పానిపట్టు యుద్ధం
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పానిపట్టు యుద్ధాలు 1526, 1556, 1761 లో జరిగిన ఉత్తరభారతదేశ చరిత్రలో మూడు ముఖ్యమైన యుద్ధాలు. మొదటి యుద్ధం భారతదేశంలో మొఘలాయిల పరిపాలనకు నాంది పలకగా, రెండవ యుద్ధం పట్టు మొఘలుల పట్టు నిలుపుకొనేందుకు, మూడవ యుద్ధం వారి పాలనకు అంతమయ్యేందుకు కారణమయ్యాయి.
మొదటి పానిపట్టు యుద్ధంలో ఏప్రిల్ 21, 1526 న మొఘలుల నాయకుడైన బాబర్ కూ, అప్పటి కాబూల్ పరిపాలకుడైన సుల్తాన్ ఇబ్రాహీం లోడీ కి మధ్య జరిగింది. సుల్తాన్ సైన్యం మొఘలాయిల సైన్యం కన్నా చాలా పెద్దది. కానీ అందరూ ఒక్కసారిగా పాల్గొనకుండా విడివిడిగా పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ మరణించాడు. అతని సైన్యం సులభంగా ఓడిపోయినది. భారతదేశంలో మొఘలుల పరిపాలనకు ఇదే నాంది.
రెండవ పానిపట్టు యుద్ధం, నవంబర్ 5, 1556 లో మొఘల్ వారసుడైన అక్బర్ సంరక్షుడిగా ఉన్న బైరం ఖాన్ కు, మరియు ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన హిందూ సైన్యాధ్యక్షుడు హేముకు మధ్య జరిగింది. ఇందులో విజయం బైరం ఖాన్ ను వరించింది. దీంతో మొఘలులు అధికారంపై తమ పట్టు నిలుపుకొన్నట్లైంది.