరి పల్లె

29.కృష్ణ దాసు తిరునగరి

30.కృష్ణదాసు ప్రబంధం

31.కృష్ణమూర్తి, అందలం

32.కృష్ణమూర్తి వేముల

33.కృష్ణమూర్తి సుదర్శనం

34.కృష్ణయ్య పంతులు తిరునగరి

35.కేశవయ్య గని

36.కేశవయ్య -పురుషకారి -నంబెరుమాళ్ళ -సురపురం

37.కేశవయ్య పుసులూరి

38.కేశవాచార్యులు పేరుసోముల

39.గోపాలయ్య మణిమణి

40.గోపాలకవి మణిమణి

41.గోపాల కృష్ణయ్య పరాంకుశం

42.చంద్రప్రభావతమ్మ చెన్నోజ్వల

43.చిన్నయ్య సూరి పరవస్తు

44.జగన్నాథం విష్ణువర్ధనాచార్యులు

45.జగన్నాథయ్య బళ్లారి

46.జనార్ధనసూరి శ్రీవచన భూషణం

47.జనార్దనసామి సన్నిధి

48.జీవయ్య, అందలం

49.జియ్యరయ్య కేశవపట్నం

50.జియ్యరు సూరి పరవస్తు

51.జ్యోతిరాణి, ఎ

52.తిరువేంకటదాసు పరవస్తు

53.చిరువెంగల జీయరయ్య, సేలం

54.తిరువెంగళయ్య గూడూరు

55.తిరువెంగళయ్య, కేశవపట్నం

56.తిరువెంగళసూరి,

57.తులసయ్య కోవెలదిన్నే

58.తులసీదాసు పొన్నూరు

59.తేవప్పెరుమాళ్ళయ్య తుంజనగరం

60.తేవప్పెరుమాళ్ళయ్య పంచాంగం

61.దామోదరస్వామి, పరాంకుశం

62.దశరథరామయ్య పట్టెం

63.దేవ పెరుమాళ్ళయ్య నిష్కంధ

64.దేవరాజసుది తుంజజనగరం

65.దొరసామయ్యర్ ఓమందుర్

66.ధనంజయ, పరవస్తు

67.నరసయ్య బైరి

68.నరసింహస్వామి ఆర్తి

69.నరసింహులు టి.వి.

70.నంబెరుమాళ్లు పరవస్తు

71.నంబెరుమాళ్లు భద్రగిరి

72.నమ్మాళ్వారు ఆర్తి

73.నరసయ్య నెల్లూరు

74.నరసింహదాసు కాకుత్సం

75.నరసింహదాసు వానమామల

76.నరసింహ యోగి వకలాభరణం

77.నరసింహయ్య చింతమాకుల సేలం

78.నరసింహసూరి పూదత్తు

79.నరసింహచార్యులు అన్నదానం

80.నరసింహ స్వామి తిరునగరి

81.నారాయణ ఊరుకొండ

82.నారాయణ పంతులు తిరునగరి

83.నారాయణ దాసు పట్టెం

84.నారాయణస్వామి సరసకవి

85.పరంధామయ్య అప్పరాల

86.పరాంకుశ దాసు

87.పాండురంగయ్య కవి. టి

88.పాండురంగయ్య గూడూరు

89.పాప కవి  పట్టం

90.పాపయ్య పట్టెం

91.ప్రభావతమ్మ,యల్లకర

92.బాలయ్య తిన్నవెల్లి

93.బాలభాస్కర్ తిరునగరి

94.భాష్యకార్లయ్య శ్రీ రేఖం

95.భుజంగ స్వామి భాగవతార్

96.మణవాళజీయర్ పరవస్తు అళకియ

97.మణవాళ రామానుజ జీయర్ పరవస్తు అళకియ

98.మణవాలయ్య ప్రళయ కావేరి

99.మధుసూదన స్వామి కర్పూరం

100.మనవాళ్ళసూరి తాళ్లూరి

101.మధుసూదనస్వామి తిరుకోవలూరు

102.మారుతీకుమారి కొమాండూరి

103.మధుసూదనాచార్యులు యం.

104.మాల్యాద్రి లక్ష్మీ నరసింహ సూరి పరవస్తు

105.మునినాధ కవి

106.యల్లకర (యతిశ్రీ)

107.యాదగిరిస్వామి, తాళూరు.

108.రంగనాధస్వామి బందవరం

109.రంగదాసు.

110.రమేష్ తిరుక్కోవలూరు

111.రమేష్ తిరునగరి

112.రంగకవి తిరువాయిపేట

113.రంగదాసు కవి

114.రంగమన్నారయ్య తుంజనగరం

115.రంగయ్య పూదత్తు

116.గంగయ్య మేల్నాటి

117.రంగయ్య పంతులు తిరునగరి

118.రంగయ్య మహల్

119.రంగయ్యసూరి ‌ కొమ్మి

120.రంగయ్య సూరి తిరువాయి పాటి

121.రంగరామానుజయ్య చామరం

122.రంగానంద స్వామి

123.రామచంద్ర కవి తిరునగరి

124.మాంజనేయులు తిరునగరి

125.రామానుజయ్య ముష్టూరు

126.రామానుజయ్య బుక్కపట్నం

127.రామానుజసూరి తిరునగరి

128.రామానుజసూరి శ్రీ రేఖం

129.రామనుజస్వామి తిరుకోవేలూరి

130.రామవతారం భద్రగిరి

131.రాందాసు తిరువాన్కూరు

132.రామశేషయ్య వి.

133.లక్ష్మీనారాయణ. ఎస్.

134.లక్ష్మణదాసు పట్టెం

135.లక్ష్మణాచార్యులు కొండ

136.లక్ష్మయ్య మేల్నాటి

137.లక్ష్మణస్వామి వేముల

138.లక్ష్మీనరసమ్మ బి

139.లక్ష్మీ నరసింహ స్వామి టి

140.లక్ష్మీనారాయణ అర్చకం

141.లింబగిరిస్వామి శ్రీ పెరుంబుదూర్

142.లోకయ్య పురుషకారి నంబెరుమాళ్ళ

143.లోకయ్య పెరంబుదూరి పురుషకారి

144.వకులాభరణం ఏకాంగి దేశికులు కోనేరు

145.వకుళాభరణం నారాయణవనం

146.వసంతరాయ కదిరి

147.విఠోబ

148.విజయకిశోర్, తిరునగరి

149.విజయలక్ష్మి, నేరెడుకొమ్మ.

150.విజయార్కే

151.వెంకటకృష్ణకవి పెదమందడి

152.వెంకటదాసు తిరునగరి

153.వేంకటనరసయ్య పంతులు వేంకటయ్య అయ్యవారు

154.వేంకటనరససూరి తిరునగరి

155.వెంకటయ్య అర్చకం

156.వేంకటరత్నకవి మాధవపురి

157.వేంకటరంగయ్య కోవెలదిన్నె

158.వేంకటరమణయ్య తిరునగరి

159.వేంకటరామయ్య హరిపురం

160.వేంకటాచార్యులు తిరునగరి

161.వేంకట్రామ నరసయ్య పరాంకుశం

162.వేంకటాచారి తెన్మఠం

163.వేంకటాచార్యులు మణిమణి

164.వేదాంతసూరి. టి

165.వేంకటకిష్టయ్య, నేరెడుకొమ్మ

166.వేంకటగోదాదేవి, పరవస్తు

168.వేంకటరత్నయ్య తిరునగరి

169.వేంకటరమణమూర్తి, వి.డి

170.వేంకటరమణాచార్యులు. లద్దగిరి

171.వేంకటస్వామి, రంగనాయకుల

172.వెంకయ్య తిరునగరి

173.వేంకయ్యసూరి పరవస్తు విద్వాన్

174.వేంకటకవి తిరువాయి పాటి

175.శఠగోపయ్యర్ సేలం కటకం

176.శఠకోపాచార్యులు పరవస్తు

177.శేషదాసు తిరునగరి

178.శేషదాసు లోకాయపల్లె

179.శేషయ్య చుండూరు

180.శేషయ్య సుల్తానాపురం

181.శేషసూరి పూదత్తు

182.శేషసూరి సూరవరం

183.శేషకవి మణిమణి

184.శ్రీనివాసకవి వడ్డెమాను

185.శ్రీనివాస రామానుజసూరి రాయపేట

186.శ్రీనివాస స్వామి కర్పూరం

187.శ్రీ వాసాచారి తిరుక్కోవెల

188.శ్రీరంగగాచార్యులు తిరుచానూరు

199.శ్రీ రామయ్య హరిపురం

200.శ్రీహరి పూదత్తు

201.సమ్మయ్య

202.సింహాచలం ప్రభాకరాచార్యులు

203.సామయ్య

204.సీతారామదాసు వట్టెం

205.స్వామినాథ్ తిరునగరి

206.సింహయ్య వట్టెం

207 శేషము వేంకటపతి

మూలాలు

[మార్చు]
  1. "చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణులు | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2025-08-11.
  2. https://te.wikipedia.org/wiki/కురుమూర్తి_వెంకటేశ్వరస్వామి_దేవాలయం  – via Wikisource.
  3. గుర్తింపునకు నోచని చాత్తాద వైష్ణవులు : కూర్మాచలం వేంకటేశ్వర్లు వ్యాసం: 24 మార్చి 2016 : ఆంధ్రజ్యోతి -
  4. *http://www.suryaa.com/showspecialstories.asp?ContentId=6094[permanent dead link]

5.https://www.scribd.com/document/900779116/ChAttada-SrI-VaiShNava-BrAhmaNa-AcArya-LakShaNam

6.https://www.scribd.com/document/899670719/chattada-srivaishnava-bramhins


"https://te.wikipedia.org/w/index.php?title=సాతాని&oldid=4636367" నుండి వెలికితీశారు