పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నెల్లూరు జిల్లా సీతారాంపురము మండలంలో , శ్రీ శ్రీ శ్రీ రంగనాయక స్వామి(విఠలేశ్వర స్వామి లేదా పాండురంగ స్వామి) ఆలయం ఉంది.ఆలయానికి తూర్పున శ్రీ శ్రీ శ్రీ కాశిరెడ్డినాయన స్వామి ఆలయం కూడా ఉంది.

శ్రీ శ్రీ శ్రీ రంగనాయక స్వామి ఆలయం[మార్చు]

ఇది నెల్లూరునకు 120 కిమీ దూరంలో కలదు. ఈ పుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లా సీతారాంపురము మండలంలో , మండల కేంద్రానికి దక్షిణాన, పాండురంగా పురానికి పశ్చిమాన కావుకొండ మీద శ్రీ శ్రీ శ్ర్రీ రంగనాయక స్వామి(విఠలేశ్వర స్వామి లేదా పాండురంగ స్వామి) ఆలయం ఉంది. ప్రతీ ఏటా ఇక్కడ తిరునాళ జరుతుంది. ఈ తిరునాళ ఐదు రోజుల పాటు (అంకురార్పనణ, గరుడ సేవ, నృత్యం) జరుగుతుంది. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు.

చరిత్ర[మార్చు]

ఈ ఆలయానికి శ్రీ కృష్ణదేవరాయుల కాలం నాటి చరిత్ర ఉంది.ఇక్కడ శ్రీ కృష్ణదేవరాయులుచే కట్టబడిన ఓ చెరువు కూడా ఆలయానికి నైరుతీ దిశలో ఉంది.

ప్రకృతి సౌందర్యం[మార్చు]

ఈ ఆలయం కావుకొండ పైన ఉంది.ఉత్తర,తూర్పు దిశగా పచ్చని పంటపొలాలు ఉన్నాయి.ఆలయానికి పశ్చిమాన, దక్షిణాన ఎత్తైన కొండలు(వెలి కొండలు:తూర్పుకనుమల ప్రాంతీయ పేరు),దట్టమైన అడవులు ఉన్నాయి.కొండ పై నుంచి చుస్తే చుట్టు ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగాను,చూడ ముచ్చటగా ఉంటుంది.

వసతి సౌకర్యము[మార్చు]

దూర ప్రాంత, ప్రత్యేక వసతులు కావలనుకున్న భక్తులు పోరుమామిళ్ల గానీ,ఉదయగిరి పూటకూళ్ళ ఇళ్ళలో (లాడ్జి) లలో బస చేయవలసి ఉంటుంది.దగ్గరి ప్రాంతాల భక్తులు అయితే స్వమిని దర్శించుకుని సాయంకాలం సమయానికి గృహం చేరుకోవచ్చు. సీతారామపురం నుండి(5 కి.మీ), నారాణయప్ప పేట నుండి(1.5 కి. మీ) అస్తమానం ఆటో సౌకర్యం ఉంటుంది.

మార్గం[మార్చు]

  • ఉదయగిరి - సీతారామపురం వచ్చి,అక్కడ నుంచి 7 కిలోమీటర్ల వరకు ప్రయాణం చెస్తే శ్రీ శ్రీ శ్ర్రీ రంగనాయక స్వామి ఆలయం వస్తుంది.
  • నెల్లూరు నుండి ఆత్మకూరు, ఉదయగిరి మీదుగ సీతారామపురంనకు రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును.