అయిండ్ల భీంరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయిండ్ల భీంరెడ్డి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్
పదవీ కాలం
1985 - 1989

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 - 1985
ముందు పి.గంగారెడ్డి
తరువాత ఎస్.వేణుగోపాలచారి
నియోజకవర్గం నిర్మల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
నిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
సంతానం స్వర్ణారెడ్డి

అయిండ్ల భీంరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి,  శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

అయిండ్ల భీంరెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1983లో నిర్మల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.గంగా రెడ్డిపై 16149 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబీలి ఎన్నికయ్యాడు. ఆయన 1983 నుండి 1985 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[2][3]

అయిండ్ల భీంరెడ్డి 1985లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి, మూడోస్థానంలో నిలిచాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 October 2023). "నిర్మల్‌". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Eenadu (8 December 2023). "రాజులకోట.. ఉద్ధండుల బాట". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Sakshi (4 November 2023). "నిర్మల్‌ క్షేత్రంలో రెడ్డిలదే హవా". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.