గుద మైథునం
గుదద్వారములో (గుదము, ముడ్డి)లో సంభోగం జరపడాన్ని గుద మైథునం లేదా గుదరతి అంటారు. ఈ రకమైన సంభోగంలో ఎక్కువగా స్వలింగసంపర్కులు పాల్గొన్నా, ఈ మథ్యకాలంలో చాలామంది బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన సంభోగం (గుద మైథునం) ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు మగవారు మాత్రమే ఈ తరహా సంభోగం ద్వారా సుఖ పడతారని అనే అపోహ ఉండేది. కానీ, ఇటీవల జరిగిన పరిశొదనల్లో స్త్రీలు కూడా ఈ గుదమైథునం ద్వారా భావప్రాప్తి పొంది, తద్వారా సుఖ పడతారని తేలింది.
.
ఇందుకు కారణం, స్త్రీలోని గుద లోపలిపొర, యోనిలోని లోపొర ఒక్కటే కావడం. జాగ్రత్తగా, నేర్పుగా భర్తగనుక, బార్యగుదను మైథునం చేస్తే, బార్య కూడా సుఖిస్తుందని తేలింది. అయితే గుద కండరాలకు, యోని కండరాల లాగా సాగే గుణం లేదు. అందువల్ల రాపిడి ఎక్కువై, గుదలో గాయం కావడం, మంటపుట్టడం లాంటి ప్రమాదాలు అనేకం జరుగ వచ్చు. ఇందుకు కెవై జెల్ లాంటి 'లూబ్రికెంట్స్' వైద్యులు సూచిస్తుంటారు. నపుంసకులు వ్యభిచారానికి గుదమైథునం అవలంబిస్తారు. అయితే గుదరతిలో అనేక సమస్యలున్నాయి. రతిలోగుదలోపలి భాగం అనేక రకములైన బాక్టీరియాలకు నిలయం. అందువల్ల మొగవాడి అంగానికి రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే గుద మైథునంలో తప్పని సరిగా తొడుగు వాడమని వైద్యుల సలహా. ఈ విదమైన సంభోగం ముఖ్యంగా అపరిచుతులతో జరిపినప్పుడు హెచైవికి దారి తీస్తుందని వెల్లడయింది.