చర్చ:క్రిష్టంశెట్టిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రిష్ణంశెట్టిపల్లె గిద్దలూరు, నంద్యాల మార్గంలో ఉన్న గ్రామం, పంచాయితీ కేంద్రము. ఇది ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలంలోని ఒక గ్రామం. దీని పంచాయితీ పరిధిలో అక్కలరెడ్డిపల్లె, దిగువమెట్ట, దిగువమెట్ట తాండా, ఉప్పలపాడు గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి సమీపంలో సగిలేరు నది పారుతూ ఉంది. క్రిష్ణంశెట్టిపల్లె గిద్దలూరు మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి. ఈ గ్రామ సమీపంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికీ, బ్రిటీష్ పోలీసులకూ నడుమ ఎన్ కౌంటర్ జరిగినట్టుగా చరిత్ర చెపుతుంది. ఈ గ్రామంలో ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం బాగా ప్రసిద్ధి పొందినది. దీనిని చాళుక్య భీముడు కట్టించినట్టుగా వినికిడి ఉంది.