కులశేఖరుడు

వికీపీడియా నుండి
కులశేఖర ఆళ్వార్‌
నామాంతరములు పెరుమాళ్‌
జన్మస్థలం శ్రీరంగం
జన్మ నక్షత్రము పునర్వసు
రచనలు ముకుందమాల, పెరుమాళ్ తిరుమొళి

పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్‌ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్‌’, (అంటే ‘అతి గొప్పవాడు’ – సాధారణముగ వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.ఈయన వేంకటేశ్వరస్వామి ని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తదాస్థు అన్నారట.నేటికీ తిరుమల లో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.

"http://te.wikipedia.org/w/index.php?title=కులశేఖరుడు&oldid=806512" నుండి వెలికితీశారు