ఆరవీటి గోపాలరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆరవీటి గోపాలరాజు, కందెనవోలు (కర్నూలు) యొక్క చివరి హిందూ పాలకుడు. విజయనగర సామ్రాజ్యపు అమరనాయకుడు. గోపాలరాజు అళియ రామరాయల చిన తమ్ముడైన వెంకటాద్రి రాయలు యొక్క మనవడు, ఆరవీటి శ్రీరంగరాయలు యొక్క మునిమనవడు.

1619-20 లో బీజాపూర్ సుల్తానుల గవర్నర్ అయిన అబ్దుల్ వహాబ్ ఖాన్, విజయనగర సామ్రాజ్యపు సామంత రాజైన ఆరవీటి గోపాలరాజు మధ్య యుద్ధం జరిగినది.[1] గోపాలరాజు తన బంధువులైన ఆనెగొంది, గండికోట, అవుకు, పెనుగొండ రాజుల సహాయంతో వహాబ్ ఖాన్ ను తిప్పి కొట్టాడు.[2] వహాబ్ ఖాన్ కర్నూలు కోటను ఆక్రమించే తొలి ప్రయత్నంలో విఫలుడైనాడు. వహాబ్ ఖాన్ 1624లో రెండవసారి దండయాత్ర చేశాడు. ఈసారి గోపాలరాజు తన బంధువుల నుండి ఏ సహాయాన్ని పొందలేకపోయాడు. ఒంటరిగా పోరాడి పరాజయం పాలయ్యాడు. వహాబ్ ఖాన్ కర్నూలును వశపరచుకున్నాడు. బీజాపూరు సుల్తాను, రెండవ ఇబ్రహీం ఆదిల్ షా, ఈ విజయానికి కానుకగా వహాబ్ ఖాన్ ను కర్నూలు నవాబుగా ప్రకటించాడు.

కందనవోలు బుర్జు

గోపాలరాజుకు సంతానం లేనందున, అళియ రామరాయల మనవడు పిన వెంకటరాయలు యొక్క కుమారుడైన శ్రీరంగరాయలను దత్తతు తీసుకున్నాడు. ఈ శ్రీరంగ రాయలే విజయనగర సామ్రాజ్యపు చివరి రాజు.

మూలాలు[మార్చు]

  1. K. A., Nilakanta Sastri (1966). A History of South India: From Prehistoric Times to the Fall of Vijayanagar (Third ed.). Oxford University Press. p. 302.
  2. "Gopal Darwaza stands as a witness to history". The Hindu. No. April 22, 2014. Retrieved 6 December 2014.